‘ఓటమిని జీర్ణించుకోలేకనే ఎమ్మెల్యేలపై దాడి’
అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఓటమిని జీర్ణించుకోలేకనే ప్రతిపక్ష తెదేపా ఎమ్మెల్యేలపై దాడి చేశారని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు
అమరనాథరెడ్డి
పలమనేరు: అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఓటమిని జీర్ణించుకోలేకనే ప్రతిపక్ష తెదేపా ఎమ్మెల్యేలపై దాడి చేశారని మాజీ మంత్రి అమరనాథరెడ్డి అన్నారు. తెదేపా ఎమ్మెల్యేలు డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై అసెంబ్లీలో వైకాపా ఎమ్మెల్యేలు దాడి చేయడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమే వారిని ఈ స్థితికి దిగజార్చిందన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఒక బ్లాక్డేగా ఆయన అభివర్ణించారు. దేవాలయం వంటి శాసనసభలో దాడి జరగటం వైకాపా ఫ్యాక్షన్ విధానానికి అద్దం పడుతోందన్నారు. చర్యలు తీసుకోకుంటే ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులా మారుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు