logo

Tirumala: ట్రావెన్‌ కోర్‌ యువరాణికి సనాతన ధర్మభారతి స్ఫూర్తి పురస్కారం

తిరుపతిలోని అన్నమాచార్య కళామండపంలో ట్రావెన్‌ కోర్‌ యువరాణికి సనాతన ధర్మభారతి స్ఫూర్తి పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు.

Published : 28 Feb 2023 22:13 IST

తిరుమల: కేరళలోని ట్రావెన్‌కోర్‌ యువరాణి అశ్వతి గౌరి లక్ష్మీభాయికి సనాతన ధర్మభారతి స్ఫూర్తి పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. మార్చి 2న తిరుపతిలోని అన్నమాచార్య కళామండపంలో సేవ్‌ టెంపుల్స్‌ భారత్‌, వేద విజ్ఞాన సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. అశ్వతి గౌరి లక్ష్మీభాయి ప్రస్తుతం అనంతపద్మనాభస్వామి దేవాలయం వంశపారంపర్య సభ్యులుగా ఉన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి చేతులమీదుగా ఈ పురస్కారం అందించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, శాసనసభ్యులు కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, మధుసూదన్‌ రెడ్డి, కాళహస్తి దేవస్థానం ఛైర్మన్‌ శ్రీనివాసులు, భాజపా అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌ పాల్గొంటారని సేవ్‌ టెంపుల్స్‌ భారత్‌ అధ్యక్షుడు గజల్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని