logo

‘వైకాపా నేతలు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు’

అధికార వైకాపా నాయకులు కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెదేపా వన్నెకుల క్షత్రియ సంఘ నాయకులు మునిరాజు, వెంకటేష్‌ ఆరోపించారు

Published : 01 Feb 2023 04:16 IST

మాట్లాడుతున్న తెదేపా వన్నెకుల క్షత్రియ సంఘ నాయకులు

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: అధికార వైకాపా నాయకులు కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెదేపా వన్నెకుల క్షత్రియ సంఘ నాయకులు మునిరాజు, వెంకటేష్‌ ఆరోపించారు. స్థానిక తెదేపా కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ‘కుప్పంలో పార్టీలు వేరైనా మేమంతా ఒకటిగా ఉంటూ వచ్చాం. ఇప్పుడు మండలానికో పార్టీకి కుల నాయకుడిని ఎన్నుకుంటున్నారు. దీంతో కులాలను రెచ్చగొట్టి, గ్రామాల్లో ప్రశాంతతను దూరం చేస్తున్నారు. కుప్పం మండలానికి చెందిన ఓ మహిళకు పేరుకు వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ పదవి ఇచ్చి, కనీసం కుర్చీ కూడా లేకుండా చేశారు. ఎన్నికల కోసమే వైకాపా వన్నెకుల క్షత్రియులను వాడుకుంటోంద’ని అన్నారు. నాయకులు రవి, మురళీ, చంద్రశేఖర్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని