logo

‘భాజపా మోసాన్ని ఎండగడతాం’

అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి తొమ్మిది సంవత్సరాలుగా జాప్యం చేయడం తగదని ఎమ్మార్పీఎస్‌ నేతలు మండిపడ్డారు.

Published : 21 Mar 2023 03:21 IST

పాదయాత్ర చేస్తున్న సురేష్‌

డక్కిలి, న్యూస్‌టుడే : అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి తొమ్మిది సంవత్సరాలుగా జాప్యం చేయడం తగదని ఎమ్మార్పీఎస్‌ నేతలు మండిపడ్డారు. నాలుగో రోజు సోమవారం డక్కిలి మండలంలో నేతలు పర్యటించారు. పాదయాత్రగా వస్తున్న మంగళపూరి సురేష్‌కు స్వాగతం పలికారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా 1996లో జరిగిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వర్గీకరణకు బలపరుస్తూ ఆ పార్టీ తీర్మానం చేసిందని, ఇప్పుడేమో మాదిగలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని