సార్.. పాఠం వినేదెలా..?
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించాలని ప్రభుత్వం బైజూస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.. ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఆ తరగతి బోధించే ఉపాధ్యా యులకు ట్యాబ్లు అందజేసింది..
పనిచేయని ట్యాబ్లు
టీచర్లకు తప్పని తిప్పలు
విద్యార్థులకు బోధన ప్రశ్నార్థకం
న్యూస్టుడే, చిత్తూరు, తిరుపతి విద్య
ట్యాబ్లకు మరమ్మతు చేస్తున్న సాంకేతిక సిబ్బంది(పాత చిత్రం)
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించాలని ప్రభుత్వం బైజూస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.. ఎనిమిదో తరగతి విద్యార్థులకు, ఆ తరగతి బోధించే ఉపాధ్యా యులకు ట్యాబ్లు అందజేసింది.. రెండు నెలల కిందట అందజేసిన ఈ ట్యాబ్లు ప్రస్తుతం పూర్తిగా మొరాయిస్తున్నాయి.. పంపిణీ చేసిన రోజు నుంచి పలుచోట్ల పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి.. సాంకేతిక పరిజ్ఞానం తెలిసిన ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది ఆన్లైన్ ద్వారా బాగుచేయిస్తున్నారు.. జిల్లాల వారీగా ఏ పాఠశాల్లో విద్యార్థులు ఎన్ని గంటలు ట్యాబ్ను వినియోగిస్తున్నారనే విషయాన్ని ఉన్నతాధికారులు నిత్యం తెలుసుకుంటూ బాగా వెనుకబడిన జిల్లాల అధికారులతో మాట్లాడుతున్నారు.
ఇవీ లోపాలు..
చిత్తూరు జిల్లాలోని 31 మండలాల్లో 477 ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి విద్యార్థులు 18,251మంది, ఉపాధ్యాయులు 2,772మంది ఉన్నారు. తిరుపతి జిల్లాలోని 34 మండలాల్లో 433 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అందులో 18,723మంది ఎనిమిదో తరగతి విద్యార్థులు, 2,593మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరందరికీ ట్యాబ్ల పంపిణీ జరిగింది.ఆపై గత జనవరిలో ఉమ్మడి జిల్లాలో 620 సిమ్ కార్డులు పనిచేయలేదు. వీటిని సాంకేతిక సిబ్బంది వచ్చి మరమ్మతు చేశారు. సబ్జెక్టు ఉపాధ్యాయుల్లో మొదట గణితం, సైన్స్, సోషల్, ఆంగ్ల సబ్జెక్టు బోధకులకు తర్వాత తెలుగు, హిందీ ఉపాధ్యాయులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. వీటిని ఎలా వినియోగించాలి, కంటెంట్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి తదితర సమాచారాన్ని వీడియో రూపంలో రూపొందించి జిల్లా విద్యాశాఖ అన్ని పాఠశాలలకు అందజేసింది. పంపిణీ చేసిన మొదటి నుంచి పెద్దఎత్తున సాంకేతిక లోపాలు కన్పిస్తు న్నాయి. ఇంకా కొన్ని ట్యాబ్లు నేటికీ పనిచేయడం లేదు. పలుచోట్ల దెబ్బతిన్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు ట్యాబ్ తెరిచేందుకు పాస్వర్డులు మరిచిపోతున్నారు. మరికొన్ని చోట్ల సర్వర్ సమస్య ఉంది. వినియోగించే విధానం ఎంత విశదీకరించినా అర్థం కావడం లేదని సమాచారం. ట్యాబ్లు బాగుచేయడం, విద్యార్థులు ఏ మేరకు ఏ కంటెంట్ చూస్తున్నారు, ఎన్ని గంటలు చూస్తున్నారో ప్రతిరోజూ తెలుసుకుని రికార్డులో నమోదు చేసేందుకు ప్రత్యేక విభాగం జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో ఏర్పాటు చేశారు. పంపిణీ చేసిన ప్రారంభంలో సాంకేతిక సమస్యలు రావడంతో రాష్ట్ర కార్యాలయం నుంచి సాంకేతిక సిబ్బంది జిల్లాకు వచ్చి బాగు చేశారు. పలు పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వినియోగంపై వివరించారని డీఈవో విజయేంద్ర రావు తెలిపారు.
సిమ్ కార్డుల తొలగింపు..
విద్యార్థులు, ఉపాధ్యాయులకు అందజేసిన ట్యాబ్లు పనిచేయకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. సిమ్ కార్డు ఉంటే విద్యార్థులు ఏమేం చూశారని అధికారులు తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో అందులో ఉంచాల్సిన సిమ్ కార్డులను కొందరు విద్యార్థులు తీసేసి మళ్లీ అమర్చుతున్నారు. దీంతో అవికాస్తా పనిచేయడం లేదు. ఓసారి సిమ్ కార్డు తీసి అమర్చితే పనిచేయదని సాంకేతిక సిబ్బంది తెలియజేస్తున్నా వారు పట్టించుకోవడం లేదు. మారుమూల పాఠశాలల్లో అంతర్జాలం సమస్యలు ఉన్నాయి. పైగా ఇచ్చిన ట్యాబుల్లో కొన్నింటిలో నాణ్యతా లోపాలు వెలుగు చూస్తున్నాయి. కొందరు ప్రైవేటు వ్యక్తుల చేత వీటికి మరమ్మతు చేయిస్తున్నారని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
[ 19-04-2024]
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వి‘నాసి’కారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
-
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల