పోరాడతాం.. సాధిస్తాం
యువతలో క్రీడలపై ఆసక్తి, అభిరుచి పెంపొందించి ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహిస్తోంది.. మధ్యప్రదేశ్లో జాతీయ స్థాయిలో జరిగే ఐదో ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖోఖో జట్టు ఎంపికైంది.
ఖేలో ఇండియాకు ఖోఖో క్రీడాకారులు
న్యూస్టుడే, చిత్తూరు(క్రీడలు)
ఖోఖో ఆడుతూ (పాత చిత్రం)
యువతలో క్రీడలపై ఆసక్తి, అభిరుచి పెంపొందించి ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహిస్తోంది.. మధ్యప్రదేశ్లో జాతీయ స్థాయిలో జరిగే ఐదో ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖోఖో జట్టు ఎంపికైంది.. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం కృషితో రాణిస్తున్నారు.. ఇప్పటికే పలు పోటీల్లో పతకాలు చేజిక్కించుకున్నారు.. తాజాగా చిత్తూరులోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో పది రోజుల పాటు శిక్షణ తీసుకున్న వీరు ఏపీని జాతీయ స్థాయి విజేతగా నిలుపుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
చాలా ఆనందంగా ఉంది..
- ప్రవీణ్, శ్రీకాకుళం జిల్లా(ఆల్ రౌండర్)
నేను శ్రీకాకుళంలోని జేఎన్టీయూలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నా. వ్యవసాయ నేపథ్య కుటుంబం మాది. గతంలో పలుమార్లు జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించా. నిష్ణాతులైన కోచ్ల ఆధ్వర్యంలో మెలకువలు నేర్చుకోవడం, రోజూ సాధనం చేయడం నాకు చాలా ఉపకరిస్తోంది. జాతీయ స్థాయిలో పాల్గొంటుండటం గొప్ప అనుభూతి.
తల్లిదండ్రుల ప్రోత్సాహం
- ఫణికుమార్, ప్రకాశం జిల్లా
ఇప్పటివరకు ఎనిమిది సార్లు జాతీయ స్థాయి పోటీల్లో తలపడ్డా. ప్రస్తుతం తొమ్మిదో సారి పాల్గొనడం మరపురాని అవకాశం. తల్లిదండ్రులు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. డీఎస్ఏ మైదానంలో చక్కటి శిక్షణ ఇచ్చారు. ఇక్కడ శిక్షకుల నుంచి నేర్చుకున్న మెలకువలతో ఆటలో సత్తా చాటగల్గుతున్నా. ఈ శిక్షణలో చాలా విషయాలు నేర్చుకున్నా. ఎట్టిపరిస్థితుల్లో పతకం సాధిస్తామనే గట్టి నమ్మకం ఉంది.
శిక్షణ బాగుంది..
- వంశీ, రుద్రవరం(ఆల్రౌండర్)
ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి ఎంపిక కావడం ఇది మూడోసారి. చిత్తూరులోని క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఇచ్చిన శిక్షణ ఎంతో బాగుంది. పదిరోజులు చక్కగా నేర్చుకున్నా. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చా. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నా. ఖోఖో క్రీడ అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ ఆటలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించడం నా జీవిత లక్ష్యం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న ‘ఘోర’ముద్ద
[ 20-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం అందించేందుకు జగనన్న గోరుముద్ద కార్యక్రమం ప్రవేశపెట్టామని, రోజూ మెనూ ప్రకారం భోజనం అందిస్తామని సీఎం జగన్ చెప్పారు. -
పెద్దిరెడ్డి.. ప్ర‘జల’ ఆశలకు గండి
[ 20-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తర్వాత వైకాపాలో నంబరు 2గా, రాయలసీమ జిల్లాల్లో పెత్తనం చెలాయిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శాసనం.. కాంట్రాక్టులన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. -
రెండో రోజు 16 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ తెలిపారు. -
ఎమ్మెల్సీ భరత్ను ఆపేసిన పోలీసులు..
[ 20-04-2024]
చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నామినేషన్ దాఖలు సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ను ప్రధాన గేటు వద్దే పోలీసులు ఆపివేశారు -
వైకాపా భూస్మాసురులు
[ 20-04-2024]
పేదలకు దక్కాల్సిన డీకేటీ భూములు వైకాపా అభ్యర్థుల సొంతమయ్యాయి. ఈ మేరకు వారే ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొనడం గమనార్హం. -
చీకట్లోనే తనిఖీలు.. చిక్కేరా ఉల్లం‘ఘనులు’
[ 20-04-2024]
అసలే చంద్రగిరి.. తాయిలాలు.. ప్రలోభాలు తారస్థాయిలో జరుగుతున్న వేళ నియోజకవర్గంలోని ఓ తనిఖీ కేంద్రం దుస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. -
లోక్సభకు 3.. శాసనసభకు 17
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా రెండోరోజు తిరుపతి లోక్సభ స్థానానికి మూడు, ఏడు శాసనసభ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు -
కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా
[ 20-04-2024]
పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. -
‘గురు’తర బాధ్యత ఇదేనా జగన్?
[ 20-04-2024]
బోధన సరిగ్గా చేయడంలేదంటూ చిత్తూరు మండలంలోని మాపాక్షి జడ్పీ పాఠశాలలోని హెచ్ఎంను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అందరి ఎదుటే మందలించారు. -
నిబంధన మీరి.. దూసుకొచ్చి..
[ 20-04-2024]
నామినేషన్ దాఖలు సమయంలో ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు నిలిచిపోవాలన్న నిబంధనను పుంగనూరులో వైకాపా శ్రేణులు అతిక్రమించాయి -
వైకాపా రంగుల పలకలు తొలగించారు
[ 20-04-2024]
పోలింగ్ కేంద్రాలు కల్గిన బడి ఆవరణలో వైకాపా రంగులతో ఏర్పాటు చేసిన సిమెంటు బెంచీలకు రంగుల పలకలను అధికారులు తీయించారు. -
రాష్ట్ర విభజనకు కారకుడైన కిరణ్కుమార్రెడ్డి
[ 20-04-2024]
ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకొచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. -
తెదేపా నేతపై దాడి
[ 20-04-2024]
పులిచెర్ల మండలం రేణుమాకులపల్లె పంచాయతీ బి.వడ్డిపల్లెకు చెందిన తెదేపా నాయకుడు సుబ్బరాజుపై స్థానిక వైకాపాకి చెందిన రెడ్డప్ప, వెంకటరమణ అన్నదమ్ములు దాడి పాల్పడ్డారు -
నేడు జిల్లాకు తెదేపా అధినేత రాక
[ 20-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10:40 గంటలకు గూడూరులోని వరగాలి క్రాస్రోడ్డు సమీపంలోని హెలిపాడ్ చేరుకుంటారు.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్