మమేకమై..సమూహమై
ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నా.. మీరే దారి చూపాలంటూ నిరుద్యోగుల నివేదన.నాయనా మా పింఛన్లు తొలగించారు.. మేమెలా బతికేదంటూ వృద్ధుల ఆవేదన.
యువగళం
పాదయాత్రలో అడుగడుగునా నీరాజనాలు
ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నా.. మీరే దారి చూపాలంటూ నిరుద్యోగుల నివేదన.
నాయనా మా పింఛన్లు తొలగించారు.. మేమెలా బతికేదంటూ వృద్ధుల ఆవేదన.
తెదేపా మద్దతుదారులని మాకు అన్యాయం చేస్తున్నారంటూ కార్యకర్తల ఆక్రందన.
సర్కారు సాగుకు సాయం చేయట్లేదు. బతుకులు దుర్భరంగా మారాయని రైతుల వేదన.
..ఇలా అడుగడుగునా పలు వర్గాల ప్రజలు యువనేతకు విన్నపాలు తెలిపారు.
‘రాబోయేవి మంచి రోజులు.. భయపడకండి.. మీకు నేను అండగా ఉన్నా అంటూ..’ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వారికి భరోసా ఇచ్చారు. మంగళవారం బైరెడ్డిపల్లె మండలంలో పాదయాత్ర ఆసాంతం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. ప్రజలతో మమేకమయ్యారు. దారి పొడవునా పసుపు దండులా సమూహంగా కదిలారు. విద్యార్థులతో కరచాలనం చేశారు. చిన్నపిల్లలను ఎత్తుకుని ముద్దు చేశారు. దివ్యాంగులు కనిపిస్తే మాట్లాడి సాంత్వన చేకూర్చారు. యువతతో స్వీయచిత్రాలు దిగారు.
పలమనేరు, బైరెడ్డిపల్లె, పెద్దపంజాణి, వి.కోట, గంగవరం
ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు
బీసీలు ఎదిగితే జగన్ ఓర్వలేరని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. బైరెడ్డిపల్లె మండలంలోని దేవదొడ్డి వద్ద కురబల సమావేశంలో ప్రసంగించారు. ‘పెనుగొండలో కురబ సామాజిక వర్గానికి చెందిన సవితమ్మ క్వారీ వ్యాపారాలను వైకాపా నాయకులు లాక్కున్నారు. రాజకీయంగా తమకు అడ్డు వస్తున్నారని ఆమె పెట్రోలు బంకులనూ మూయించారు. ఇలా బీసీలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు’ అని అన్నారు. ్యకురబల ఆలయాలు అభివృద్ధి చేయాలని సంఘ నాయకులు కోరారు. కురబల సంప్రదాయ పూజలు నిర్వహించారు. ఇష్టదైవానికి తలలపై కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.
ప్రసంగంలో చలోక్తులు
లోకేశ్ ప్రతి సమావేశంలో సరదాగా చలోక్తులు వేస్తూ అభిమానులు, కార్యకర్తలను నవ్విస్తున్నారు. కురబ సంఘ సమావేశం, బీసీ ఆత్మీయ సమావేశంలోనూ ఆయన సరదాగా మాట్లాడారు. - నువ్వు ఉండవయ్యా.. మాట్లాడుతాను.. నాకు స్టామినా ఎక్కువ - నేను ఉన్నది ఉన్నట్లు చెబుతా.. అబద్ధాలు చెప్పను - ‘వాట్సప్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. కేసులు పెడతాడీ సైకో జగన్’ ఏంటి.. నా మీద.. ఏకంగా హత్యాయత్నం కేసు పెట్టారుగా..
దేవదొడ్డి: చిరు వ్యాపారి అందించిన బొరుగులు తింటూ..
దివ్యాంగులను విస్మరించిన ప్రభుత్వం
వైకాపా ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరించింది. రాయితీ సదుపాయాలు, బ్యాంకు రుణాలు, పింఛన్లు మంజూరు చేయడం లేదు. మా సమస్యలను లోకేశ్కు విన్న వించాలని యువగళం పాదయాత్రకు వచ్చా.
సుబ్రహ్మణ్యంరెడ్డి, మదనపల్లె
కూలీల పరిస్థితి దుర్భరం
పెరిగిన నిత్యావసరాలతో కూలీల పరిస్థితి దుర్భరంగా మారిందని మహిళా రైతు కూలీలు నారా లోకేశ్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. బైరెడ్డిపల్లె మండలం కైగల్ వద్ద వరి నాట్లు వేస్తున్న కూలీల కష్టాలు ఆయన తెలుసుకున్నారు.
గిట్టుబాటు ధర కల్పించాలి
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. రాయితీపై రైతులకు ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు పంపిణీ చేయాలి. పెట్టుబడి ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గి నష్టాలు మిగుల్చుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే రైతులు పంట సాగు చేయడం కష్టమే.
సరస్వతి, మహిళా రైతు, కైగల్
భారంగా కుటుంబ పోషణ
రోజంతా కష్టపడితే రూ.250 కూలి లభిస్తోంది. రోజుకు సరిపడా నిత్యావసరాలు కొనాలంటే రూ.500 కూడా చాలడం లేదు. గ్యాస్ సిలిండర్ ధర రూ.1200కు చేరువైంది. కూలీ చేసి సంపాదించే సొమ్ము ఖర్చులకు చాలదు. కుటుంబ పోషణ, పిల్లల చదువులకు ఇబ్బందులు తప్పడం లేదు.
సుకన్య, కూలీ, కైగల్
వైకాపాను ఇంటికి పంపడం ఖాయం
పాదయాత్రకు వ స్తున్న స్పందన చూ స్తుంటే వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడం ఖాయమని స్పష్టమవుతోంది. ప్రజలు లోకేశ్పై ఎంతో ఆప్యాయత చూపిస్తున్నారు. వారి కష్టాలు చెబుతున్నారు. ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అర్థమవుతోంది.
దీపక్రెడ్డి, ఎమ్మెల్సీ, అనంతపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసుర రాజ్యం.. అరాచకాలకు ఆజ్యం
[ 17-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక అచ్చంగా ఇలా కాకపోయినా కాస్త అటూఇటూగా రాష్ట్రంలో, జిల్లాలో ఇటువంటి పరిణామాలే జరుగుతున్నాయి. -
మీ బిడ్డనంటివి.. మోకాలొడ్డితివి
[ 17-04-2024]
జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ప్రధానమైనది సామాజిక పింఛన్లు.. వీటిపై ఆధారపడి జీవించే వారు లక్షలాది మంది ఉన్నారు. ప్రతి నెలా ఒకటో తారీఖు కోసం ఎదురు చూసే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఇలా ఎందరో ఉన్నారు. -
హక్కుల కాలరాత.. జగన్మార్కు అణచివేత
[ 17-04-2024]
బ్రిటిష్ పాలనలో దేశ ప్రజలు బానిసత్వంలో బతికారని చరిత్రలో చదివాం.. వైకాపా ప్రభుత్వ హయాంలో నాటి బానిసత్వాన్ని ఐదేళ్లు స్వయంగా చవిచూశామని ఆవేదన చెందుతోంది ఉద్యోగ లోకం.. నోరు తెరిస్తే తప్పు, మాట్లాడితే ముప్పు.. అన్నట్లైంది వీరి పరిస్థితి.. -
వైకాపాకు ఓట్లతో గుణపాఠం చెప్పించాలి
[ 17-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడిపై వైకాపా అసత్య ప్రచారాలను ఓటుతో తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. -
ఎమ్మెల్యే అభ్యర్థి థామస్కు భద్రత కల్పించాలి
[ 17-04-2024]
గంగాధరనెల్లూరు నియోజకవర్గ కూటమి పార్టీల ఉమ్మడి అభ్యర్థి థామస్కు భద్రత కల్పించాలని సదరు పార్టీల నేతలు పోలీసులను కోరారు. -
ఈడిగ కులస్థులకు సీఎం జగన్ అన్యాయం
[ 17-04-2024]
తెదేపా కూటమి విజయమే లక్ష్యంగా బీసీలు పని చేయాలని తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు సి.ఆర్.రాజన్ పిలుపునిచ్చారు. -
మార్కులు రాలేదని చిన్నారులను చితకబాదిన హెచ్ఎం
[ 17-04-2024]
సమ్మెటీవ్ పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని ఐదుగురు విద్యార్థులను చితకబాదిన హెచ్ఎం వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది. -
మానవత్వం మరిచి.. రహదారిపై వదిలేసి
[ 17-04-2024]
మానవత్వం మరచిన తల్లి.. కన్నబిడ్డను అర్ధరాత్రి నడ్డిరోడ్డుపై వదిలేసింది. చీకట్లో బిక్కుబిక్కుమంటూ అడుగులు వేస్తున్న చిన్నారిని గుర్తించిన లారీ డ్రైవర్.. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ఆమెను పోలీసులకు అప్పగించారు. -
ఇదేం జగన్.. మేమేం చేశాం పాపం
[ 17-04-2024]
జీడీనెల్లూరు మండలం ఎగువూరుకు చెందిన లక్ష్మీకాంతమ్మ(80)కు ఇటీవలి వరకు పింఛను వచ్చేది. ఆ సొమ్ముతో అవసరమైన మందులు, వస్తువులను కొనుక్కొనేది. -
సమర్థ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి
[ 17-04-2024]
వైకాపా అరాచక పాలనతో విసిగి వేశారిన ప్రజలకు ఎన్నికల రూపంలో ఇప్పుడు సరైన అవకాశం వచ్చిందని, అందరి సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చే సమర్థ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. -
జగనన్నా.. ఉద్యోగులంటే అంత అలుసా ?
[ 17-04-2024]
ఉద్యోగ, ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారం కోసం ధర్నా, రాస్తారోకో చేసినా, విజయవాడలో రాష్ట్ర స్థాయి ఆందోళన చేపడితే పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం అరెస్ట్లు చేయడం, ముందస్తు నోటీసులు జారీ చేయడంతో వారు భయాందోళనలకు గురవుతున్నారు. -
ఊసరవెళ్లే నయమనిపింఛెను
[ 17-04-2024]
అవ్వతాతలకు మనవడిగా.. ఒంటరి మహిళలకు, వితంతవులు, దివ్యాంగులకు అన్నగా.. తమ్ముడిగా చేనేత కల్లుగీత, మత్స్యకార, చర్మకారులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు పింఛన్ మూడు వేలకు పెంచుతామంటూ మాటిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు. -
సర్వదర్శనానికి ఎనిమిది గంటలు
[ 17-04-2024]
ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా మంగళవారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులకు దాదాపు ఎనిమిది గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. -
18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
[ 17-04-2024]
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18న విడుదల కానుంది. 18 నుంచి 25వ తేదీ వరకు (ప్రభుత్వ పనిదినాల్లో మాత్రమే) ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 26న వాటిని పరిశీలిస్తారు. -
నామినేషన్ నుంచి ఖర్చులన్నీ అభ్యర్థి ఖాతాకే..
[ 17-04-2024]
నామినేషన్ ప్రక్రియ నుంచి ఎన్నికల ఖర్చులన్నీ పోటీచేసే అభ్యర్థి ఖాతాలోకి వస్తుందని జేసీ శ్రీనివాసులు అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల జిల్లా స్టాండింగ్ కమిటీ సమావేశంలో జేసీ మాట్లాడారు. -
ద్రవిడలో జీతాలకు కొట్లాట..!
[ 17-04-2024]
ద్రవిడ విశ్వవిద్యాలయ పొరుగు సేవల ఉద్యోగుల వ్యవహారం పరస్పర దాడుల వరకు వెళ్లింది. పెండింగ్ జీతాల కోసం ఓ వర్గం నిరసన తెలియజేస్తుండగా... మరోవర్గం వర్సిటీ అధికారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.