logo

రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ వైద్య యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్వీ వైద్య కళాశాలలో జరిగే రాష్ట్ర స్థాయి వైద్య మరియు దంత కళాశాలల క్రికెట్‌ పోటీలను సోమవారం డీఎంఈ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ప్రారంభించారు.

Published : 21 Mar 2023 02:55 IST

తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ వైద్య యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్వీ వైద్య కళాశాలలో జరిగే రాష్ట్ర స్థాయి వైద్య మరియు దంత కళాశాలల క్రికెట్‌ పోటీలను సోమవారం డీఎంఈ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ప్రారంభించారు. ఐదు రోజులపాటు 35 టీముల మధ్య పోటీలు జరగనున్నాయి. కార్యక్రమంలో ఎస్వీఎంసీ ప్రిన్సిపల్‌ చంద్రశేఖరన్‌, రుయా సూపరింటెండెంట్‌ నాగమునీంద్రుడు, వైస్‌ ప్రిన్సిపల్‌ వెంకటేశ్వర్లు, డాక్టర్‌ వసుంధరాదేవి, ప్రసూతి సూపరింటెండెంట్‌ పార్థసారథిరెడ్డి, సీఎస్‌ఆర్‌ఎంఓ లక్ష్మా నాయక్‌, డీసీఎస్‌ ఆర్‌ఎంఓ ఈబీ దేవి, సీఏఎస్‌ ఆర్‌ఎంఓ అన్వేష్‌రెడ్డి, డాక్టర్‌ ఠాగూర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని