దామినేడు..అక్రమాలు చూడు
తిరుపతి పద్మావతీపురానికి చెందిన బాలాజీకి దామినేడు పట్టణ గృహాలు బ్లాక్-22లోని జీ6 గృహాన్ని అధికారులు కేటాయించారు.
ఖాళీ గృహాలు స్వాధీనం
ఆపై దొంగ పత్రాలతో విక్రయం
న్యూస్టుడే, తిరుపతి (నగరం)
దామినేడులోని పట్టణ గృహ సముదాయం
* తిరుపతి పద్మావతీపురానికి చెందిన బాలాజీకి దామినేడు పట్టణ గృహాలు బ్లాక్-22లోని జీ6 గృహాన్ని అధికారులు కేటాయించారు. కొంతకాలంగా ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గ్రహించిన స్థానిక అధికార పార్టీ నాయకులు గుట్టుచప్పుడు కాకుండా మరో వ్యక్తికి విక్రయించారు. ఆలస్యంగా ఇంటి యజమాని వెళ్లి చూడగా పక్కనే ఉన్న మరో వ్యక్తి ఆ ఇంటిని కలుపుకొని గోడకట్టి ఉంది. బాధితుడు ప్రశ్నించగా.. కాలనీలోని ఓ నాయకురాలు, ఆమె అనుచరులు విక్రయించినట్లు చెప్పాడు. బాధితుడు ఆమెను నిలదీయగా బెదిరింపులకు దిగడం గమనార్హం. ఇలా 20 మంది లబ్ధిదారులకు తెలియకుండానే నకిలీ ధ్రువపత్రాలతో కొందరు విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కేంద్రం నిధులతో తిరుపతి సమీపంలోని దామినేడు వద్ద పట్టణ గృహ సముదాయాలు నిర్మించారు. ఒక్కొక్క బ్లాక్లో 24 కుటుంబాలు నివాసం ఉండేలా 83 బ్లాక్ను నిర్మించి... పది సంవత్సరాల క్రితం దశలవారీగా లబ్ధిదారులకు కేటాయించారు. దాదాపు రెండు వేల మందికి పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. కొంత మంది లబ్ధిదారులు తమ ఇళ్లకు తాళాలు వేసి ఉపాధి కోసం బయటి ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఇలాంటి గృహాలపైన కొందరు అక్రమార్కుల కళ్లుపడ్డాయి. ఎక్కువ రోజులు ఇళ్లకు తాళాలు వేసిన గృహాలనే లక్ష్యంగా చేసుకున్నారు.
* ఖాళీ ఇళ్లే లక్ష్యం
దామినేడు పట్టణ గృహాల్లో నూతనంగా నిర్మించిన సముదాయంలో చాలా వరకు ఇళ్లు లబ్ధిదారులు కేటాయించలేదు. స్థానిక నాయకులు కొందరు ఖాళీగా ఉన్న ఇళ్లను అధీనంలోకి తీసుకుని అధికారులకు తెలియకుండా అద్దెకు ఇచ్చి నెలవారీ వసూళ్లకు పాల్పడుతున్నారు. మరికొందరు గృహాలను లబ్ధిదారుల నుంచి పక్క పక్కనే ఉన్న రెండు ఇళ్లను కొనుగోలు చేసి ఒకటిగా చేసి వాడుకుంటున్నారు. అనుమతులు లేకుండానే రెండు ఇళ్ల మధ్య గోడలను తొలగించి ఒకటి చేస్తున్నారు. అక్రమాలపై తిరుచానూరు పంచాయతీకి వరుస ఫిర్యాదులు అందాయి.
యజమానులకు తెలియకుండానే బయటి వ్యక్తులకు అమ్మిసొమ్ము చేసుకుంటున్నారు. ఇలా దాదాపు 20కి పైగా ఇళ్లను విక్రయించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక గృహాల్లో నివాసం ఉంటున్న అధికార పార్టీకి చెందిన కొందరు గ్రూపులుగా ఏర్పడి ఖాళీ ఇళ్లను అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం
దామినేడు పట్టణ గృహాల్లోని లబ్ధిదారులకు తెలియకుండా వాళ్ల ఇళ్లను ఎవరైనా విక్రయించినట్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. గత ఏడాది ఆగస్టులో అన్ని గృహాల్లో సిబ్బంది సర్వే చేసి పూర్తి వివరాలను నమోదు చేసుకున్నాం. ఖాళీ గృహాలను అక్రమంగా స్వాధీనం చేసుకుని అద్దెకు ఇవ్వడం నేరం. ఇలాంటి వాటిని నియంత్రిస్తాం.
పులి లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి, తిరుచానూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిలోద‘కౌలు’
[ 24-04-2024]
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చేస్తాం’. -
‘సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి’
[ 24-04-2024]
సీఎం జగన్ కోడికత్తి తరహాలో ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం విఫలైంది.. నుదుటిపై చిన్నపాటి దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకులు హత్యాయత్నం అంటూ హడావుడి చేస్తున్నారు.. అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
బ్యానర్లు తొలగించరు.. నిబంధనలు వర్తింపజేయరు
[ 24-04-2024]
గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు. -
గోపాలమిత్ర.. జగన్ మౌన పాత్ర
[ 24-04-2024]
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా.. -
ఐదోరోజు 24 నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. అభ్యర్థులు జగపతి (కాంగ్రెస్), రమేష్ (ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ), భూలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), జయకర్(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు. -
ఏడేళ్ల చిన్నారికి పెద్ద కష్టం
[ 24-04-2024]
పట్టణంలోని ఈస్టుపేటకు చెందిన ఆటో డ్రైవర్ ప్రేమకుమార్, సుభాషిణి దంపతుల కుమార్తె జెస్సిక (7). ఏడాది కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. -
‘వైకాపాను నమ్ముకొని.. నడిరోడ్డుపైకి వచ్చా’
[ 24-04-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తే తగిన ప్రాధాన్యం దక్కలేదని 11వ డివిజన్ వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్ మార్తాళ్ భర్త శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. -
నమ్ముకుంటే.. మోసపోయాం
[ 24-04-2024]
రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు. -
‘అరాచక పాలనకు అంతం పలకాలి’
[ 24-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. -
బస్టాండా.. అదెక్కడ..?
[ 24-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు. -
కుమారుడి కోసమే ‘కరుణ’
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు. -
వైకాపాకు వర్తించని నిబంధనలు.. అడుగడుగునా ఉల్లంఘనలు
[ 24-04-2024]
సత్యవేడు వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమంలో మంగళవారం ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసినా అధికారులు పట్టించుకోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ