పల్లె మురిసింది.. ప్రేమ కురిసింది
అభిమాన నేత రాకతో పల్లెలు మురిశాయి.. ప్రేమ చూపాయి. మా లోగిళ్లలో కాంతులు నింపాలని ఆహ్వానం పలికాయి. దారులన్నీ పూల దారాలయ్యాయి... అభినందన మందారాలయ్యాయి.. ఆత్మ బంధువుపై ఆశీస్సుల జల్లు కురిపించాయి.. పలకరింపుతో పులకించాయి. భవితపై ఆశలు చిగురించాయి.
రామానాయుడుపాళ్యం వద్ద లోకేశ్ను ఆప్యాయంగా పలకరిస్తున్న గ్రామస్థులు
అభిమాన నేత రాకతో పల్లెలు మురిశాయి.. ప్రేమ చూపాయి. మా లోగిళ్లలో కాంతులు నింపాలని ఆహ్వానం పలికాయి. దారులన్నీ పూల దారాలయ్యాయి... అభినందన మందారాలయ్యాయి.. ఆత్మ బంధువుపై ఆశీస్సుల జల్లు కురిపించాయి.. పలకరింపుతో పులకించాయి. భవితపై ఆశలు చిగురించాయి. శ్రామికుడిపై నమ్మకముంచి పాదం కదిపాయి. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర తొమ్మిదో రోజు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం, తవణంపల్లె మండలాల్లోని పల్లెల మీదుగా ఉత్సాహంగా కొనసాగింది.
లోకేశ్ పాదయాత్రలో పలు వర్గాల వారు తమ సమస్యలను విన్నవించారు. వీటికి పరిష్కార మార్గాలు సూచించేలా హామీ ఇచ్చారు. పలువురు నాయకులు ఆయన వెంట నడిచారు. మాజీ మంత్రులు గల్లా అరుణకుమారి, అమరనాథరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఎమ్మెల్సీలు దొరబాబు, దీపక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు దొమ్మలపాటి రమేశ్, సుగుణమ్మ, చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జులు పులివర్తి నాని, నరసింహయాదవ్, చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలత, గీతం విద్యాసంస్థల ఛైర్మన్ భరత్ తదితరులు పాల్గొన్నారు.
తుంబకుప్పం క్రాస్ వద్ద హారతులు పట్టేందుకు నిరీక్షిస్తున్న మహిళలు
యువత కోసమే పోరాటం
తవణంపల్లె మండలం ఎ.గొల్లపల్లె కూడలి వద్ద యువతను ఉద్దేశించి లోకేశ్ మాట్లాడారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి కంపెనీలకు తెచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, యువతకు బంగారు భవిష్యత్ కల్పించడానికే పోరాటం చేస్తున్నాని పేర్కొన్నారు.
ఈనాడు డిజిటల్, చిత్తూరు; న్యూస్టుడే, ఐరాల, తవణంపల్లె
మోసపోయాం.. మీరే ఆదుకోవాలి: ఎస్సీల మొర
సదకుప్పం: లోకేశ్కు సమస్యలు విన్నవిస్తున్న ఎస్సీలు
పూతలపట్టు, న్యూస్టుడే: దళితులకు మేలు చేస్తాడని మోసపోయి ఓట్లు వేశామన్నా.. కానీ మాకు చేసిందేమి లేదు. మీరే ఆదుకోవాలన్నా అంటూ నారా లోకేశ్ ఎదుట దళితులు వాపోయారు. బంగారుపాళ్యం మండలం సదకుప్పంలో దళితుల ఆవేదనను చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గడిచిన మూడున్నరేళ్లలో దళితులపై అనేక దాడులు జరిగాయన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు ఎస్సీ అయిన కారు డ్రైవర్ను చంపి ఇంటి ముందు పడేశారు.. పులివెందులలో నాగమ్మ, పుంగనూరులో ఓంప్రతాప్, చీరాలలో కిరణ్.. ఇలా అనేక మంది దళితులను దారుణంగా హత్య చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. జడ్జి రామక్రిష్ణ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్క రుణం తీసుకున్నారా? ఎస్సీ ఉప ప్రణాళిక కింద ఒక్కరు లబ్ధిపొందారా? పదవి వచ్చే వరకు ముద్దులు.. వచ్చాకా గుద్దులని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. శుక్రవారం బంగారుపాళ్యంలో పోలీసులు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో మీరే చూశారు. వీటికి నేను భయపడనని, తెదేపా ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీలకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తామన్నారు.
మామిడి రైతులను ఆదుకుంటాం: లోకేశ్ హామీ
తుంబకుప్పం కూడలి వద్ద లోకేశ్కు వినతిపత్రం అందజేస్తున్న మామిడి రైతులు
తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే మామిడి రైతులను ఆదుకుంటామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రైతులకు హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా బంగారుపాళ్యం మండలం తుంబకుప్పం కూడలి వద్ద తనను కలిసిన రైతులకు భరోసా కల్పించారు. అనంతరం మాట్లాడారు. అకాల వర్షాలు, తగ్గిన దిగుబడులు, పెరిగిన పెట్టుబడులతో గిట్టుబాటు ధరలు లేక మామిడి రైతులు నష్టాలపాలవుతున్నారని తెలిపారు. రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కనీస గిట్టుబాటు ధర లేకపోవడంతో పంటను తోటల్లోనే రైతులు వదిలేస్తున్నారని చెప్పారు. దీనికి తోడు పూతలపట్టు నియోజకవర్గంలోని రైతులకు కోతులు, ఏనుగుల బెదడ అధికంగా ఉందన్నారు. దీనిని అధిగమించడానికి తెదేపా ప్రభుత్వం వచ్చిన వెంటనే కందకాలు, సోలార్ కంచెలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
విశేషాలు
పలు గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో లోకేశ్ ప్రసంగానికి వివిధ వర్గాలవారు ముగ్దులై చప్పట్లు కొడుతూ, ఈలలు వేశారు.
* నీ పాదయాత్రకు భద్రత కల్పించాం.. నా యువగళం పాదయాత్రను అడ్డుకుంటున్నావు.. ఏం భయమా? అన్నప్పుడు కేకలు వేశారు.
* నాకు కొందరు కంగ్రాట్్స చెప్పారు.. వంద కిలోమీటర్లు పూర్తి చేసినందుకు చెప్పారనుకున్నా.. నీపై 16వ కేసు పెట్టినందుకన్నారని అనడంతో అందరూ నవ్వారు.
*పసుపు అంటే జగన్కు పట్టదు.. మహిళలు పసుపు చీరలు కట్టుకొచ్చారు... అన్నప్పుడు నవ్వులు విరిశాయి.
* శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు.. ఇంత మంది తల్లుల మంచి కోసం పాదయాత్ర చేస్తున్నా అనడంతో చప్పట్లు మోగాయి.
* మైక్ సెట్ వినియోగించే వాహనాలతో పాటు నేను ఉపయోగించే స్టూలు కూడా పట్టుకెళ్లారు తల్లీ.. అందుకే చిన్న స్పీకర్ పెట్టుకుని మళ్లీ స్టూలు కొనుక్కున్నా అన్నప్పుడు అందరూ నవ్వారు.
జగన్ పాలనకు వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన
‘పాదయాత్ర చేస్తే పోలీసులకు ఇబ్బందేంటి?’
నారా లోకేశ్ పాదయాత్ర చేస్తుంటే పోలీసులకు వచ్చిన ఇబ్బందేంటని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రశ్నించారు. పలమనేరు డీఎస్పీ ఎందుకంత అతిగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తే పోలీసులు పటిష్ఠ బందోబస్తు కల్పించారు. రాష్ట్రంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఇక్కడ నియంత పరిపాలన ఉందా?’ అని సోమిరెడ్డి ధ్వజమెత్తారు.
బంగారుపాళ్యం: నల్లంగారికోటూరులో లోకేశ్ వెంట నడుస్తున్న మాజీ మంత్రి అమరనాథరెడ్డి, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, తెదేపా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని, తదితరులు
ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగాలేవీ..
భార్గవి, బొమ్మాయిపల్లె, బంగారుపాళ్యం
మా పిల్లలు ఇంజినీరింగ్ చదివారు. ఉద్యోగాలు దొరకడం లేదు. వైకాపా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేసింది. తెదేపా పాలనలో యువతకు ఉద్యోగాలు కల్పించి బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేయాలి. పద్మశాలీ కుల ధ్రువపత్రాలు తహసీల్దారు ఇవ్వడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
[ 19-04-2024]
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు