logo

చిత్తూరులో ఆటోడ్రైవర్‌ దారుణ హత్య

నగరంలో ఆటో డ్రైవర్‌ దారుణ హత్యకు గురైన ఘటన మంగళవారం కలకలం సృష్టించింది.

Updated : 07 Dec 2022 05:25 IST

అన్న సైతం కొన్నేళ్ల కిందట హత్యకు గురైన వైనం

ఘటన స్థలంలో డీఎస్పీ శ్రీనివాసమూర్తి, తాలూకా సీఐ మద్దయ్యచారి, ఎస్సై రామకృష్ణ

చిత్తూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: నగరంలో ఆటో డ్రైవర్‌ దారుణ హత్యకు గురైన ఘటన మంగళవారం కలకలం సృష్టించింది. చిత్తూరు తాలూకా పోలీసు స్టేషన్‌ ఎస్సై రామకృష్ణ కథనం మేరకు.. స్థానిక బాలాజీ కాలనీ సమీపంలోని అంబేడ్కర్‌ నగర్‌లో నివసిస్తున్న అణ్ణామలై కుమారుడు వడివేలు (40) వృత్తి రీత్యా ఆటోడ్రైవర్‌. ఇతనికి వివాహమైంది. సంతానం లేరు. చిత్తూరు బైపాస్‌ రోడ్డులోని సీతమ్స్‌ కళాశాల సమీపంలో ఓ వ్యక్తి మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడు వడివేలు అని గుర్తించిన పోలీసులు.. కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని వారు తెలిపారు. మృతుడి శరీరంపై 12 చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పాత కక్షలతో హత్య చేశారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలిని డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ మద్దయ్యచారి పరిశీలించారు. ఇదిలా ఉండగా.. వడివేలు సోదరుడు బాబు సైతం కొన్నేళ్ల కిందట హత్యకు గురికావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని