ఎట్టకేలకు రూ.184 కోట్లతో పనులు
చిత్తూరులో ఆగిపోయిన ఓ రహదారి ప్రాజెక్టు పూర్తిచేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) చర్యలు చేపట్టింది.
కలెక్టరేట్, చీలాపల్లి వద్ద వీయూపీలు
గుడిపాలలో నంగమంగళం వద్ద ఆర్వోబీ
చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో కలెక్టరేట్ వద్ద ఆరు
వరుసల వెహికల్ అండర్ పాస్ ఏర్పాటు కానున్న ప్రాంతం
చిత్తూరు(సంతపేట), న్యూస్టుడే: చిత్తూరులో ఆగిపోయిన ఓ రహదారి ప్రాజెక్టు పూర్తిచేసేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) చర్యలు చేపట్టింది.. చిత్తూరు నగరం మీదుగా వెళ్లే చెన్నై-బెంగళూరు(ఎన్హెచ్-4) హైవేలో పనుల నిర్వహణకు టెండర్లు ఆహ్వానించింది.. ఎన్హెచ్ఏఐ తాజా చర్యలతో కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ ప్రాజెక్టుకు కొత్త ఊపిరినిచ్చింది.. మొత్తం రూ.184 కోట్లతో పలు పనులకు బిడ్లు ఆహ్వానించింది.
మూడు వీయూపీలు, ఒక ఆర్వోబీ..
చిత్తూరులోని కలెక్టరేట్ వద్ద ప్రస్తుతం ఉన్న నాలుగు వరసల మార్గం స్థానంలో నూతనంగా 28 మీటర్ల వెడల్పుతో ఒక ఆరు వరసల వెహికల్ అండర్ పాస్(వీయూపీ) నిర్మించనున్నారు. చీలాపల్లెలో సీఎంసీ ఆసుపత్రి వద్ద 14 మీటర్ల వెడల్పుతో మూడు వరసల వీయూపీ నిర్మితం కానుంది. గుడిపాల మండలం నంగమంగళం వద్ద ఆర్వోబీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీంతోపాటు సర్వీసు రోడ్లు, లైటింగ్ పనుల నిర్వహణకు బిడ్లు పిలిచారు. ఇంకా స్థానిక రహదారులు, లైటింగ్ ఇతర పనులకు ఈ నిధులు వెచ్చించనున్నారు.
గతంలో చేపట్టిన పనుల్లో కలెక్టరేట్, సీఎంసీ ఆసుపత్రి వద్ద వీయూపీ మంజూరు కాలేదు. కలెక్టరేట్ వద్ద వాహనాల క్రాసింగ్కు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. సీఎంసీ ఆసుపత్రి వద్ద జనసంచారం నిత్యం అధికంగా ఉంటుంది. ఈ కారణాలతో హైవే పనుల్లో మార్పులు చేసి వీయూపీలు మంజూరు చేశారు.
కర్ణాటక సరిహద్దు నుంచి ప్రారంభమయ్యే ఎన్హెచ్-4 చిత్తూరులో కలెక్టరేట్, సీఎంసీ ఆసుపత్రి, గుడిపాల మీదుగా తమిళనాడు సరిహద్దు వద్ద ముగుస్తుంది. కర్ణాటక సరిహద్దు నంగిలి నుంచి నలగాంపల్లె వరకు ఒక ప్రాజెక్టు పూర్తయింది. నలగాంపల్లె నుంచి తమిళనాడు సరిహద్దు వరకు రెండో ప్రాజెక్టుగా చేపట్టిన పనులు గుత్తేదారు పూర్తిచేయని కారణంగా నిలిచిపోయింది. అప్పటి నుంచి అడుగు ముందుకు పడలేదు. తాజాగా ఎన్హెచ్ఏఐ టెండర్లు ఆహ్వానించింది. ఈ నెల 2న బిడ్డింగ్ ప్రారంభమైంది. గుత్తేదారులు 19 జనవరి, 2023లోగా టెండర్లు దాఖలు చేయాలి. పనులు దక్కించుకున్న గుత్తేదారులు ఏడాదిన్నరలోగా పూర్తిచేయాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దిరెడ్డి.. ప్ర‘జల’ ఆశలకు గండి
[ 20-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తర్వాత వైకాపాలో నంబరు 2గా, రాయలసీమ జిల్లాల్లో పెత్తనం చెలాయిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శాసనం.. కాంట్రాక్టులన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. -
రెండో రోజు 16 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ తెలిపారు. -
ఎమ్మెల్సీ భరత్ను ఆపేసిన పోలీసులు..
[ 20-04-2024]
చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నామినేషన్ దాఖలు సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ను ప్రధాన గేటు వద్దే పోలీసులు ఆపివేశారు -
వైకాపా భూస్మాసురులు
[ 20-04-2024]
పేదలకు దక్కాల్సిన డీకేటీ భూములు వైకాపా అభ్యర్థుల సొంతమయ్యాయి. ఈ మేరకు వారే ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొనడం గమనార్హం. -
చీకట్లోనే తనిఖీలు.. చిక్కేరా ఉల్లం‘ఘనులు’
[ 20-04-2024]
అసలే చంద్రగిరి.. తాయిలాలు.. ప్రలోభాలు తారస్థాయిలో జరుగుతున్న వేళ నియోజకవర్గంలోని ఓ తనిఖీ కేంద్రం దుస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. -
లోక్సభకు 3.. శాసనసభకు 17
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా రెండోరోజు తిరుపతి లోక్సభ స్థానానికి మూడు, ఏడు శాసనసభ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు -
కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా
[ 20-04-2024]
పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. -
‘గురు’తర బాధ్యత ఇదేనా జగన్?
[ 20-04-2024]
బోధన సరిగ్గా చేయడంలేదంటూ చిత్తూరు మండలంలోని మాపాక్షి జడ్పీ పాఠశాలలోని హెచ్ఎంను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అందరి ఎదుటే మందలించారు. -
నిబంధన మీరి.. దూసుకొచ్చి..
[ 20-04-2024]
నామినేషన్ దాఖలు సమయంలో ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు నిలిచిపోవాలన్న నిబంధనను పుంగనూరులో వైకాపా శ్రేణులు అతిక్రమించాయి -
వైకాపా రంగుల పలకలు తొలగించారు
[ 20-04-2024]
పోలింగ్ కేంద్రాలు కల్గిన బడి ఆవరణలో వైకాపా రంగులతో ఏర్పాటు చేసిన సిమెంటు బెంచీలకు రంగుల పలకలను అధికారులు తీయించారు. -
రాష్ట్ర విభజనకు కారకుడైన కిరణ్కుమార్రెడ్డి
[ 20-04-2024]
ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకొచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. -
తెదేపా నేతపై దాడి
[ 20-04-2024]
పులిచెర్ల మండలం రేణుమాకులపల్లె పంచాయతీ బి.వడ్డిపల్లెకు చెందిన తెదేపా నాయకుడు సుబ్బరాజుపై స్థానిక వైకాపాకి చెందిన రెడ్డప్ప, వెంకటరమణ అన్నదమ్ములు దాడి పాల్పడ్డారు -
నేడు జిల్లాకు తెదేపా అధినేత రాక
[ 20-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10:40 గంటలకు గూడూరులోని వరగాలి క్రాస్రోడ్డు సమీపంలోని హెలిపాడ్ చేరుకుంటారు.