logo

పశువుల పౌరుషం.. యువత సాహసం

మండలంలోని చిన్నపోడుజేనులో ఆదివారం పశువుల పండగను నిర్వహించారు. పరసను తిలకించడానికి, పాల్గొనడానికి ఔత్సాహికులు, పోటీలో నిలిపేందుకు భారీగా కోడెగిత్తలు, ఎద్దులను తరలించడంతో పల్లెలో సందడి వాతావరణం నెలకొంది.

Published : 06 Feb 2023 02:32 IST

న్యూస్‌టుడే, వెదురుకుప్పం: మండలంలోని చిన్నపోడుజేనులో ఆదివారం పశువుల పండగను నిర్వహించారు. పరసను తిలకించడానికి, పాల్గొనడానికి ఔత్సాహికులు, పోటీలో నిలిపేందుకు భారీగా కోడెగిత్తలు, ఎద్దులను తరలించడంతో పల్లెలో సందడి వాతావరణం నెలకొంది. పరుగులు తీస్తున్న పశువుల పౌరుషం ముందు యువత సాహసం చిన్నబోయింది. పశువులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ కొందరు యువకులు గాయపడ్డారు. ప్రదర్శనను తిలకిస్తున్న వారిని ఎద్దులు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో తిరుపతికి తరలించారు. -

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని