ఎంచక్కా.. పరిహారం కొట్టేయాలని!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చిత్తూరు మండలంలోని కొందరు రెవెన్యూ సిబ్బంది, చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థలోని పలువురు భూసేకరణ పరిహారం కొట్టేయాలని వ్యూహం పన్నారు.
ఎంఐజీ లే ఔట్లో సొమ్ము చేసుకునేందుకు పన్నాగం
చుడా అధికారులు, సిబ్బంది జత కలిశారని ఆరోపణలు
కోడిగుంటలో ఎంఐజీ లే ఔట్కు ఎంపిక చేసిన స్థలం
ఈనాడు డిజిటల్, చిత్తూరు: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చిత్తూరు మండలంలోని కొందరు రెవెన్యూ సిబ్బంది, చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థలోని పలువురు భూసేకరణ పరిహారం కొట్టేయాలని వ్యూహం పన్నారు. గతంలోని పట్టాదారుల వివరాలను ఆన్లైన్లో తొలగించి.. బినామీల పేర్లు ఎక్కించారనే ఆరోపణలున్నాయి. అప్పీళ్లకు విధించిన గడువు పూర్తి కాకుండానే ఈ తంతు ముగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణ ముగిసే వరకు కొత్తగా ఆన్లైన్లోకి భూమి ఎక్కించుకున్న వ్యక్తులకు పరిహారం ఇవ్వకూడదని ఆదేశించడంతో ఈ బాగోతానికి అడ్డుకట్ట పడ్డట్లయింది. ఈ మొత్తం వ్యవహారంలో ఓ రెవెన్యూ అధికారి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం మధ్యాదాయ వర్గాలకు (ఎంఐజీ) తక్కువ ధరకే ప్లాట్లు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం మురకంబట్టు బైపాస్ తిమ్మసముద్రం రెవెన్యూ కోడిగుంటలో సుమారు 35 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించారు. వాస్తవంగా ఈ ప్రాంతంలో చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉన్నారు. నాలుగైదేళ్లుగా వీరిలో కొందరు సాగుకు దూరంగా ఉన్నారు. తమకు ఉన్నదే తక్కువ విస్తీర్ణమైనందున భూములు ఇవ్వలేమని ఎక్కువ మంది భీష్మించారు. ఉన్నతాధికారులు రంగంలోకి దిగి రూ.63 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పడంతో కొందరు ముందుకొచ్చారు. బాధిత రైతులకు పరిహారం చెల్లించేందుకు రూ.12 కోట్లు జమయ్యాయి. భూసేకరణ ప్రక్రియను రెవెన్యూ అధికారులు పూర్తి చేసి.. అభివృద్ధి కోసం చిత్తూరు పట్టణాభివృద్ధి సంస్థ (చుడా)కు అప్పగించాలి. తొలుత గ్రామసభ నిర్వహించినప్పుడు చుడా అధికారులు, సిబ్బంది కూడా జోక్యం చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
అప్పీళ్ల గడువు ముగియకుండానే ఆన్లైన్లోకి..: తిమ్మసముద్రం రెవెన్యూలో ఎంఐజీ లే ఔట్కు భూములు ఇవ్వడానికి నిరాకరించిన నలుగురి వివరాలను ఆన్లైన్ నుంచి తొలగించేశారు. ఏ ప్రాతిపదికపై వాటిని తొలగించారని ఆరా తీయగా ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. సదరు వ్యక్తుల అనుభవంలో ఉన్న పట్టా భూమి తమ పూర్వీకులదంటూ కొందరు డివిజన్ స్థాయి రెవెన్యూ అధికారులకు అర్జీ ఇచ్చారు. గతంలో ఇది డీకేటీగా ఉందని అందులో పేర్కొన్నారు. వీరంతా స్థానికేతరులు కావడం గమనార్హం. అలాంటప్పుడు వీరికి భూమి ఎలా కేటాయించారనే సందేహాలున్నాయి. దీనిపై రెవెన్యూ కోర్టులో విచారణ జరగ్గా మూడు- నాలుగు నెలల వ్యవధిలోనే తీర్పు వచ్చింది. వెంటనే ఆన్లైన్లో కొత్త వ్యక్తుల వివరాలను నమోదు చేశారు. ఇలా చేసే ముందు అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని నోటీసులు ఇవ్వాలి. ఆ గడువు ముగిసిన తర్వాతే ఈ ప్రక్రియను ముగించాలి. ఇందుకు భిన్నంగా మండల స్థాయి అధికారులు ఆగమేఘాలపై కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఆన్లైన్లోకి ఎక్కించారు. అనంతరం తాము ఎంఐజీ లే ఔట్కు భూమి ఇస్తామంటూ వారు ముందుకు రావడం చకచకా జరిగిపోయాయి. కొత్త వ్యక్తులతో దరఖాస్తు చేయించిందే రెవెన్యూ అధికారులు అని సర్వత్రా చర్చ జరుగుతోంది. పరిహారం కొట్టేయడానికే ఈ వ్యవహారాన్ని నడిపినట్లు తెలుస్తోంది.
వివాదం తేలే వరకూ పరిహారం నిలుపుదల
రెవెన్యూలోని భూ వివాదం మా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుగుతోంది. నిజానిజాలు తేలేంత వరకూ పరిహారం నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇచ్చాం.
వెంకటేశ్వర్, జేసీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
[ 18-04-2024]
ఎన్నికల నియమావళిని వాలంటీర్లు పట్టించుకోవడం లేదు. తాజాగా 29వ వార్డు వాలంటీరుగా పని చేస్తున్న నజీర్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డిని సత్కరించడం విమర్శలకు కారణమవుతోంది. -
ఉత్తిదే.. ‘ఇంటికే వైద్యం’ అందదే!
[ 18-04-2024]
ఇంటి ముంగిటకే వైద్య సేవలంటూ ప్రచారాలు మార్మోగాయి. వైద్యులే గ్రామానికి వచ్చి నాడి పట్టి.. రోగాన్ని గుర్తించి.. మందులిస్తారని డప్పుకొట్టి మరీ చెప్పారు. కొత్త వైద్యం కోసం ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూసేకోద్దీ అవన్నీ ఉత్తుత్తేనని తేలిపోయింది. -
కర్ణాటక మద్యం తరలిస్తూ...
[ 18-04-2024]
కుప్పం మండలం పరిధిలోని పైపాళ్యం పంచాయతీ చిన్నబొగ్గుపల్లి గ్రామానికి చెందిన వైకాపా సోషల్ మీడియా సభ్యుడు కుప్పస్వామి, అతని స్నేహితుడు సంపత్ కర్ణాటక మద్యాన్ని కుప్పానికి తీసుకొస్తుండగా బుధవారం కుప్పం ఎస్ఈబీ పోలీసులు అరెస్టు చేశారు. -
మళ్లీ విధ్వంస రచన!
[ 18-04-2024]
నాలుగేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు నామినేషన్లే వేయనీయకుండా వైకాపా నేతలు దాడులు, దౌర్జన్యానికి దిగి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. -
పస్తులతో పనులు చేస్తున్నాం
[ 18-04-2024]
త్రిరాష్ట్ర కూడలిలో ఏర్పాటైన ద్రవిడ వర్సిటీలో ఒకప్పుడు సీటు దొరకడమే కష్టం. తెదేపా హయాంలో వెలిగిపోయిన వర్సిటీ.. వైకాపా పాలకుల కక్ష సాధింపు చర్యలకు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. -
20న చంద్రబాబు పర్యటన
[ 18-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ నెల 20న తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు గూడూరులో మహిళలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. -
జడ్పీలో లేకున్నా అతనే కీలకం
[ 18-04-2024]
ప్రభుత్వ కార్యాలయాల్లోని దస్త్రాలు విభాగాల్లో లేదా జిల్లా అధికారుల వద్ద ఉండాలి. జిల్లా పరిషత్లోని వందలాది దస్త్రాలు ఈ కార్యాలయానికి సంబంధం లేని ఓ గుమస్తా వద్ద ఉండటం కలకలం రేపింది. -
సమగ్ర శిక్షే
[ 18-04-2024]
విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం చెప్పే వైకాపా ప్రభుత్వం ఆచరణలో ఎండమావులుగా మిగిలిపోతున్నాయి.. ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేసే ఉద్యోగులకు ఈ ఐదేళ్లలో ఒరిగిందేమీ లేదు.. -
ఇంట్లో దూరింది నిజమే..
[ 18-04-2024]
జడ్పీ నోడల్ అధికారి బాలాజీ ఇంట్లోకి.. బైరెడ్డిపల్లె ఇన్ఛార్జి ఎంపీడీవో రాజేష్, ఏవో రాజేంద్రతో కలిసి చొరబడి పరిశీలించింది వాస్తమేనని నిర్ధారణ అయింది. పూర్వ అధికారికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న ఓ జిల్లా అధికారి దీనిపై ఆరా తీసినట్లు సమాచారం. -
అంతంతమాత్రమే ‘కరుణ’?
[ 18-04-2024]
తితిదే పరిధిలోని బర్డ్ అసుపత్రిలో పనిచేస్తున్న స్పీచ్ థెరపిస్టు రూ.22,907 జీతం పొందేవారు. తాజా పెంపుతో రూ.25 వేలకు చేరింది. వేదపారాయణదారు పోస్టుకు నెలకు రూ.21,500 చెల్లిస్తుండగా.. -
వసతిగృహ విద్యార్థులతో పనులు?
[ 18-04-2024]
బీసీ గురుకుల పాఠశాల, వసతిగృహ అధికారుల నిర్లక్ష్యం ఓ విద్యార్థి కాలు పోగొట్టుకునే ప్రమాదం నుంచి బయటపడ్డారు. తిరుపతి గ్రామీణ మండలంలోని తాటితోపు వద్ద మహాత్మా జ్యోతిరావ్ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. -
ఉప కారాగారంలో రిమాండ్ ఖైదీ మృతి
[ 18-04-2024]
మద్యం కేసులో అరెస్టైన నిందితుడు మదనపల్లె ఉప కారాగారంలో అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందారు. జిల్లాలోని పెద్దపంజాణి మండలం ముతుకూరుకు చెందిన మొగిలప్ప (67)ను స్థానిక పోలీసులు ఈనెల 16న మద్యం కేసు అరెస్టు చేశారు. -
ఇంటింటా వైద్యం అబద్ధం
[ 18-04-2024]
‘గ్రామీణ ప్రజల ఇంటి వద్దకు వైద్యులు వెళ్లి నాణ్యమైన చికిత్స అందించే లక్ష్యంతో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను తీసుకొచ్చాం.. దేశంలోనే మొదటిసారి ఈ తరహా వైద్యవిధానాన్ని పేద, మధ్య తరగతి ప్రజల ముంగిటకు తెచ్చిన ప్రభుత్వం మాదే’ -
ఇక బెదిరేది లేదంటూ..
[ 18-04-2024]
ఆస్తులు, భూములు లాక్కుంటారని, కుటుంబ సభ్యులపై దాడులకు తెగబడతారని, ఇతరత్రా బెదిరింపులకు గురి చేస్తారని ఇన్నాళ్లు భయపడుతూ వైకాపాలో నలిగిన నేతలు ఇప్పుడు నిర్భయంగా పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. -
నామినేషన్ల పర్వానికి వేళాయే
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి అడుగులు పడ్డాయి. నోటిఫికేషన్ ప్రచురణ, నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిధిలోని ఒక లోక్సభ స్థానం, ఏడు శాసనసభ స్థానాలకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ ప్రవీణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. -
అభినయ్ ఓటమి ఖాయం: పవన్ కల్యాణ్
[ 18-04-2024]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఆ పార్టీ అభ్యర్థులకు బి-ఫారాలు అందించారు. ఎన్డీయే తిరుపతి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అందులో ఉన్నారు. -
గుట్టచప్పుడు కాకుండా..
[ 18-04-2024]
అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో వైకాపా నేతలు అక్రమాలకు తెగబడుతున్నారు. తమ కనుచూపు మేరలో కనిపించిన ప్రభుత్వ భూములను కబ్జా చేయడంతోపాటు గుట్టలను చదును చేసి ఆక్రమిస్తున్నారు. -
ఇంటి స్థలం అడిగితే మూడేళ్లుగా పట్టించుకోలేదు
[ 18-04-2024]
ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న అధికార పార్టీ అభ్యర్థులకు చుక్కెదురవుతోంది. పథకాలు అందకపోవడంపై నిలదీస్తున్నారు. మూడేళ్లుగా ఇళ్ల స్థలం కోసం వినతిపత్రాలు ఇస్తున్నా.. ఏనాడూ పట్టించుకోలేదు..
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?