logo

నలుగురు తెదేపా కార్యకర్తలకు బెయిల్‌

నలుగురు తెదేపా కార్యకర్తలకు సోమవారం స్థానిక ప్రిన్సిపల్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు న్యాయమూర్తి పి.శాంతి బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు.

Published : 07 Feb 2023 01:42 IST

చిత్తూరు (న్యాయవిభాగం),  బంగారుపాళ్యం, న్యూస్‌టుడే: నలుగురు తెదేపా కార్యకర్తలకు సోమవారం స్థానిక ప్రిన్సిపల్‌ జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ క్లాస్‌ కోర్టు న్యాయమూర్తి పి.శాంతి బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఈ నెల 3న పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో నిర్వహించారు. పాదయాత్ర సభను జాతీయ రహదారిపై నిర్వహించారంటూ బంగారుపాళ్యం పోలీసులు 11 మంది తెదేపా నాయకులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వీరిలో నలుగురు నాయకులు కేశవ, అశోక్‌, షబ్బీర్‌, చరణ్‌ను రిమాండ్‌కు తరలించారు. వీరు తమకు బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించగా.. పూర్వపరాలను పరిశీలించి వారికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని