మూడేళ్లు..ముగింపునకు ఎన్నేళ్లో?
‘విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం. ఎన్నడూ లేనంతగా ఈ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం.
అసంపూర్తిగా నాబార్డు నిధులతో చేపట్టిన పాఠశాలల పనులు
* ఈ చిత్రంలో అసంపూర్తిగా కనిపిస్తున్న నిర్మాణాలు చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోనివి. 2019-20లో రూ.60.10 లక్షలతో అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా నాబార్డు నిధులు మంజూరయ్యాయి. మూడేళ్లు నిండినా కొలిక్కి రాలేదు. ఎప్పుడు పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
* గంగాధరనెల్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో పనులు ప్రారంభ దశలోనే ఆగిపోవడంతో ‘నాడు- నేడు’ మూడో విడతలో నిర్మాణాలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు.
* సదుంలోనూ ఇదే దుస్థితి నెలకొంది.
ఈనాడు డిజిటల్, చిత్తూరు- న్యూస్టుడే, చిత్తూరు(విద్య), బైరెడ్డిపల్లె: ‘విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం. ఎన్నడూ లేనంతగా ఈ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే కోట్లాది రూపాయలు వెచ్చించి పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం’ అంటూ ప్రభుత్వం తరచూ చెబుతున్నా.. జిల్లాలో నాబార్డు నిధులతో మూడేళ్ల క్రితం చేపట్టిన పనులు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. కొన్నిచోట్లే నిర్మాణాలు పూర్తయ్యాయి. ఫలితంగా విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. ప్రారంభంలో బిల్లులు సకాలంలో విడుదల చేయకపోవడమే పనుల ఆలస్యానికి కారణమని తెలుస్తోంది.
2020లో మొదలై...
‘నాడు- నేడు’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మూడు విడతల్లో అన్ని సర్కారు బడుల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రహరీలు, నీటిశుద్ధి యంత్రాలు, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతామని వెల్లడించింది. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపడంతోపాటు బడి మానేసే వారి సంఖ్యా తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 2019 నవంబరులో మొదటి విడతలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రూ.354 కోట్లతో 1,500 పాఠశాలల్లో పనులు ప్రారంభించారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే ఉన్నత పాఠశాలల్లో ఖర్చు అధికమవుతుందని భావించారు. 57 పాఠశాలల్లో రూ.42.92 కోట్ల నాబార్డు నిధులతో పనులు చేపట్టారు. 2020 ప్రారంభంలో వీటి నిర్మాణం మొదలైంది. 15-18 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. ‘నాడు- నేడు’ తొలి విడతలో ఎంపికైన పాఠశాలల్లో 2021 చివరి నాటికి పనులు పూర్తి కాగా నాబార్డు నిధులతో చేపట్టినవి సాగుతూనే ఉన్నాయి.
బిల్లుల ఆలస్యంతో...
ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు కేవలం 19 పాఠశాలల్లోనే పనులు పూర్తయ్యాయి. గంగాధరనెల్లూరు, సదుం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో ప్రారంభంలోనే పనులు నిలిచిపోవడంతో వీటిని మూడో విడత ‘నాడు- నేడు’కు మార్చారు. చంద్రగిరి, నారాయణవనం, పెనుమూరు, పిచ్చాటూరు, పులిచెర్ల, కమ్మకండ్రిగ తదితర ప్రాంతాల్లో మూడేళ్ల క్రితమే పనులు మొదలైనా ఇప్పటికీ తుది దశకు చేరలేదు. ఇవి పూర్తయితే విద్యార్థులకు అదనపు తరగతి గదులు అందుబాటులోకి రావడంతోపాటు గ్రంథాలయం, డిజిటల్ తరగతుల నిర్వహణ సాగుతుంది. ప్రధానంగా చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోవడం, తదనంతర కాలంలో అంచనాలు పెరిగిపోవడంతోనే నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపితే పనులు ముగింపు దశకు చేరుకుంటాయని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
[ 19-04-2024]
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ