శాస్త్రోక్తంగా చొక్కాని ఉత్సవం
తమిళ కార్తికం, కృత్తికా నక్షత్రం రోజును పురస్కరించుకుని నిర్వహించిన చొక్కాణి ఉత్సవం ఆద్యంతం శాస్త్రోక్తంగా సాగింది.
ఊరేగింపులో శ్రీవిశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి
శ్రీకాళహస్తి, న్యూస్టుడే: తమిళ కార్తికం, కృత్తికా నక్షత్రం రోజును పురస్కరించుకుని నిర్వహించిన చొక్కాణి ఉత్సవం ఆద్యంతం శాస్త్రోక్తంగా సాగింది. ఈ సందర్భంగా మంగళవారం ఆలయ ఆవరణలోని నగరికుమారుల మండపం వద్ద చొక్కాని మానును ఏర్పాటు చేసి అగ్నికి ఆహుతి చేశారు. ఆలయ అనువంశీక ప్రధాన దీక్షా గురుకుల్ స్వామినాథన్ ఆధ్వర్యంలో సంకల్పపూజలు జరిగాయి. శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామి ఉత్సవమూర్తులకు తొలుత విశేష పూజలు నిర్వహించారు. అనంతరం తాళవృక్షాలను అగ్నికి ఆహుతి చేశారు. శ్రీవిశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి, ఆలయ ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో కె.వి.సాగర్బాబు తదితరులు పాల్గొన్నారు.
నేడు కార్తిక పర్వ దీపోత్సవం
తిరుమల: శ్రీవారి ఆలయంలో బుధవారం సాలకట్ల కార్తిక దీపోత్సవాన్ని తితిదే ఘనంగా నిర్వహించనుంది. ఆలయం అంతటా, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామిపుష్కరిణి వద్ద దీపాలు ఏర్పాటు చేస్తారు. గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ జరుగనుంది.
సర్వదర్శనానికి ఆరు గంటలు
తిరుమల: మంగళవారం సాయంత్రానికి శ్రీవారి ధర్మదర్శనానికి క్యూలైన్లలోకి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు ఆరు గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. సోమవారం శ్రీవారిని 66,020 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.4.37 కోట్ల హుండీ కానుకలు లభించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
[ 18-04-2024]
ఎన్నికల నియమావళిని వాలంటీర్లు పట్టించుకోవడం లేదు. తాజాగా 29వ వార్డు వాలంటీరుగా పని చేస్తున్న నజీర్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డిని సత్కరించడం విమర్శలకు కారణమవుతోంది. -
ఉత్తిదే.. ‘ఇంటికే వైద్యం’ అందదే!
[ 18-04-2024]
ఇంటి ముంగిటకే వైద్య సేవలంటూ ప్రచారాలు మార్మోగాయి. వైద్యులే గ్రామానికి వచ్చి నాడి పట్టి.. రోగాన్ని గుర్తించి.. మందులిస్తారని డప్పుకొట్టి మరీ చెప్పారు. కొత్త వైద్యం కోసం ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూసేకోద్దీ అవన్నీ ఉత్తుత్తేనని తేలిపోయింది. -
కర్ణాటక మద్యం తరలిస్తూ...
[ 18-04-2024]
కుప్పం మండలం పరిధిలోని పైపాళ్యం పంచాయతీ చిన్నబొగ్గుపల్లి గ్రామానికి చెందిన వైకాపా సోషల్ మీడియా సభ్యుడు కుప్పస్వామి, అతని స్నేహితుడు సంపత్ కర్ణాటక మద్యాన్ని కుప్పానికి తీసుకొస్తుండగా బుధవారం కుప్పం ఎస్ఈబీ పోలీసులు అరెస్టు చేశారు. -
మళ్లీ విధ్వంస రచన!
[ 18-04-2024]
నాలుగేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు నామినేషన్లే వేయనీయకుండా వైకాపా నేతలు దాడులు, దౌర్జన్యానికి దిగి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. -
పస్తులతో పనులు చేస్తున్నాం
[ 18-04-2024]
త్రిరాష్ట్ర కూడలిలో ఏర్పాటైన ద్రవిడ వర్సిటీలో ఒకప్పుడు సీటు దొరకడమే కష్టం. తెదేపా హయాంలో వెలిగిపోయిన వర్సిటీ.. వైకాపా పాలకుల కక్ష సాధింపు చర్యలకు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. -
20న చంద్రబాబు పర్యటన
[ 18-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 20న తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు గూడూరులో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. -
జడ్పీలో లేకున్నా అతనే కీలకం
[ 18-04-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లోని దస్త్రాలు విభాగాల్లో లేదా జిల్లా అధికారుల వద్ద ఉండాలి. జిల్లా పరిషత్లోని వందలాది దస్త్రాలు ఈ కార్యాలయానికి సంబంధం లేని ఓ గుమస్తా వద్ద ఉండటం కలకలం రేపింది. -
సమగ్ర శిక్షే
[ 18-04-2024]
విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం చెప్పే వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఎండమావులుగా మిగిలిపోతున్నాయి.. ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేసే ఉద్యోగులకు ఈ ఐదేళ్లలో ఒరిగిందేమీ లేదు.. -
ఇంట్లో దూరింది నిజమే..
[ 18-04-2024]
జడ్పీ నోడల్ అధికారి బాలాజీ ఇంట్లోకి.. బైరెడ్డిపల్లె ఇన్ఛార్జి ఎంపీడీవో రాజేష్, ఏవో రాజేంద్రతో కలిసి చొరబడి పరిశీలించింది వాస్తమేనని నిర్ధారణ అయింది. పూర్వ అధికారికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఓ జిల్లా అధికారి దీనిపై ఆరా తీసినట్లు సమాచారం. -
అంతంతమాత్రమే ‘కరుణ’?
[ 18-04-2024]
తితిదే పరిధిలోని బర్డ్ అసుపత్రిలో పనిచేస్తున్న స్పీచ్ థెరపిస్టు రూ.22,907 జీతం పొందేవారు. తాజా పెంపుతో రూ.25 వేలకు చేరింది. వేదపారాయణదారు పోస్టుకు నెలకు రూ.21,500 చెల్లిస్తుండగా.. -
వసతిగృహ విద్యార్థులతో పనులు?
[ 18-04-2024]
బీసీ గురుకుల పాఠశాల, వసతిగృహ అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి కాలు పోగొట్టుకునే ప్రమాదం నుంచి బయటపడ్డారు. తిరుపతి గ్రామీణ మండలంలోని తాటితోపు వద్ద మహాత్మా జ్యోతిరావ్ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. -
ఉప కారాగారంలో రిమాండ్ ఖైదీ మృతి
[ 18-04-2024]
మద్యం కేసులో అరెస్టైన నిందితుడు మదనపల్లె ఉప కారాగారంలో అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందారు. జిల్లాలోని పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన మొగిలప్ప (67)ను స్థానిక పోలీసులు ఈనెల 16న మద్యం కేసు అరెస్టు చేశారు. -
ఇంటింటా వైద్యం అబద్ధం
[ 18-04-2024]
‘గ్రామీణ ప్రజల ఇంటి వద్దకు వైద్యులు వెళ్లి నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చాం.. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్యవిధానాన్ని పేద, మధ్య తరగతి ప్రజల ముంగిటకు తెచ్చిన ప్రభుత్వం మాదే’ -
ఇక బెదిరేది లేదంటూ..
[ 18-04-2024]
ఆస్తులు, భూములు లాక్కుంటారని, కుటుంబ సభ్యులపై దాడులకు తెగబడతారని, ఇతరత్రా బెదిరింపులకు గురి చేస్తారని ఇన్నాళ్లు భయపడుతూ వైకాపాలో నలిగిన నేతలు ఇప్పుడు నిర్భయంగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. -
నామినేషన్ల పర్వానికి వేళాయే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి అడుగులు పడ్డాయి. నోటిఫికేషన్ ప్రచురణ, నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిధిలోని ఒక లోక్సభ స్థానం, ఏడు శాసనసభ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
అభినయ్ ఓటమి ఖాయం: పవన్ కల్యాణ్
[ 18-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందించారు. ఎన్డీయే తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అందులో ఉన్నారు. -
గుట్టచప్పుడు కాకుండా..
[ 18-04-2024]
అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో వైకాపా నేతలు అక్రమాలకు తెగబడుతున్నారు. తమ కనుచూపు మేరలో కనిపించిన ప్రభుత్వ భూములను కబ్జా చేయడంతోపాటు గుట్టలను చదును చేసి ఆక్రమిస్తున్నారు. -
ఇంటి స్థలం అడిగితే మూడేళ్లుగా పట్టించుకోలేదు
[ 18-04-2024]
ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న అధికార పార్టీ అభ్యర్థులకు చుక్కెదురవుతోంది. పథకాలు అందకపోవడంపై నిలదీస్తున్నారు. మూడేళ్లుగా ఇళ్ల స్థలం కోసం వినతిపత్రాలు ఇస్తున్నా.. ఏనాడూ పట్టించుకోలేదు..
తాజా వార్తలు (Latest News)
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
-
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత