అంచనాలతో సరి!
మాండౌస్ తుపాను జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. బాధిత రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటివరకు పైసా ఇవ్వలేదు. కేవలం విత్తనాలే ఇచ్చింది.
మాండౌస్ తుపాను బాధిత రైతులకు అందని సాయం
ఈనాడు-తిరుపతి, న్యూస్టుడే, సూళ్లూరుపేట, కోట
మాండౌస్ తుపాను జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. పలు ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. బాధిత రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటివరకు పైసా ఇవ్వలేదు. కేవలం విత్తనాలే ఇచ్చింది.
పుదూరులో నీటమునిగిన వరిపైరు (పాతచిత్రం)
తుపాన్ల కారణంగా జిల్లాకు చెందిన రైతులు ఏటా నష్టపోతున్నారు. గత ఏడాది డిసెంబరులో వచ్చిన మాండౌస్ తుపాను కారణంగా జిల్లాలోని శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడూరు మండలాల పరిధిలో పంటలకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, మిరప, మినుము పంటలకు నష్టం అధికంగా ఉంది. అధికారుల లెక్కల ప్రకారం 33 శాతంపైగా వరిలో నష్టపోయిన రైతులు సుమారు 495 మందికి చెందిన సుమారు 287.44 హెక్టార్లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. 33 శాతానికి పైగా ఇసుక మేటలు వేసిన పంట 27.3 హెక్టార్లు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఇంతకంటే ఎక్కువ నష్టం జరిగినట్లు అన్నదాతలు తెలిపారు. వరితోపాటు మిరప రైతులు భారీగా నష్టపోయారు. పంట నష్టం అంచనాలు అధికారులు క్షేత్రస్థాయిలో సక్రమంగా గుర్తించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏదీ పరిహారం?.. వరి సాగుచేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కేవలం విత్తనాలు అందించింది. వరిపైరు ఏపుగా పెరుగుతున్న సమయంలో తుపానుతో నేలకొరిగిందని చెబుతున్నారు. విత్తనాల కొనుగోలుతోపాటు కూలీలకు, దుక్కిదున్నేందుకు పెట్టిన పెట్టుబడి మొత్తం నీటిపాలైందని అంటున్నారు. అధికారులు రూపొందించిన నివేదిక ప్రకారం 33శాతానికిపైగా పంట నష్టం జరిగిన దానికి సైతం ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు.
రూపాయి ఇవ్వలేదు
- తెరే రమణయ్య, మన్నారుపోలూరు
నాకున్న నాలుగు ఎకరాల్లో వరి సాగుచేశా. డిసెంబరులో వచ్చిన వరదలతో మొత్తం మునిగిపోయింది. వెన్ను దశలో ఉండగా పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. అప్పట్లో వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించి వెళ్లారు. ఎలాంటి పరిహారం అందలేదు. అప్పులు చేసి పంట సాగుచేశా.
విత్తనాలే ఇచ్చారు
-హరిప్రసాద్రెడ్డి, కోట
ఉన్న 8 ఎకరాల్లో వరినాట్లు వేశా. నారు పూర్తిగా ముంపునకు గురైంది. మందులు, దుక్కి దున్నేందుకు వేల రూపాయలు ఖర్చయింది. ప్రభుత్వం కేవలం విత్తనాలే ఇచ్చింది. ఇప్పటివరకు పంట నష్టానికి ఎటువంటి పరిహారం అందలేదు.
రెండుసార్లు నష్టపోయా
- రాంబాబు, కోట
నాకు 7 ఎకరాల పొలం ఉంది. రెండుసార్లు నారు పోసినా వర్షాల వల్ల మొత్తం దెబ్బతింది. అధికారులు విత్తనాలే ఇచ్చారు. పంట నష్టానికి ఎటువంటి పరిహారం దక్కలేదు. మళ్లీ కొత్తగా నారు పోసి పంటను కాపాడుకునేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది.
పొలాల్లో ఇసుక మేటలు..
- ఎ.చంద్రశేఖర్, మన్నారుపోలూరు
రెండెకరాల పొలం ఉంది. నవంబరులో వరి సాగుచేయగా డిసెంబరులో వచ్చిన వర్షాలకు పూర్తిగా దెబ్బతినింది. వెన్ను దశలో వరద ముంచెత్తింది. ఇసుక మేటలు వేశాయి. కొంత పంట కొట్టుకుపోయింది. అధికారులు పరిశీలించి ప్రభుత్వ సాయం అందుతుందని చెప్పారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న ‘ఘోర’ముద్ద
[ 20-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం అందించేందుకు జగనన్న గోరుముద్ద కార్యక్రమం ప్రవేశపెట్టామని, రోజూ మెనూ ప్రకారం భోజనం అందిస్తామని సీఎం జగన్ చెప్పారు. -
పెద్దిరెడ్డి.. ప్ర‘జల’ ఆశలకు గండి
[ 20-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తర్వాత వైకాపాలో నంబరు 2గా, రాయలసీమ జిల్లాల్లో పెత్తనం చెలాయిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శాసనం.. కాంట్రాక్టులన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. -
రెండో రోజు 16 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ తెలిపారు. -
ఎమ్మెల్సీ భరత్ను ఆపేసిన పోలీసులు..
[ 20-04-2024]
చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నామినేషన్ దాఖలు సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ను ప్రధాన గేటు వద్దే పోలీసులు ఆపివేశారు -
వైకాపా భూస్మాసురులు
[ 20-04-2024]
పేదలకు దక్కాల్సిన డీకేటీ భూములు వైకాపా అభ్యర్థుల సొంతమయ్యాయి. ఈ మేరకు వారే ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొనడం గమనార్హం. -
చీకట్లోనే తనిఖీలు.. చిక్కేరా ఉల్లం‘ఘనులు’
[ 20-04-2024]
అసలే చంద్రగిరి.. తాయిలాలు.. ప్రలోభాలు తారస్థాయిలో జరుగుతున్న వేళ నియోజకవర్గంలోని ఓ తనిఖీ కేంద్రం దుస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. -
లోక్సభకు 3.. శాసనసభకు 17
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా రెండోరోజు తిరుపతి లోక్సభ స్థానానికి మూడు, ఏడు శాసనసభ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు -
కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా
[ 20-04-2024]
పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. -
‘గురు’తర బాధ్యత ఇదేనా జగన్?
[ 20-04-2024]
బోధన సరిగ్గా చేయడంలేదంటూ చిత్తూరు మండలంలోని మాపాక్షి జడ్పీ పాఠశాలలోని హెచ్ఎంను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అందరి ఎదుటే మందలించారు. -
నిబంధన మీరి.. దూసుకొచ్చి..
[ 20-04-2024]
నామినేషన్ దాఖలు సమయంలో ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు నిలిచిపోవాలన్న నిబంధనను పుంగనూరులో వైకాపా శ్రేణులు అతిక్రమించాయి -
వైకాపా రంగుల పలకలు తొలగించారు
[ 20-04-2024]
పోలింగ్ కేంద్రాలు కల్గిన బడి ఆవరణలో వైకాపా రంగులతో ఏర్పాటు చేసిన సిమెంటు బెంచీలకు రంగుల పలకలను అధికారులు తీయించారు. -
రాష్ట్ర విభజనకు కారకుడైన కిరణ్కుమార్రెడ్డి
[ 20-04-2024]
ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకొచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. -
తెదేపా నేతపై దాడి
[ 20-04-2024]
పులిచెర్ల మండలం రేణుమాకులపల్లె పంచాయతీ బి.వడ్డిపల్లెకు చెందిన తెదేపా నాయకుడు సుబ్బరాజుపై స్థానిక వైకాపాకి చెందిన రెడ్డప్ప, వెంకటరమణ అన్నదమ్ములు దాడి పాల్పడ్డారు -
నేడు జిల్లాకు తెదేపా అధినేత రాక
[ 20-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10:40 గంటలకు గూడూరులోని వరగాలి క్రాస్రోడ్డు సమీపంలోని హెలిపాడ్ చేరుకుంటారు.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్