logo

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి

బంగారుపాళ్యం మండలం నలగాంపల్లికి చెందిన కె.తులసీరామానాయుడు(61) ఆదివారం అర్ధరాత్రి తన కారులో చిత్తూరు వైపు వస్తున్నాడు.

Published : 21 Mar 2023 04:10 IST

తులసీరామానాయుడు (పాతచిత్రం)

యాదమరి: బంగారుపాళ్యం మండలం నలగాంపల్లికి చెందిన కె.తులసీరామానాయుడు(61) ఆదివారం అర్ధరాత్రి తన కారులో చిత్తూరు వైపు వస్తున్నాడు. మహారాష్ట్ర రాష్ట్రంలోని బీడ్‌ జిల్లా అస్తి తాలూకా కాప్సి గ్రామానికి చెందిన కృష్ణగోల్హర్‌ గూడ్స్‌ లారీ నడుపుతూ ఎలాంటి సంకేతం లేకుండా రహదారిపై ఎడమ నుంచి కుడి వైపునకు రావడంతో కారు వేగంగా ఆ లారీని ఢీకొనడంతో తీవ్ర గాయాలైన తులసీరామానాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కంటైనర్‌ను ఢీకొని ఒకరు..

పూతలపట్టు: చిత్తూరుకు చెందిన పెరుమాళ్‌, రాజేంద్ర ద్విచక్ర వాహనంపై చంద్రగిరికి వెళ్లి తిరిగి వస్తుండగా మిట్టూరు సమీపంలో పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఇరువురిని వేలూరు సీఎంసీకి తరలిస్తుండగా మధ్యలో పెరుమాళ్‌(46) మరణించగా రాజేంద్ర పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై హరిప్రసాద్‌ కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని