logo

1197 మంది గైర్హాజరు

ఇంటర్‌ పరీక్షల్లో భాగంగా మంగళవారం ద్వితీయ సంవత్సరం గణితం, వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

Published : 22 Mar 2023 03:12 IST

తిరుపతి(విద్య): ఇంటర్‌ పరీక్షల్లో భాగంగా మంగళవారం ద్వితీయ సంవత్సరం గణితం, వృక్షశాస్త్రం, పౌరశాస్త్రం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జనరల్‌ విద్యార్థులు 41,014 మందికి గాను 39,961 మంది హాజరు కాగా 1,053 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విద్యార్థులు 3,105 మందికి గాను 2,961 మంది హాజరై 144 మంది గైర్హాజరయ్యారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 141 కేంద్రాల్లో 44,119 మందికి 1,197 మంది గైర్హాజరైనట్లు ఆర్‌ఐవో రమేష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని