పదపదమంటూ.. పాదం ఆగదంటూ
అడుగడుగునా అభివాదాలు, ఆశీర్వాదాలు.. పల్లెపల్లెనా అభిమానం.. పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా.. ఉత్సవంగా.. వడివడిగా.. ఒరవడిగా.. పసుపు ‘దండు’లా శ్రేణులు, అభిమానులు నీడగా.. తోడుగా.. లోకేశ్తో అడుగులు కలిపారు.
పల్లెపల్లెనా ఘన స్వాగతం
నాలుగో రోజు పలమనేరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగిన పాదయాత్ర
యువతులకు స్వీయ చిత్రం తీస్తూ..
పలమనేరు, వి.కోట, న్యూస్టుడే: అడుగడుగునా అభివాదాలు, ఆశీర్వాదాలు.. పల్లెపల్లెనా అభిమానం.. పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా.. ఉత్సవంగా.. వడివడిగా.. ఒరవడిగా.. పసుపు ‘దండు’లా శ్రేణులు, అభిమానులు నీడగా.. తోడుగా.. లోకేశ్తో అడుగులు కలిపారు. జేజేలు కొట్టారు. గజమాలలతో స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించి హర్షించారు. ‘నిన్ను చూడటానికి వచ్చాను నాన్న..’ అంటూ వృద్ధుల అనురాగం. స్వీయచిత్రం తీసుకోవాలని విద్యార్థుల ఆరాటం. ఎదురేగి.. అన్నకు నుదుట తిలకం దిద్దాలని.. హారతి పళ్లేలతో అక్కచెల్లెమ్మల ఆత్రుత.. సమస్యలు తీర్చేందుకు వస్తున్నారని నిరుద్యోగ యువతలో ఆశ.. మా కన్నీరు మీరే తుడవాలని బాధితుల వేడుకోలు. వి.కోట మండలంలో సోమవారం కనిపించిన దృశ్యాలివి. చల్దిగానిపల్లెలో మొదలైన పాదయాత్రలో రోడ్డు పొడవునా దాదాపు 7 కి.మీ దూరం ప్రజలు మహిళలు స్వాగతం పలికారు.
‘వైకాపా హయాంలో ముస్లింల అభ్యున్నతి శూన్యం’
వి.కోట: స్థానిక ఖాజీపేటలో ముస్లింమైనార్టీలతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. పాదయాత్రలో మొదటి ముస్లిం మైనార్టీల సమావేశం ఇదే కావడంతోపాటు దాదాపు 40 నిమిషాల పాటు జరిగింది. ‘వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముస్లిం మైనార్టీలకు రక్షణ కరవైంది. ముస్లింల సంక్షేమాన్ని వైకాపా పూర్తిగా విస్మరించింది. కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నిధులు ఇవ్వలేదు. వైకాపా అధికారం చేపట్టగానే గత ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ఇస్తున్న పథకాలను తొలగించింది’ అని మాజీ ఎమ్మెల్సీ షరీఫ్, మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్బాషా తెలిపారు.
వలసలు ఆగాలి.. వడ్డెర్ల జీవితాలు బాగుపడాలి
సభలో ప్రసంగిస్తున్న లోకేశ్
పలమనేరు, న్యూస్టుడే: ‘వడ్డెర్ల జీవితాల్లో వెలుగులు నిండాలి. నిత్యం వారు ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు వలసలు వెళ్లడం ఆగాలి. గత ప్రభుత్వంలోనే వడ్డెర్లకు మేలు జరిగింది.. మీ కోసం నేను పోరాటం చేయడానికి వచ్చా’ అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. వి.కోట మండలం గందారుమాకులపల్లెలో వడ్డెర సంఘం నాయకులతో సమావేశమయ్యారు. ‘మీకు గతంలో చంద్రన్న బీమా అందేది. గత ప్రభుత్వంలో పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో దాదాపు 25 వేల మంది వరకు వడ్డెర్లకు పలు రకాలుగా లబ్ధి చేకూరింది. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో రూ.70 కోట్లతో సమాఖ్య ద్వారా మేలు చేశాం. ప్రస్తుత ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టడం లేదు. చేతిలో ఉన్న కొన్ని మైన్స్ను కూడా ఈ ప్రభుత్వం వచ్చాక లాక్కుంది. వడ్డెర్ల కోసం గతంలో చంద్రబాబునాయుడు సత్యపాల్ కమిటీ వేశారు. ఎస్టీ జాబితాలో ఉండాల్సిన వడ్డెరలు ప్రస్తుతం బీసీలుగానే కొనసాగుతున్నారు. మీకు, మీ పిల్లల భవిష్యత్తుకు కృషి చేస్తా’ అని స్పష్టం చేశారు.
వి.కోటలో లోకేశ్ను చూసేందుకు తరలివచ్చిన ప్రజలు
ఆసక్తికర వ్యాఖ్యలు.. కేరింతలు
* వి.కోటలో యువజనులతో మాట్లాడే సమయంలో మాజీ మంత్రి అమరనాథరెడ్డి పేరు ప్రస్తావించారు. అప్పుడు సభలో పెద్దగా కేకలు వినిపించాయి. ‘అమరన్నకు జై అంటూ..’ కేకలు పెట్టడంతో లోకేశ్ సరదాగా ‘ఏమన్నా.. నాకన్నా ఫాలోయింగ్.. నీకే ఎక్కువగా ఉందే..’ అన్నారు. దానికి సభలోని వారంతా కేరింతలు కొట్టారు.
* వడ్డెర్ల సభలో.. ‘భయం మా బ్లడ్లోనే లేదు.. మీ కోసం పోరాటం చేస్తా..’ అన్నప్పుడు ప్రజలు చప్పట్లు కొట్టారు.
* అక్కడే మహిళలు సభలోకి రావడానికి ప్రయత్నించారు. వీరికి వీలు పడకపోవడాన్ని గమనించిన లోకేశ్.. ‘అమ్మా ఇలా రండి.. వారికి దారి వదలండి.. వారిని సభలోకి రానివ్వాలి. నాకు మహిళల రక్షణే ముఖ్యం..’ అన్నప్పుడు పెద్దగా చప్పట్లు కొట్టారు.
* వి.కోట సభలో.. ‘ఈ ప్యాలెస్ పిల్లి జగన్.. దిల్లీకి వంగి వంగి సార్ సార్ అంటూ వెళ్తుంటాడు..’ అన్నప్పుడు శబ్దాలు మిన్నంటాయి.
పరిశ్రమల స్థాపనతోనే ఉద్యోగాలు
పలమనేరు, న్యూస్టుడే: ‘పరిశ్రమలు ఉంటేనే యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. గత ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా నేను, పరిశ్రమలశాఖ మంత్రిగా అమరనాథరెడ్డి పరిశ్రమల స్థాపన కోసం ఎంతో కృషి చేశాం. ఎక్కడైనా పరిశ్రమలు పెట్టండని అడిగితే చంద్రబాబునాయుడు పేరు ఉంటే చాలు పెట్టేస్తామని వచ్చేవారు. ఆయన ప్రభుత్వంలో 5,13,351 మంది యువతకు అప్పట్లో పలు రంగాల్లో ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం.. ఉన్న పరిశ్రమలను తరిమేస్తోంది’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు. సోమవారం వి.కోట పట్టణంలోని జీఎంఆర్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెదేపా ప్రభుత్వం ఏర్పడటమే లక్ష్యం
పాదయాత్రలో మేము సైతం అంటూ దివ్యాంగులు పాల్గొన్నారు. తాము ప్రకాశం జిల్లాకు చెందిన దర్శి, మార్కాపురం నుంచి వచ్చామన్నారు. 400 రోజులూ లోకేశ్ వెంటే ఉండి తమ అభిమానాన్ని తెలుపుతామన్నారు. తెదేపా ప్రభుత్వం ఏర్పడటమే తమ లక్ష్యమని అందుకే ఈ యాత్రలో పాల్గొని ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు.
ఆగాగు బిడ్డ.. హారతివ్వాలి
ఈమె పేరు నారాయణమ్మ. చల్దిగానిపల్లి వద్ద లోకేశ్కు హారతివ్వాలనుకుంది. పళ్లెంలో పసుపు నీళ్లు తెచ్చేసరికి పాదయాత్ర కొద్ది దూరం ముందుకు వెళ్లిపోయింది. దాంతో ఆరుపదుల వయసులోనూ పరుగుపరుగున వెళ్లి నారా లోకేశ్కు హారతిచ్చి ఆనందించింది.
సుదూరాల నుంచి..
పలమనేరు, న్యూస్టుడే: పాదయాత్రలో లోకేశ్తో పాదం కలపడానికి విదేశాల నుంచి అభిమానులు వచ్చారు. సోమవారం వి.కోట పాదయాత్రలో వీరు ఆయనతో కలిసి నడిచారు.
అమెరికా నుంచి వచ్చాం
- డాక్టర్ హరిప్రసాద్, అమెరికా
లోకేశ్ పాదయాత్ర ఎంతోమందిలో చైతన్యం తెస్తోంది. మా వంతు పాదం కలపాలని అమెరికా నుంచి వచ్చాం. రాబోయే రోజుల్లో యువత మంచి భవిష్యత్తు అందుకోవాలని కోరుకుంటున్నాం. అందుకోసం ఆయన చేస్తున్న ఈ యజ్ఞానికి మేము సైతం సహకరిస్తాం.
మీ పైనే ఆశలు పెట్టుకున్నాం
- మురళి, వి.కోట
అన్నా నేను ఎంఏ చదివా. చెన్నైలో ఉద్యోగం చేస్తున్నా. నా చెల్లి, తమ్ముడు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. కుప్పం ప్రాంతంలో ఐటీ కంపెనీ పెడితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. యువత చదువుకుని ఉద్యోగాలు లేకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. మీ పైనే మా ఆశలు పెట్టుకున్నాం. మీరు యువత కోసం అండగా నిలవాలి.
ఒప్పంద ఉద్యోగం తీసేశారు
- రాజశేఖర్, పెద్దపంజాణి
నేను ఒప్పంద ఉద్యోగిగా ప్రభుత్వ కార్యాలయంలో పనిచేశా. ఈ ప్రభుత్వంలో నాతో పాటు కొందరి ఉద్యోగాలు పోయాయి. పెద్దపంజాణి మండలంలో డిగ్రీ కళాశాల లేకపోవడంతో పలమనేరు వరకు వెళ్లలేక చాలామంది చదువుకు దూరమవుతున్నారు. మీరు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి.
యువతకు దారి చూపే నేత
- సజ్జా అజిత్, విజయవాడ
యువతకు దారి చూపించేది భవిష్యత్తులో లోకేశ్ అన్న మాత్రమే. అందుకే ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. నేను విజయవాడ నుంచి ఆయన కోసమే వచ్చా. పాదయాత్రలో పాల్గొంటున్నా. ఈ ప్రభుత్వం కేసుల పేరిట యువతను భయబ్రాంతులకు గురిచేస్తోంది. రాబోయే రోజుల్లో ప్రశాంతంగా జీవించాలి.. ఉద్యోగాలు రావాలంటే తప్పకుండా లోకేశ్తోనే అది సాధ్యమవుతుందని గట్టిగా నమ్ముతున్నాం.
మహిళలూ వెంట నడుస్తున్నారు
- కృష్ణప్రియ, అమెరికా
లోకేశ్ పాతయాత్రలో మహిళలు కూడా నడుస్తున్నందుకు సంతోషంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే మహిళలకు రక్షణ ఉందని మా అభిప్రాయం. అందుకే నేను అమెరికా నుంచి ఇండియాకు వచ్చి ఇక్కడ పాదయాత్రలో పాలు పంచుకుంటున్నాను. మా వంతు మహిళలను చైతన్య పరచడానికి కృషి చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ బీ‘మాయ’
[ 25-04-2024]
ఆపత్కాలంలో కుటుంబానికి తోడుగా నిలుస్తోన్న చంద్రన్న బీమాపై జగనన్న ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. రెండేళ్లు అరకొరగా అమలు చేసి చివరకు కుటుంబంలో ఒక్కరికే బీమా అవకాశం ఇవ్వడం శాపంగా మారింది. -
భరత్ నామినేషన్ ర్యాలీకి పక్క రాష్ట్రాల జనం
[ 25-04-2024]
కుప్పంలో వైకాపా అభ్యర్థి భరత్ నామినేషన్ ర్యాలీకి బుధవారం రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక గ్రామాల నుంచి భారీఎత్తున జన సమీకరణ చేయడం చర్చనీయాంశమైంది. -
ఆలస్యమైనా వేటు తప్పదు..!
[ 25-04-2024]
అధికార పార్టీ నేతల మాటలకు తానా.. తందానా అంటూ వంతపాడుతున్న అధికారులపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటోంది. విచారణ ప్రక్రియ ఆలస్యమైనా.. చర్యలు మాత్రం పక్కా. రాష్ట్ర నిఘా విభాగాధిపతి, విజయవాడ సీపీ, చిత్తూరు సీఐలపై వేటు ఘటనల్లో ఇది స్పష్టమైంది. -
ప్రజల జోలికొస్తే ఊరుకోం
[ 25-04-2024]
చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటామని, అమాయక ప్రజల కొస్తే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ హెచ్చరించారు. -
జులై దర్శన టికెట్లు క్షణాల్లో..
[ 25-04-2024]
శ్రీవారి జులై నెల ఆన్లైన్ దర్శన టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. జులై నెలకు సంబంధించి అంగప్రదక్షిణం టికెట్లను బుధవారం విడుదల చేయగా నాలుగు నిమిషాల వ్యవధిలో.. -
మండిపోతున్నా పట్టక..!
[ 25-04-2024]
సూర్యుడు భగభగ మండిపోతున్నాడు.. వారం రోజులుగా ఎండలు 42-45 డిగ్రీలకు చేరాయి.. విద్యుత్తు వినియోగం మరింతగా పెరిగింది.. గృహ, వ్యవసాయ రంగానికి విద్యుత్తు వినయోగం అధికమైంది.. -
ఒకటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
మే ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఓటర్లకు బీఎల్వోల ద్వారా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘శోకో’పాధ్యాయ పాఠశాలలు
[ 25-04-2024]
జగన్ పాలనలో బడి పిల్లలు, పంతుళ్ల బతుకులు అతలాకుతలమయ్యాయి. జీవో 117 వారి జీవితాల్లో చీకట్లు నింపింది. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని కొఠారి కమిషన్ చెబితే.. పాఠాలు చెప్పేవారిని ఇబ్బందులు పెట్టాలంటుంది జగన్ కమిషన్. -
ఆరో రోజు.. 63 నామినేషన్లు
[ 25-04-2024]
రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. ఎంపీ అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు (తెదేపా), భూలక్ష్మీ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), గణపతి (వీసీకే పార్టీ), దగ్గుమళ్ల రాధే (తెదేపా), జయకర్ (స్వతంత్ర), రవి (స్వతంత్ర), మునికృష్ణ (స్వతంత్ర), విజయకుమార్ (బీఎస్పీ)లు నామపత్రాలు సమర్పించారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ సంస్థల కరస్పాడెంట్ నాయుని చంద్రశేఖర్మూర్తి బుధవారం తెలిపారు. -
‘నగరిలో రోజాను ఓడించండి’
[ 25-04-2024]
నగరిలో రోజాను ఓడించాలని.. ఇండియా కూటమి తరఫున పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్రెడ్డిని గెలిపించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. పుత్తూరు అంబేడ్కర్ భవనంలో బుధవారం సీఐటీయూ సమావేశం జరిగింది. -
వైఎస్ఆర్ బీమా.. జగన్ డ్రామా
[ 25-04-2024]
సీఎం జగన్ వైఎస్ఆర్ బీమా ద్వారా పేదలను ఆదుకుంటామని ఆర్భాటపే ప్రకటనలు చేశారు. ఏడాదికి రూ.15 ప్రీమియం కడితే 18-50 సంవత్సరాల లోపు అయితే సహజ మరణానికి రూ.లక్ష, 18-70 సంవత్సరాల వరకు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు. -
చిత్తూరు నగరం.. పసుపు మయం
[ 25-04-2024]
చిత్తూరు నగరం పసుపుమయమైంది. తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ బుధవారం తన నామినేషన్ను అట్టహాసంగా దాఖలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో నగర వీధులు జనసంద్రమయ్యాయి. -
మంత్రి పేరుతో.. విధ్వంసం
[ 25-04-2024]
నగరంలోని లీలామహల్ కూడలి నుంచి కరకంబాడి వెళ్లే మార్గంలో ఇటీవలే స్మార్ట్సిటీ నిధులతో నిర్మించిన రోడ్డును అడ్డదిడ్డంగా తవ్వేశారు. లీలామహల్ సమీపంలో తన అల్లుడు నిర్మించిన బహుళ అంతస్థుల వాణిజ్య భవనం అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటుకు సుమారు 150 మీటర్ల స్మార్ట్సిటీ రోడ్డును మంత్రి పీఏ తన పలుకుబడి ఉపయోగించి ధ్వంసం చేశారు. -
హస్తకళలూ.. విస్తుపోయాయి
[ 25-04-2024]
హస్తకళా గ్రామం అన్నారు. అన్ని హస్తకళలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కళాకారులకు చేయూత.. మార్కెటింగ్.. పర్యాటకులను ఆకర్షించి ఆశించిన రీతిలో మార్కెటింగ్ వసతి తదితర ప్రయోజనాలంటూ హామీలు గుప్పించారు. -
నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. జిల్లా వ్యాప్తంగా ఒక లోక్సభ, ఏడు శాసనసభ స్థానాలకు సంబంధించి ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
ఏమబ్బా.. కాస్త చూసుకుపోండి
[ 25-04-2024]
‘ఏమబ్బా.. పోస్టల్ బ్యాలెట్కు ఫారం - 12 ఇచ్చావా.. ఏంటి పరిస్థితి.. కాస్త చూసుకుపోండి.. తెలుసుకదా ఎవరికి ఓటు వేయాలో..’ ఇదీ కొందరు పోలీసు అధికారులు తమ సిబ్బందితో అంటున్న మాటలు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు