ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం
జిల్లా అభివృద్ధి పథంలో ముందుకెళుతోందని.. పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా జరుగుతున్నట్లు కలెక్టర్ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.
ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం
గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ వెంకటరమణారెడ్డి
జాతీయజెండాకు వందనం చేస్తున్న కలెక్టర్ వెంకటరమణారెడ్డి.
చిత్రంలో ఎస్పీ పరమేశ్వరరెడ్డి, జేసీ బాలాజీ, డీఆర్వో శ్రీనివాసరావు, ఏఏస్పీలు
తిరుపతి(కలెక్టరేట్): జిల్లా అభివృద్ధి పథంలో ముందుకెళుతోందని.. పారిశ్రామికాభివృద్ధి శరవేగంగా జరుగుతున్నట్లు కలెక్టర్ వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం తిరుపతి పోలీసు పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. కలెక్టర్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం ప్రసంగిస్తూ... ‘తిరుపతి జిల్లా ఆవిర్భావం నుంచి అన్నిశాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. సచివాలయ వ్యవస్థ వచ్చిన తరువాత క్ష్రేతస్థాయిలో ప్రజలకు న్యాయం జరుగుతోంది’ అని తెలిపారు. ‘శాంతి భద్రతలే ధ్యేయంగా జిల్లా పోలీసు యంత్రాంగం పని చేస్తోంది. వారి పనితీరు కారణంగా ఏడాది కాలంలో 25 శాతం నేరాలు తగ్గాయి. యువకులకు ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్న ఎస్పీ పరమేశ్వరరెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు’ అని అన్నారు. అనంతరం స్వాత్రంత్య సమరయోధుడు సుబ్రహ్మణ్యంరెడ్డి కుమారుడు యాదేశ్వర్రెడ్డిని కలెక్టర్ సత్కరించి జ్ఞాపిక అందజేశారు.
* పలు శాఖలు ఏర్పాటు చేసిన ప్రగతి శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నాడు-నేడు మనబడి, నీటి యాజమాన్య సంస్థ, జగనన్న గృహాలు శకటాలకు బహుమతులు లభించాయి.
* పోలీసు జాగిలాల ప్రదర్శన వీక్షకులను ఆకర్షించింది. కార్యక్రమంలో జేసీ బాలాజీ, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, డీఆర్వో శ్రీనివాసరావు, తిరుపతి, గూడూరు ఆర్డీవోలు కనకనరసారెడ్డి, కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్, ఎస్పీలు
పరేడ్లో సాయుధ బలగాల ప్రదర్శన
అగ్నిమాపక సిబ్బంది ఏర్పాటు చేసిన రంగునీటితో త్రివర్ణ నమూనా
విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ప్రదర్శన
తిరుపతి సంగీత నృత్య కళాశాల విద్యార్థులు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..