logo

ఫిబ్రవరి 11న జాతీయ లోక్‌ అదాలత్‌

ఫిబ్రవరి 11న జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌వో రాజశేఖర్‌ కోరారు.

Published : 29 Jan 2023 04:45 IST

మాట్లాడుతున్న డీఆర్‌వో రాజశేఖర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఫిబ్రవరి 11న జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌వో రాజశేఖర్‌ కోరారు. లోక్‌ అదాలత్‌ నిర్వహణకు సంబంధించి కలెక్టరేట్‌లో శనివారం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రహదారులు, ఆక్రమణలు, పాస్‌బుక్‌లకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు కేసులను అదాలత్‌ ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. తమ పరిధిలోని కేసుల వివరాల్ని తహసీల్దార్లు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా కృషిచేయాలన్నారు. కలెక్టరేట్‌ జీ-సెక్షన్‌ సూపరింటెండెంట్‌ వాసు, భూసేకరణ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని