logo

బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ వాలంటీరు అరెస్టు

బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ నందనం గ్రామ వాలంటీరు మధురెడ్డి(29)ని అరెస్టు చేసినట్లు సీఐ శివకుమార్‌రెడ్డి తెలిపారు.

Published : 21 Mar 2023 02:57 IST

నాగలాపురం, న్యూస్‌టుడే: బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ నందనం గ్రామ వాలంటీరు మధురెడ్డి(29)ని అరెస్టు చేసినట్లు సీఐ శివకుమార్‌రెడ్డి తెలిపారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగలాపురం మండలంలోని నందనం గ్రామానికి చెందిన తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలిక(14)ను అమ్మఒడి పథకానికి సంబంధించి ఆధార్‌కార్డు నకలును తీసుకురావాల్సిందిగా నిందితుడు ఆదివారం మధ్యాహ్నం అడిగాడన్నారు. నకలును తీసుకురావడానికి బాలిక పూజగదిలోకి వెళ్లిన సమయంలో నిందితుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడన్నారు. అనంతరం బాలిక ప్రతిఘటించి కేకలు వేయడంతో పరారయ్యాడన్నారు. బాలిక తల్లి ఫిర్యాదుతో నిందితుడిని ఆదివారం రాత్రి 9 గంటలకు అరెస్టు  చేశామన్నారు. నిందితుడిని రిమాండ్‌ నిమిత్తం తరలించినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సై హనుమంతప్ప పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని