logo

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

శ్రీవారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి దంపతులు శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో దర్శించుకున్నారు.

Published : 29 Jan 2023 04:45 IST

శ్రీవారి డైరీ, క్యాలెండర్‌ను కె.ఎస్‌.జవహర్‌రెడ్డి దంపతులకు అందిస్తున్న జేఈవో వీరబ్రహ్మం, చిత్రంలో జేఈవో సదాభార్గవి, సీవీఎస్‌వో నరసింహకిశోర్‌  

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి దంపతులు శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో దర్శించుకున్నారు. మహద్వారం వద్ద సీఎస్‌కు తితిదే జేఈవోలు వీరబ్రహ్మం, సదాభార్గవి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం అందించగా తితిదే జేఈవో వీరబ్రహ్మం శ్రీవారి తీర్థప్రసాదాలను, డైరీ క్యాలెండర్‌ను అందజేశారు. తదుపరి శ్రీవారి రథసప్తమి మహోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి సూర్యప్రభ వాహనసేవలో పాల్గొన్నారు. తితిదే సీవీఎస్‌వో నరసింహకిశోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు