పట్టుపడితే.. పసిడి పతకం
ఎటువంటి ఆయుధం లేకుండా తమను తాము రక్షించుకోవచ్చన్న ధీమా తైక్వాండోతో సాధ్యం. అందులో ప్రతిభ చూపి పతకాలు సాధించడం అంత సులువేం కాదు.
చిన్న వయసులోనే తైక్వాండోలో ప్రతిభ
గూడూరు పట్టణం, న్యూస్టుడే: ఎటువంటి ఆయుధం లేకుండా తమను తాము రక్షించుకోవచ్చన్న ధీమా తైక్వాండోతో సాధ్యం. అందులో ప్రతిభ చూపి పతకాలు సాధించడం అంత సులువేం కాదు. అందులోనూ చిన్నారులకు మరింత కష్టతరం. అయితే తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల శిక్షణతో ఓ బాలుడు జిల్లా స్థాయిలో సత్తాచాటి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో దూసుకెళ్తున్నాడు. ఆ బాలుడే మూర్తేష్ సాయిసింగ్.
గూడూరు రెండో పట్టణం జానకీరామ్పేటకు చెందిన జశ్వంత్సింగ్, ఝాన్సీరాణిల కుమారుడు సాయిసింగ్. స్థానిక పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. చిన్న వయస్సు నుంచి చదువులో ముందుండటమే కాకుండా క్రీడారంగంలో రాణిస్తుండటంతో గూడూరు పట్టణంలోని సింహపురి స్పోర్ట్స్ అకాడమీలో నవీన్శంకర్ అనే మాస్టర్ తైక్వాండ్లో శిక్షణ అందిస్తున్నారని తెలుసుకొని అందులో చేర్పించారు. బాలుడి ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ రావడంతో అనతికాలంలోనే సత్తాచాటి తైక్వాండో పోటీల్లో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయిలో పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు. యలమంచిలోని వైఎస్సార్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో కాంస్య పతకాన్ని సాధించాడు.
జాతీయస్థాయిలో రాణించాలన్నదే లక్ష్యం
తైక్వాండో క్రీడలో రాణించడం ఎంతో సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి శిక్షణ పొంది, బంగారు పతకాన్ని సాధించా. గురువు నవీన్ శంకర్ వద్ద శిక్షణ పొందా. అప్పుడే ప్రత్యర్థిని ఎలా ఓడించాలో తెలుసుకున్నా. తైక్వాండోలో బాగా రాణించి, జాతీయ స్థాయిలో రాణించాలన్నదే లక్ష్యం.
మూర్తేష్ సాయిసింగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిలోద‘కౌలు’
[ 24-04-2024]
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చేస్తాం’. -
‘సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి’
[ 24-04-2024]
సీఎం జగన్ కోడికత్తి తరహాలో ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం విఫలైంది.. నుదుటిపై చిన్నపాటి దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకులు హత్యాయత్నం అంటూ హడావుడి చేస్తున్నారు.. అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
బ్యానర్లు తొలగించరు.. నిబంధనలు వర్తింపజేయరు
[ 24-04-2024]
గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు. -
గోపాలమిత్ర.. జగన్ మౌన పాత్ర
[ 24-04-2024]
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా.. -
ఐదోరోజు 24 నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. అభ్యర్థులు జగపతి (కాంగ్రెస్), రమేష్ (ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ), భూలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), జయకర్(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు. -
ఏడేళ్ల చిన్నారికి పెద్ద కష్టం
[ 24-04-2024]
పట్టణంలోని ఈస్టుపేటకు చెందిన ఆటో డ్రైవర్ ప్రేమకుమార్, సుభాషిణి దంపతుల కుమార్తె జెస్సిక (7). ఏడాది కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. -
‘వైకాపాను నమ్ముకొని.. నడిరోడ్డుపైకి వచ్చా’
[ 24-04-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తే తగిన ప్రాధాన్యం దక్కలేదని 11వ డివిజన్ వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్ మార్తాళ్ భర్త శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. -
నమ్ముకుంటే.. మోసపోయాం
[ 24-04-2024]
రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు. -
‘అరాచక పాలనకు అంతం పలకాలి’
[ 24-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. -
బస్టాండా.. అదెక్కడ..?
[ 24-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు. -
కుమారుడి కోసమే ‘కరుణ’
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు. -
వైకాపాకు వర్తించని నిబంధనలు.. అడుగడుగునా ఉల్లంఘనలు
[ 24-04-2024]
సత్యవేడు వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమంలో మంగళవారం ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసినా అధికారులు పట్టించుకోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది