రూ.10 లక్షల విలువైన మద్యం ధ్వంసం
వాహనాల్లో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మద్యాన్ని ధ్వంసం చేసినట్లు ఎస్సై మల్లికార్జునరెడ్డి మంగళవారం తెలిపారు. 25 కేసులకు సంబంధించిన సుమారు రూ.10 లక్షల విలువైన మద్యాన్ని ఊటువంక వద్ద రోడ్డురోలర్తో తొక్కించి నాశనం చేశామన్నారు.
రోలర్తో మద్యాన్ని ధ్వంసం చేయిస్తున్న పోలీసులు
బంగారుపాళ్యం, న్యూస్టుడే: వాహనాల్లో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మద్యాన్ని ధ్వంసం చేసినట్లు ఎస్సై మల్లికార్జునరెడ్డి మంగళవారం తెలిపారు. 25 కేసులకు సంబంధించిన సుమారు రూ.10 లక్షల విలువైన మద్యాన్ని ఊటువంక వద్ద రోడ్డురోలర్తో తొక్కించి నాశనం చేశామన్నారు. మద్యం తరలిస్తూ పట్టుబడిన నాలుగు ద్విచక్ర వాహనాలకు బహిరంగ వేలం పాట నిర్వహించగా రూ.14 వేల ఆదాయం వచ్చిందన్నారు.
మనస్తాపంతో ఒడిశా వాసి ఆత్మహత్య
గంగవరం, న్యూస్టుడే: ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని సరస్వతినగర్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఒడిశాకు చెందిన హరిరాంరావత్(43) తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంలోని బోర్వెల్స్లో పనిచేస్తున్నారు. మండల పరిధిలోని సరస్వతినగర్లో బోరు వేయడానికి సోమవారం వచ్చారు. అక్కడే రాత్రి చెట్టుకు టవల్తో ఉరేసుకొని మృతి చెందాడు. ప్రాథమిక విచారణలో మృతుడు మద్యానికి బానిసై, చేసిన అప్పులు తీర్చలేక మనోవేదనతో ఆత్మహత్యకు చేసుకున్నట్లు తెలిసిందన్నారు. మృతినికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో మహిళ మృతి
చౌడేపల్లె, న్యూస్టుడే: ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని కాగతి పంచాయతీ పెద్దూరులో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఫ్యారీమా (55) ఆవుల పెంచుతూ జీవనం సాగిస్తోంది. ఆమె ఇంటి పక్కనే ఆవుల కోసం షెడ్డు ఏర్పాటు చేసింది. అందులోకి విద్యుత్ బల్బు కోసం వైర్లు లాగారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం పాలు పితుకుతున్న క్రమంలో పైపును పట్టుకోవడంతో విద్యుదాఘాతాని గురైంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే విద్యుత్ సరఫరా నిలిపేశారు. గాయపడ్డ ఆమెను స్థానికులు మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు.
చెట్టుపై నుంచి పడి తితిదే ఉద్యోగి దుర్మరణం
తిరుమల, న్యూస్టుడే: చెట్టుపై నుంచి పడి తితిదే గార్డెనింగ్ ఉద్యోగి మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి గ్రామీణ మండలం అవిలాలలో నివాసం ఉంటున్న కె.వెంకటేశులు(59) తితిదే గార్డెనింగ్ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ప్రతిరోజూ వైభవోత్సవ మండపం, శ్రీవారి ఆలయం ముందు మామిడాకులతో తోరణాలు కట్టే పనులు నిర్వహించేవారు. జీఎన్సీ సమీపంలోని ఓ ఉద్యానవనంలో మామిడి చెట్టుపైకి ఎక్కి ఆకులు కోస్తుండగా కొమ్మ విరిగి పడిపోయాడు. వెంటనే తితిదే అశ్విని ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. తిరుమల టూటౌన్ పోలీసులు విచారిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిలోద‘కౌలు’
[ 24-04-2024]
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చేస్తాం’. -
‘సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి’
[ 24-04-2024]
సీఎం జగన్ కోడికత్తి తరహాలో ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం విఫలైంది.. నుదుటిపై చిన్నపాటి దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకులు హత్యాయత్నం అంటూ హడావుడి చేస్తున్నారు.. అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
బ్యానర్లు తొలగించరు.. నిబంధనలు వర్తింపజేయరు
[ 24-04-2024]
గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు. -
గోపాలమిత్ర.. జగన్ మౌన పాత్ర
[ 24-04-2024]
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా.. -
ఐదోరోజు 24 నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. అభ్యర్థులు జగపతి (కాంగ్రెస్), రమేష్ (ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ), భూలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), జయకర్(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు. -
ఏడేళ్ల చిన్నారికి పెద్ద కష్టం
[ 24-04-2024]
పట్టణంలోని ఈస్టుపేటకు చెందిన ఆటో డ్రైవర్ ప్రేమకుమార్, సుభాషిణి దంపతుల కుమార్తె జెస్సిక (7). ఏడాది కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. -
‘వైకాపాను నమ్ముకొని.. నడిరోడ్డుపైకి వచ్చా’
[ 24-04-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తే తగిన ప్రాధాన్యం దక్కలేదని 11వ డివిజన్ వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్ మార్తాళ్ భర్త శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. -
నమ్ముకుంటే.. మోసపోయాం
[ 24-04-2024]
రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు. -
‘అరాచక పాలనకు అంతం పలకాలి’
[ 24-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. -
బస్టాండా.. అదెక్కడ..?
[ 24-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు. -
కుమారుడి కోసమే ‘కరుణ’
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు. -
వైకాపాకు వర్తించని నిబంధనలు.. అడుగడుగునా ఉల్లంఘనలు
[ 24-04-2024]
సత్యవేడు వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమంలో మంగళవారం ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసినా అధికారులు పట్టించుకోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి