19 పెద్ద పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు
‘జిల్లా.. పరిశ్రమలకు అన్ని విధాలుగా అనుకూలమైన ప్రాంతం కావడంతో పెద్దసంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి.
వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు
‘న్యూస్టుడే’తో జిల్లా పరిశ్రమల అధికారి ప్రతాప్రెడ్డి
న్యూస్టుడే, తిరుపతి(కలెక్టరేట్)
‘జిల్లా.. పరిశ్రమలకు అన్ని విధాలుగా అనుకూలమైన ప్రాంతం కావడంతో పెద్దసంఖ్యలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. కొత్త పరిశ్రమలు రావడం వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు రూ.13,800 కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయి. పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు సింగిల్ డెస్క్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్లైన్ విధానంలో ఎప్పటికప్పుడు అనుమతులు మంజూరు చేస్తున్నాం’ అని జిల్లా పరిశ్రమల అధికారి ఈ.ప్రతాప్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ‘న్యూస్టుడే’తో ముఖాముఖిలో మాట్లాడారు.
జిల్లా పరిధిలో బెంగళూరు, చెన్నై జాతీయ రహదారులు, కృష్ణపట్నం, చెన్నై పోర్టు అతి దగ్గరలో ఉన్నాయి. పరిశ్రమల్లో తయారు చేసే వస్తువులు, ఉత్పత్తులు ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు అనుకూలమైన ప్రాంతం. ప్రస్తుతం పెద్ద పరిశ్రమలు 173, చిన్న పరిశ్రమలు 4,798 వరకు ఉన్నాయి. కొత్తగా మరో 19 పెద్ద పరిశ్రమలకు, 46 చిన్న పరిశ్రమలకు దరఖాస్తు చేసుకోగా వాటికి అనుమతులు మంజూరు చేశాం. కొత్త పరిశ్రమల రాకతో దాదాపు రూ.13,800 కోట్ల పెట్టుబడులు, 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమలకు కావాల్సిన భూములు కేటాయించేందుకు నాయుడుపేట సమీపంలో ఏపీఐఐసీ దాదాపు మూడు వేల ఎకరాల వరకు సేకరించింది. కొత్త వాటికి శ్రీసిటీలోనే కాకుండా నాయుడుపేట, శ్రీకాళహస్తి- విశాఖ పారిశ్రామిక కారిడార్ ప్రాంతాల్లో భూములు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కారిడార్ ప్రాంతంలో 12 వేల ఎకరాల భూసేకరణ లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి విడత రెండు వేల ఎకరాల సేకరణ పూర్తి చేశాం.
ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆటో మొబైౖల్స్, మాంసం ఉత్పత్తులు దేశ, విదేశాలకు దాదాపు రూ.పదివేల కోట్ల విలువైన ఎగుమతులు, దిగుమతులు జరగుతున్నాయి. కొత్త పరిశ్రమలు వస్తే రానున్న రోజుల్లో ఎగుమతులు, దిగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.కోటి వరకు రాయితీలు అందిస్తున్నాం. బీసీ పారిశ్రామికవేత్తలకు రూ.75 లక్షల వరకు ప్రోత్సాహక రాయితీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అనుమతుల విషయంలో ఆలస్యం చేయకుండా నిబంధనలు అనుసరించే నిర్ణీత సమయంలోనే పారదర్శకంగా మంజూరు చేస్తున్నాం.
ముందుకొచ్చిన మూడు ఏసీ యంత్రాల తయారీ సంస్థలు
శ్రీకాళహస్తి మార్గంలో అంతర్జాతీయ ఏసీ యంత్రాల తయారీ సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. బ్లూస్టార్, డైకిన్, హెవెల్స్ వంటి ప్రముఖ సంస్థలు తమ ఉత్పత్తులను తయారు చేసేందుకు ముందుకు రావడం అభినందనీయం. కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తులో జిల్లా పారిశ్రామిక అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలవడం ఖాయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని