logo

జవాను హత్య దారుణం

తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో ఫిబ్రవరి 18న జవాన్‌ లాంచ్‌ నాయక్‌ను.. డీఎంకే కార్పొరేటర్‌ అత్యంత ఘోరంగా హత్య చేయడం దారుణమని, ఇందుకు నిరసనగా మండల కేంద్రంలో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు

Published : 21 Mar 2023 04:10 IST

ప్రదర్శనలో పాల్గొన్న యువకులు

నిండ్ర: తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో ఫిబ్రవరి 18న జవాన్‌ లాంచ్‌ నాయక్‌ను.. డీఎంకే కార్పొరేటర్‌ అత్యంత ఘోరంగా హత్య చేయడం దారుణమని, ఇందుకు నిరసనగా మండల కేంద్రంలో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయవాది రాగసందేశ్‌ మాట్లాడుతూ హత్య జరిగిన 14 రోజుల తర్వాత పోలీసులు హంతకుడు పరారయ్యాడని చూపడం ద్వారా ప్రజలకు చట్టాలపై నమ్మకం పోయిందన్నారు. భాజపా జిల్లా కార్యదర్శి రమేష్‌నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు గుణశేఖర్‌రెడ్డి, నాయకులు గిరి, తంజామోహన్‌, పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని