పర్యాటకం.. ప్రాధాన్యం
ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆధ్యాత్మికానికీ పర్యాటకానికీ అనువైన ప్రాంతం. కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 50 ప్రాంతాలను (గమ్యస్థానాలు) ఎంపిక చేసి అక్కడ స్థానిక, విదేశీ పర్యాటకులకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
జల్జీవన్తో తీరనున్న కష్టాలు
కేంద్ర బడ్జెట్ కేటాయింపులతో ఆశలు
ఈనాడు-తిరుపతి; న్యూస్టుడే, చిత్తూరు జిల్లా పంచాయతీ, వ్యవసాయం, కలెక్టరేట్, విద్య, నగరం : ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆధ్యాత్మికానికీ పర్యాటకానికీ అనువైన ప్రాంతం. కేంద్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 50 ప్రాంతాలను (గమ్యస్థానాలు) ఎంపిక చేసి అక్కడ స్థానిక, విదేశీ పర్యాటకులకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు అన్ని అర్హతలు ఉన్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే పర్యాటక కేంద్రంగా విరాజిల్లేందుకు ఆస్కారం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా తిరుపతి జిల్లాకు పలు ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
* జల్జీవన్ మిషన్ కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.70 వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోంది. 2022-23 సంవత్సరానికి జిల్లాకు రూ.340కోట్లు కేటాయించగా.. అందులో రూ.35కోట్లు మేరకు ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు మరింత పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో 3.61 లక్షల కుటుంబాలు ఉన్నాయి. రూ.276 కోట్లు వచ్చే ఆస్కారం ఉంది.
సమగ్ర శిక్షకు రూ.100 కోట్లు
జిల్లాలో 2,483 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 1.68లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. సమగ్ర శిక్ష తరఫున జిల్లాకు ఈ ఏడాది రూ.100కోట్లు విడుదలయ్యే అవకాశం ఉంది.
* తిరుపతి జిల్లా పరిధిలో ఓజిలి, బీఎన్కండ్రిగ మండలాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. బడ్జెట్లో రూ.5943 కోట్లు కేటాయించింది. దీంతో ఇక్కడ మరింత మౌలిక సదుపాయాలు పెంచుకునేందుకు అవకాశం ఉంది. ఉపాధ్యాయుల నియామకానికీ కేంద్రం ఆమోదించింది.
డిజిటల్ ఇన్ఫ్ట్రాస్ట్రక్చర్ కేంద్రాలు
పంట రుణాలకు రూ.20లక్షల కోట్లు కేటాయించారు. జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో సుమారు 3.10లక్షల మంది రైతులకు పంట రుణాల కింద రూ.5,123కోట్ల అందజేస్తున్నారు. అధిక కేటాయింపులతో కర్షకులకు పంట రుణాల మంజూరు మరింత సరళతరం కానుంది. యువతను ప్రోత్సహించేందుకు గ్రామ స్థాయిలో ఓపెన్ సోర్స్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రాల ఏర్పా టుకు ప్రత్యేక నిధులు కేటాయింపుతో ఇవి జిల్లాకు అందిరానున్నాయి.
* ఎన్హెచ్ఏఐ కింద రానున్న ఆర్థిక సంవత్సరంలో రూ.1.62 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు బడ్జెట్లో నిధులు పొందుపర్చింది. ఇప్పటికే మదనపల్లె-తిరుపతి, తిరుపతి-కడప రహదారులను నాలుగు వరుసల కింద మార్పు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నిధులు రాబట్టుకుంటే రహదారుల నిర్మాణం చేపట్టవచ్చు.
* జిల్లాలో ప్రస్తు తం 29 వేల మంది రైతులు 35 వేల ఎకరాల్లో ప్రకృతి సేద్యం పద్ధతిలో సాగు చేస్తుండగా.. 110 ప్రకృతి వ్యవసాయం వనరుల కేంద్రాలు ఉన్నాయి. కేంద్ర బడ్జెట్ పుణ్యమా జిల్లాలో ప్రకృతి సేద్యం విస్తరించి రైతులకు లబ్ధి చేకూరనుంది.
* ఐఐటీ, ఐసర్ కోసం కోసం కేంద్రం నిధులు కేటాయించింది. ఐసర్కు రూ.1462 కోట్లు, ఐఐటీలకు రూ.9361 కోట్లు కేటాయించింది. తిరుపతిలో ఈ రెండు ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నాయి. వీటికి అవసరమైన నిధులు రాబట్టుకుంటే మిగిలిన మౌలిక వసతులతోపాటు పరిశోధనలకు అవసరమైన నిధులు సమకూర్చుకోవచ్చు.
సొంతింటి కల తీరేలా..
గూడూరు, న్యూస్టుడే: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 7.98 లక్షల కుటుంబాలు ఉండగా.. 8.18 శాతం మందికి సొంతిల్లు లేదు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరిట 7,294 ఇళ్లు మంజూరు కాగా 1,711 పూర్తయ్యాయి. ప్రస్తుత కేటాయింపుల్లో నిధులు పెరగడంతో ఎక్కువమందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
5.5లక్షల మందికి ఊరట
ఆదాయ పన్ను చెల్లింపుల్లో మినహాయింపులతో ఉమ్మడి జిల్లాలో సుమారు 5.5 లక్షల మందికి ఊరట కలగనుంది. జిల్లాలో పన్ను చెల్లింపు దారులు 5.5 లక్షల మంది ఉండగా.. వీరిలో రూ.3-4 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారు 2.75 లక్షలు, రూ.4-5 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారు 1.65 లక్షల మంది, 5-7 లక్షల మధ్య ఆదాయం కలిగిన వారు 1.10 లక్షల మంది ఉన్నారు.
రుణాల మినహాయింపులేవీ?
కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన పన్ను విధానంతో ఉద్యోగులకు ఎలాంటి ఊరట లేదు. కొత్త విధానంలో హెచ్ఆర్ఏ, గృహ రుణాల మినహాయింపులు ఉండవు.
కేశవులు, అధ్యక్షుడు, జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం
మార్పులు లేవు
బడ్జెట్లో ఊహించినంతగా మార్పులు లేవు. కొత్త పన్ను విధానం ద్వారా ఆదాయ పన్ను చెల్లింపులో శ్లాబుల్ని కుదించడంతో పాటు.. రూ.7లక్షల వరకు రాయితీ కల్పించడం ఆహ్వానించదగ్గ అంశం. వేతన జీవులు, వ్యాపారులకు ఊరట కలిగిస్తోంది.
కె.ఉమామహేశ్వర్, జిల్లా అధ్యక్షుడు, ఛాంబర్ ఆఫ్ కామర్స్
వ్యవ‘సాయం’ లేదు
కేంద్ర బడ్జెట్లో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే ప్రకటన లేదు. రాయలసీమ లోని పేద రైతులకు కేటాయింపులు లేకపోవడం దారుణం. రైల్వే బడ్జెట్లోనూ రాష్ట్రానికి మొండిచెయ్యి చూపారు.
రాజరత్నం, ప్రజాహిత సేవా సంస్థ అధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ బీ‘మాయ’
[ 25-04-2024]
ఆపత్కాలంలో కుటుంబానికి తోడుగా నిలుస్తోన్న చంద్రన్న బీమాపై జగనన్న ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. రెండేళ్లు అరకొరగా అమలు చేసి చివరకు కుటుంబంలో ఒక్కరికే బీమా అవకాశం ఇవ్వడం శాపంగా మారింది. -
భరత్ నామినేషన్ ర్యాలీకి పక్క రాష్ట్రాల జనం
[ 25-04-2024]
కుప్పంలో వైకాపా అభ్యర్థి భరత్ నామినేషన్ ర్యాలీకి బుధవారం రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక గ్రామాల నుంచి భారీఎత్తున జన సమీకరణ చేయడం చర్చనీయాంశమైంది. -
ఆలస్యమైనా వేటు తప్పదు..!
[ 25-04-2024]
అధికార పార్టీ నేతల మాటలకు తానా.. తందానా అంటూ వంతపాడుతున్న అధికారులపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటోంది. విచారణ ప్రక్రియ ఆలస్యమైనా.. చర్యలు మాత్రం పక్కా. రాష్ట్ర నిఘా విభాగాధిపతి, విజయవాడ సీపీ, చిత్తూరు సీఐలపై వేటు ఘటనల్లో ఇది స్పష్టమైంది. -
ప్రజల జోలికొస్తే ఊరుకోం
[ 25-04-2024]
చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటామని, అమాయక ప్రజల కొస్తే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ హెచ్చరించారు. -
జులై దర్శన టికెట్లు క్షణాల్లో..
[ 25-04-2024]
శ్రీవారి జులై నెల ఆన్లైన్ దర్శన టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. జులై నెలకు సంబంధించి అంగప్రదక్షిణం టికెట్లను బుధవారం విడుదల చేయగా నాలుగు నిమిషాల వ్యవధిలో.. -
మండిపోతున్నా పట్టక..!
[ 25-04-2024]
సూర్యుడు భగభగ మండిపోతున్నాడు.. వారం రోజులుగా ఎండలు 42-45 డిగ్రీలకు చేరాయి.. విద్యుత్తు వినియోగం మరింతగా పెరిగింది.. గృహ, వ్యవసాయ రంగానికి విద్యుత్తు వినయోగం అధికమైంది.. -
ఒకటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
మే ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఓటర్లకు బీఎల్వోల ద్వారా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
శోకోపాధ్యాయ పాఠశాలలు
[ 25-04-2024]
జగన్ పాలనలో బడి పిల్లలు, పంతుళ్ల బతుకులు అతలాకుతలమయ్యాయి. జీవో 117 వారి జీవితాల్లో చీకట్లు నింపింది. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని కొఠారి కమిషన్ చెబితే.. పాఠాలు చెప్పేవారిని ఇబ్బందులు పెట్టాలంటుంది జగన్ కమిషన్. -
ఆరో రోజు.. 63 నామినేషన్లు
[ 25-04-2024]
రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. ఎంపీ అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు (తెదేపా), భూలక్ష్మీ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), గణపతి (వీసీకే పార్టీ), దగ్గుమళ్ల రాధే (తెదేపా), జయకర్ (స్వతంత్ర), రవి (స్వతంత్ర), మునికృష్ణ (స్వతంత్ర), విజయకుమార్ (బీఎస్పీ)లు నామపత్రాలు సమర్పించారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ సంస్థల కరస్పాడెంట్ నాయుని చంద్రశేఖర్మూర్తి బుధవారం తెలిపారు. -
‘నగరిలో రోజాను ఓడించండి’
[ 25-04-2024]
నగరిలో రోజాను ఓడించాలని.. ఇండియా కూటమి తరఫున పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్రెడ్డిని గెలిపించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. పుత్తూరు అంబేడ్కర్ భవనంలో బుధవారం సీఐటీయూ సమావేశం జరిగింది. -
వైఎస్ఆర్ బీమా.. జగన్ డ్రామా
[ 25-04-2024]
సీఎం జగన్ వైఎస్ఆర్ బీమా ద్వారా పేదలను ఆదుకుంటామని ఆర్భాటపే ప్రకటనలు చేశారు. ఏడాదికి రూ.15 ప్రీమియం కడితే 18-50 సంవత్సరాల లోపు అయితే సహజ మరణానికి రూ.లక్ష, 18-70 సంవత్సరాల వరకు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు. -
చిత్తూరు నగరం.. పసుపు మయం
[ 25-04-2024]
చిత్తూరు నగరం పసుపుమయమైంది. తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ బుధవారం తన నామినేషన్ను అట్టహాసంగా దాఖలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో నగర వీధులు జనసంద్రమయ్యాయి. -
మంత్రి పేరుతో.. విధ్వంసం
[ 25-04-2024]
నగరంలోని లీలామహల్ కూడలి నుంచి కరకంబాడి వెళ్లే మార్గంలో ఇటీవలే స్మార్ట్సిటీ నిధులతో నిర్మించిన రోడ్డును అడ్డదిడ్డంగా తవ్వేశారు. లీలామహల్ సమీపంలో తన అల్లుడు నిర్మించిన బహుళ అంతస్థుల వాణిజ్య భవనం అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటుకు సుమారు 150 మీటర్ల స్మార్ట్సిటీ రోడ్డును మంత్రి పీఏ తన పలుకుబడి ఉపయోగించి ధ్వంసం చేశారు. -
హస్తకళలూ.. విస్తుపోయాయి
[ 25-04-2024]
హస్తకళా గ్రామం అన్నారు. అన్ని హస్తకళలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కళాకారులకు చేయూత.. మార్కెటింగ్.. పర్యాటకులను ఆకర్షించి ఆశించిన రీతిలో మార్కెటింగ్ వసతి తదితర ప్రయోజనాలంటూ హామీలు గుప్పించారు. -
నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. జిల్లా వ్యాప్తంగా ఒక లోక్సభ, ఏడు శాసనసభ స్థానాలకు సంబంధించి ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
ఏమబ్బా.. కాస్త చూసుకుపోండి
[ 25-04-2024]
‘ఏమబ్బా.. పోస్టల్ బ్యాలెట్కు ఫారం - 12 ఇచ్చావా.. ఏంటి పరిస్థితి.. కాస్త చూసుకుపోండి.. తెలుసుకదా ఎవరికి ఓటు వేయాలో..’ ఇదీ కొందరు పోలీసు అధికారులు తమ సిబ్బందితో అంటున్న మాటలు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!