కష్టపడితే మంచి రోజులు
కష్టపడి ప్రజల్లో తిరిగితేనే మంచిరోజులు వస్తాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు సూచించారు
చంద్రబాబుతో కురుగొండ్ల
వెంకటగిరి గ్రామీణం, న్యూస్టుడే : కష్టపడి ప్రజల్లో తిరిగితేనే మంచిరోజులు వస్తాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు సూచించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికల విజయం నేపథ్యంలో సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో నియోజకవర్లా ఇన్ఛార్జులు పాల్గొన్నారు. తెదేపా కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అధినేత సూచించినట్లు రామకృష్ణ తెలిపారు. వెంట తెదేపా రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు పాల్గొన్నారు. గూడూరు పట్టణం : మంగళగిరిలో జరిగిన సమావేశంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్కుమార్ పాల్గొన్నారు. నాయకులని, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ తెదేపాను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్లు ఆయన తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Wrestlers protest: గంగా నది తీరంలో రోదనలు.. పతకాల నిమజ్జానికి బ్రేక్
-
Crime News
భార్యపై అనుమానం.. నవజాత శిశువుకు విషమెక్కించిన తండ్రి
-
India News
Bengaluru: మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం.. ఎలాంటి షరతులుండవ్!: మంత్రి
-
Movies News
social look: విహారంలో నిహారిక.. షికారుకెళ్లిన శ్రద్ధా.. ఓర చూపుల నేహా
-
Politics News
Lokesh: రూ.లక్ష కోట్లున్న వ్యక్తి పేదవాడు ఎలా అవుతారు?: లోకేశ్
-
India News
Lancet Report: తీవ్ర గుండెపోటు కేసుల్లో.. మరణాలకు ప్రధాన కారణం అదే!