నేర వార్తలు
తెదేపా సీనియర్ నాయకుడు, తిరుపతి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కందాటి శంకర్రెడ్డి(72) ఆదివారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
తిరుపతి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కందాటి శంకర్రెడ్డి మృతి
కందాటి శంకర్రెడ్డి (పాతచిత్రం)
తిరుపతి(నగరం), న్యూస్టుడే: తెదేపా సీనియర్ నాయకుడు, తిరుపతి మున్సిపల్ మాజీ ఛైర్మన్ కందాటి శంకర్రెడ్డి(72) ఆదివారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దాదాపు 25 రోజుల క్రితం ఆయన గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్నారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ అనారోగ్యంతో మృతి చెందారు. తెదేపా అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా శంకర్రెడ్డి గుర్తింపు పొందారు. ఎస్వీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ఇద్దరూ కలిసి ఒకే హాస్టల్లో ఉండడంతో వారి మధ్య స్నేహం చిగురించింది. తరువాత చంద్రబాబు ఆశీస్సులతో 2002లో తిరుపతి మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కరుణాకర్రెడ్డిపై తెదేపా అభ్యర్థిగా శంకర్రెడ్డి విజయం సాధించి మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు. 2004లో శాసనసభ ఎన్నికల్లో పుత్తూరు నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు చేతిలో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చిరంజీవి, కాంగ్రెస్ అభ్యర్థి కరుణాకర్రెడ్డిపై తెదేపా అభ్యర్థిగా శంకర్రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన గత ఎన్నికల సమయంలో తిరుపతి తెదేపా అభ్యర్థి సుగుణమ్మ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక ఎయిర్ బైపాస్ రోడ్డులోని శంకర్రెడ్డి నివాసంలో పార్థివదేహానికి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ మంత్రి పరసారత్నం, తెదేపా నాయకులు నరసింహయాదవ్, ఆర్సీ మునికృష్ణ, జేడబ్ల్యూ విజయకుమార్, ఎస్వీయూ వీసీ రాజారెడ్డి తదితరులు నివాళులు అర్పించారు.
కలచివేసింది: చంద్రబాబు
శంకర్రెడ్డి మృతి తనను కలిచివేసిందని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. యూనివర్సిటీ స్థాయి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదన్నారు. తిరుపతి మున్సిపాలిటీ ఛైర్మన్గా కందాటి తన బాధ్యతలు సమర్థంగా నిర్వహించినట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను చరవాణిలో పరామర్శించి ఓదార్చారు.
టిప్పర్ని ఢీకొని ఇద్దరి దుర్మరణం
ప్రమాద స్థలంలో మృతులు, క్షతగాత్రుడు
పెళ్లకూరు, న్యూస్టుడే : మండలంలోని టెంకాయతోపు వద్ద జాతీయ రహదారిపై ఆగిఉన్న టిప్పర్ని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. నాయుడుపేట నుంచి తిరుపతి వైపు వెళ్తున్న టిప్పర్ టెంకాయతోపు దగ్గర ఒక్కసారిగా ఆగడంతో వెనుక వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. స్థానికులు గుర్తించి బయటకు తీయగా అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు గుర్తించారు. మరో వ్యక్తి తీవ్రగాయాలు కాగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు. ఈ సమయంలో ఇక్కడ ట్రాఫిక్ కొద్ది సమయం ఆగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* ప్రమాదంలో మృతి చెందిన వారిలో వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన హర్షవర్దన్రెడ్డి (28), పుత్తూరుకు చెందిన ధరయ్య (25)గా గుర్తించారు. క్షతగాత్రుడు పీలేరుకు చెందిన అజయ్గా గుర్తించారు. వీరంతా ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగులు కాగా ఆదివారం పార్టీ కోసం వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసుల అదుపులో నలుగురు?
బంగారుపాళ్యం: నారా లోకేశ్ పాదయాత్రలో భాగంగా బంగారుపాళ్యం నాలుగురోడ్ల కూడలిలో గంగవరం సీఐ అశోక్కుమార్, పోలీస్ సిబ్బందిపై తెదేపా నాయకులు, కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసి హత్యాయత్నం చేశారని పోలీసులు కేసు నమోదు చేసి విషయం విధితమే. ఈ కేసుకు సంబంధించి నలుగురిని పోలీసులు శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు వాట్సప్ గ్రూపుల్లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై సీఐ నరసింహారెడ్డిని సంప్రదించగా తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో రైతు మృతి
శ్రీరంగరాజపురం, న్యూస్టుడే: అనుమానాస్పదస్థితిలో రైతు మృతి చెందిన సంఘటన మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పిళ్లారికుప్పం గ్రామానికి చెందిన రైతు మునస్వామిరెడ్డి (65) ఆదివారం సాయంత్రం ఆవుకు మేత తీసుకురావడానికి పొలం వద్దకు వెళ్లాడు. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలంవద్దకు వెళ్లి చూడగా మునస్వామిరెడ్డి బలమైన గాయంతో విగత జీవిగా పడి ఉన్నాడు. గ్రామస్థుల సహకారంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై షేక్షావలి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తలకు బలమైన గాయం తగిలి మృతిచెందినట్లు గుర్తించారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పంచనామా నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి ఎస్సై తరలించామన్నారు.
అమ్మవారి ఆలయ ఆర్జితం ఇన్స్పెక్టర్ అరెస్టు
తిరుచానూరు, న్యూస్టుడే: శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయ ఆర్జితం ఇన్స్పెక్టర్ దామోదరంను ఆదివారం వేకువజామున పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 26న అమ్మవారి కల్యాణోత్సవం మండపంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ శేషాద్రిపై మ్యాన్పాక్తో దామోదరం దాడి చేసిన సంగతి తెలిసిందే. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆయనపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ బీ‘మాయ’
[ 25-04-2024]
ఆపత్కాలంలో కుటుంబానికి తోడుగా నిలుస్తోన్న చంద్రన్న బీమాపై జగనన్న ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. రెండేళ్లు అరకొరగా అమలు చేసి చివరకు కుటుంబంలో ఒక్కరికే బీమా అవకాశం ఇవ్వడం శాపంగా మారింది. -
భరత్ నామినేషన్ ర్యాలీకి పక్క రాష్ట్రాల జనం
[ 25-04-2024]
కుప్పంలో వైకాపా అభ్యర్థి భరత్ నామినేషన్ ర్యాలీకి బుధవారం రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక గ్రామాల నుంచి భారీఎత్తున జన సమీకరణ చేయడం చర్చనీయాంశమైంది. -
ఆలస్యమైనా వేటు తప్పదు..!
[ 25-04-2024]
అధికార పార్టీ నేతల మాటలకు తానా.. తందానా అంటూ వంతపాడుతున్న అధికారులపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటోంది. విచారణ ప్రక్రియ ఆలస్యమైనా.. చర్యలు మాత్రం పక్కా. రాష్ట్ర నిఘా విభాగాధిపతి, విజయవాడ సీపీ, చిత్తూరు సీఐలపై వేటు ఘటనల్లో ఇది స్పష్టమైంది. -
ప్రజల జోలికొస్తే ఊరుకోం
[ 25-04-2024]
చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటామని, అమాయక ప్రజల కొస్తే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ హెచ్చరించారు. -
జులై దర్శన టికెట్లు క్షణాల్లో..
[ 25-04-2024]
శ్రీవారి జులై నెల ఆన్లైన్ దర్శన టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. జులై నెలకు సంబంధించి అంగప్రదక్షిణం టికెట్లను బుధవారం విడుదల చేయగా నాలుగు నిమిషాల వ్యవధిలో.. -
మండిపోతున్నా పట్టక..!
[ 25-04-2024]
సూర్యుడు భగభగ మండిపోతున్నాడు.. వారం రోజులుగా ఎండలు 42-45 డిగ్రీలకు చేరాయి.. విద్యుత్తు వినియోగం మరింతగా పెరిగింది.. గృహ, వ్యవసాయ రంగానికి విద్యుత్తు వినయోగం అధికమైంది.. -
ఒకటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
మే ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఓటర్లకు బీఎల్వోల ద్వారా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘శోకో’పాధ్యాయ పాఠశాలలు
[ 25-04-2024]
జగన్ పాలనలో బడి పిల్లలు, పంతుళ్ల బతుకులు అతలాకుతలమయ్యాయి. జీవో 117 వారి జీవితాల్లో చీకట్లు నింపింది. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని కొఠారి కమిషన్ చెబితే.. పాఠాలు చెప్పేవారిని ఇబ్బందులు పెట్టాలంటుంది జగన్ కమిషన్. -
ఆరో రోజు.. 63 నామినేషన్లు
[ 25-04-2024]
రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. ఎంపీ అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు (తెదేపా), భూలక్ష్మీ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), గణపతి (వీసీకే పార్టీ), దగ్గుమళ్ల రాధే (తెదేపా), జయకర్ (స్వతంత్ర), రవి (స్వతంత్ర), మునికృష్ణ (స్వతంత్ర), విజయకుమార్ (బీఎస్పీ)లు నామపత్రాలు సమర్పించారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ సంస్థల కరస్పాడెంట్ నాయుని చంద్రశేఖర్మూర్తి బుధవారం తెలిపారు. -
‘నగరిలో రోజాను ఓడించండి’
[ 25-04-2024]
నగరిలో రోజాను ఓడించాలని.. ఇండియా కూటమి తరఫున పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్రెడ్డిని గెలిపించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. పుత్తూరు అంబేడ్కర్ భవనంలో బుధవారం సీఐటీయూ సమావేశం జరిగింది. -
వైఎస్ఆర్ బీమా.. జగన్ డ్రామా
[ 25-04-2024]
సీఎం జగన్ వైఎస్ఆర్ బీమా ద్వారా పేదలను ఆదుకుంటామని ఆర్భాటపే ప్రకటనలు చేశారు. ఏడాదికి రూ.15 ప్రీమియం కడితే 18-50 సంవత్సరాల లోపు అయితే సహజ మరణానికి రూ.లక్ష, 18-70 సంవత్సరాల వరకు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు. -
చిత్తూరు నగరం.. పసుపు మయం
[ 25-04-2024]
చిత్తూరు నగరం పసుపుమయమైంది. తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ బుధవారం తన నామినేషన్ను అట్టహాసంగా దాఖలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో నగర వీధులు జనసంద్రమయ్యాయి. -
మంత్రి పేరుతో.. విధ్వంసం
[ 25-04-2024]
నగరంలోని లీలామహల్ కూడలి నుంచి కరకంబాడి వెళ్లే మార్గంలో ఇటీవలే స్మార్ట్సిటీ నిధులతో నిర్మించిన రోడ్డును అడ్డదిడ్డంగా తవ్వేశారు. లీలామహల్ సమీపంలో తన అల్లుడు నిర్మించిన బహుళ అంతస్థుల వాణిజ్య భవనం అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటుకు సుమారు 150 మీటర్ల స్మార్ట్సిటీ రోడ్డును మంత్రి పీఏ తన పలుకుబడి ఉపయోగించి ధ్వంసం చేశారు. -
హస్తకళలూ.. విస్తుపోయాయి
[ 25-04-2024]
హస్తకళా గ్రామం అన్నారు. అన్ని హస్తకళలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కళాకారులకు చేయూత.. మార్కెటింగ్.. పర్యాటకులను ఆకర్షించి ఆశించిన రీతిలో మార్కెటింగ్ వసతి తదితర ప్రయోజనాలంటూ హామీలు గుప్పించారు. -
నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. జిల్లా వ్యాప్తంగా ఒక లోక్సభ, ఏడు శాసనసభ స్థానాలకు సంబంధించి ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
ఏమబ్బా.. కాస్త చూసుకుపోండి
[ 25-04-2024]
‘ఏమబ్బా.. పోస్టల్ బ్యాలెట్కు ఫారం - 12 ఇచ్చావా.. ఏంటి పరిస్థితి.. కాస్త చూసుకుపోండి.. తెలుసుకదా ఎవరికి ఓటు వేయాలో..’ ఇదీ కొందరు పోలీసు అధికారులు తమ సిబ్బందితో అంటున్న మాటలు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం