అమృత్ జలధారకు దరఖాస్తుల ఆహ్వానం
అమృత్ జలధార పథకానికి షెడ్యూల్డు కులాల్లోని అర్హులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నరసింహులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్టుడే: అమృత్ జలధార పథకానికి షెడ్యూల్డు కులాల్లోని అర్హులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నరసింహులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బోరుబావి, మోటారు, డ్రిప్, స్ప్రింక్లర్లు ఇస్తారని, యూనిట్టు విలువలో 50 శాతం లేదా రూ.50 వేల వరకూ రాయితీ ఉంటుందని పేర్కొన్నారు. 2.5 ఎకరాల భూమి ఉండాలని, ఒకరు లేదా గ్రూపుగానూ ఉండవచ్చని, సంవత్సర ఆదాయం రూ.3 లక్షలకు మించి ఉండరాదని స్పష్టం చేశారు. అలాగే యంగ్ ఎంటర్ప్రెన్యూర్ పథకం కింద స్వయం ఉపాధి కోసం గొర్రెలు, పాడి గేదెల పెంపకం, ట్రాక్టరు, ప్యాసింజర్ వాహనం (కారు, వ్యాను), ఆటో మొబైల్ సర్వీసింగ్ యూనిట్, బ్యాటరీ యూనిట్, కొవ్వొత్తుల తయారీ, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, ఎలక్ట్రానిక్ వస్తువుల మరమ్మతు, కంప్యూటర్ సర్వీసింగ్తో పాటు ఇంకా వివిధ స్వయం ఉపాధి పనుల కోసం యూనిట్టు విలువలో 50 శాతం లేదా రూ.60 వేల వరకూ రాయితీతో రుణం మంజూరు చేయనున్నట్లు వివరించారు. రేషన్, ఆధార్కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయపు పత్రం, మొబైల్ నెంబరు, బ్యాంకు పాసు పుస్తకం, భూమి పట్టాదార్ పాసుపుస్తకం, పాస్పోర్టు సైజు ఫొటోతో sbms.ncog.gov.in వెబ్సైట్లో బ్యాంకు పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
నెహ్రూ యువకేంద్రం ఖాళీలకు..
చిత్తూరు(క్రీడలు): నెహ్రూ యువ కేంద్ర (ఎన్వైకే)లో జాతీయ సేవా కార్యకర్తలుగా పనిచేసేందుకు ఆసక్తిగల యువత నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నట్లు ఎన్వైకే జిల్లా యువజన అధికారి ప్రదీప్కుమార్ తెలిపారు. అభ్యర్థుల వయస్సు 1-4-2023 నాటికి 18 నుంచి 29 ఏళ్లలోపు ఉండాలని, పదోతరగతి విద్యార్హత కలిగినవారు అర్హులన్నారు. ఎంపికైన సేవా కార్యకర్తలు గ్రామాల్లో యువజన, మహిళా మండలి స్థాపన, చైతన్య సదస్సుల్ని నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ నెల 24 తేదీలోగా ఎన్వైకేఎస్ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తుల్ని సమర్పించాలన్నారు. వివరాలకు 08572-241317 కార్యాలయ నెంబరును సంప్రదించాలని ఆయన సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా ఇష్టం.. ‘అన్నీ పెద్దాయన’కే..
[ 19-04-2024]
ఆయనో ‘పెద్ద’ మంత్రి.. పైగా రాష్ట్రంలోనే నంబర్-2గా పేరుంది.. దీనికితోడు కీలక శాఖలన్నీ ఆయన గుప్పిట్లోనే ఉన్నాయి.. ఇంకేం ఆయన ఎవరికీ ఫలానా పనిచేయండి అని చెప్పనవసరం లేదు.. -
భర్తీ చేయక.. బాధపెట్టేరూ..!
[ 19-04-2024]
‘మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తాం. ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం’.. ప్రతిపక్షనేతగా ప్రజాసంకల్ప యాత్రలో జగన్ రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ ఇది. -
పేదల పాలిట.. వినాసికారే..!
[ 19-04-2024]
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
ప్రజలు తెదేపా వైపు చూస్తున్నారు..
[ 19-04-2024]
రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో విసిగిపోయి తెదేపా వైపు చూస్తున్నారని చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి వీఎం థామస్ అన్నారు. గురువారం పెనుమూరుకు చెందిన వైకాపా నాయకులు విశ్వప్రకాష్నాయుడు, -
‘వైకాపా పాలనకు రోజులు దగ్గరపడ్డాయి’
[ 19-04-2024]
నగరి తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలోని తన స్వగృహం నుంచి బయల్దేరి తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకట్రామాపురంలోని తన తండ్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడి... -
జగనన్న తీరేంటంటే.. ఐదేళ్లూ చూశామంతే..!
[ 19-04-2024]
ప్రభుత్వ ఉద్యోగులతో పని చేయించుకోవడంలో జగనన్న పనితనం మామూలుగా లేదు.. ఎన్నికలకు ముందు రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ అని మాయమాటలు చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక మడమ తిప్పారు సీఎం జగన్.. -
న్యాయమూర్తుల సేవలు స్ఫూర్తిదాయకం
[ 19-04-2024]
కేసుల పరిష్కారంలో న్యాయమూర్తుల సేవలు అందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసమూర్తి, -
‘చంద్రబాబు ప్రత్యర్థిగా జగన్ నిలబడినా ఓటమే’
[ 19-04-2024]
కుప్పం నుంచి ప్రస్తుత సీఎం జగన్మోహన్రెడ్డి బరిలో నిలిచినా ఓటమి ఖాయమని, ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి దాన్ని వృథా చేసుకోవద్దని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఓటేసి విలువను కాపాడుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు. -
అభివృద్ధి చేసినందునే మరోమారు టికెట్
[ 19-04-2024]
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినందునే వెంకటేగౌడకు ఈ దఫా టికెట్ దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
వర్క్ ఆర్డర్లు క్లోజ్ చేయకపోతే వేతనాల్లో రికవరీ
[ 19-04-2024]
వర్క్ ఆర్డర్లను నెలాఖరులోగా క్లోజ్ చేయకపోతే వేతనాల నుంచి రికవరీ చేస్తామని విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్ ఎస్ఏవో శ్రీనివాసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్