మార్కెట్ కమిటీ.. లేదు పోటీ
పంట ఉత్పత్తుల మార్కెట్ పన్ను వసూళ్లలో పలమనేరు మార్కెట్ కమిటీ అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాలోనే కాకుండా రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనే అత్యధికంగా వసూలు చేసినట్లు జిల్లా అగ్రి ట్రేడ్ అండ్ మార్కెటింగ్ అధికారి పరమేశ్వరన్ ప్రకటించారు.
రాయలసీమలోనే పలమనేరుకు అగ్రస్థానం
పలమనేరు, న్యూస్టుడే: పంట ఉత్పత్తుల మార్కెట్ పన్ను వసూళ్లలో పలమనేరు మార్కెట్ కమిటీ అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాలోనే కాకుండా రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనే అత్యధికంగా వసూలు చేసినట్లు జిల్లా అగ్రి ట్రేడ్ అండ్ మార్కెటింగ్ అధికారి పరమేశ్వరన్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 10 మార్కెట్ కమిటీలు ఉంటే ఏటా ప్రభుత్వం వీరికి వసూళ్ల విషయంలో లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. దాన్ని దాదాపు పూర్తి చేయడం గమనార్హం. మొత్తం జిల్లాలోని అన్ని మార్కెట్ కమిటీల నుంచి రూ.7.30 కోట్ల ఆదాయం వస్తే.. ఇక్కడి నుంచి రూ.2.14 కోట్లు ఆదాయం సమకూరింది.
ఎలా సాధ్యమైంది..?
సాధారణంగా ప్రభుత్వం రైతులు పండించిన 240 రకాల పంటల విక్రయాలకు సంబంధించి పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. ఇందులోంచి పండ్లను కొన్నింటిని డినోటిఫైడ్ చేసింది. మిగిలిన ఉత్పత్తుల విక్రయాలను కట్టుదిట్టంగా మార్కెట్ కమిటీ పరిశీలించింది. పలమనేరు మార్కెట్ కమిటీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రంలోకి ఉత్పత్తులు రవాణా చేస్తుంటారు. గతంలో ఇక్కడ చెక్పోస్టులు ఉన్నా.. సిబ్బంది చేతివాటం కారణంగా పెద్దగా వసూళ్లు వచ్చేవి కావు. ఎక్కువగా బియ్యం, రాగులు, బెల్లం వంటి 10 రకాల ఉత్పత్తుల నుంచి మార్కెట్ కమిటీ ఫీజు వసూలు చేయాలి. అయితే చెక్పోస్టులు ఉన్నా మామూళ్లకు అలవాటు పడి గతంలో పెద్దగా వసూళ్లు చేసేవారు కారు. దాంతో అప్పట్లో ఏడాదికి రూ.కోటికి మించేది కాదు. అలాంటిది ఈ సంవత్సరం మాత్రం అత్యధిక వసూళ్లు సాధించడంతో అధికారులు అభినందిస్తున్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న ఒక్క ఆళ్లకుప్పం చెక్పోస్టు నుంచి మాత్రమే రూ.కోటి వరకూ పన్ను వసూలైంది. అంతేకాకుండా పెద్దపంజాణి మండల పరిధిలో మొక్కజొన్న పిండి తయారు చేసే పరిశ్రమ నుంచి చాలా కాలంగా మార్కెట్ ఫీజు వసూలు చేసేవారు కారు. అలాంటిది ఈసారి వారి నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారు. దాంతో కమిటీ అనుకున్న లక్ష్యాన్ని అందుకోగలిగింది.
లక్ష్యాన్ని పూర్తి చేస్తాం
- సంజీవకుమార్, కార్యదర్శి, మార్కెట్ కమిటీ పలమనేరు
ప్రభుత్వం మాకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2.65 కోట్ల లక్ష్యాన్ని నిర్ణయించింది. ఇప్పటి వరకు రూ.2.14 కోట్లు వసూలు చేయగా ఈ నెలాఖరుకు లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. చెక్పోస్టులను బలోపేతం చేయడమే కాకుండా కొన్ని పరిశ్రమల నుంచి ఎప్పటి నుంచో రావలసిన బకాయిలు కూడా వసూలు చేస్తున్నాం. సరిహద్దులో నిఘా పెట్టడం వలన కూడా లక్ష్యసాధన సాధ్యమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
[ 19-04-2024]
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్