logo

వైట్నర్‌ కోసం వ్యక్తి దారుణహత్య

గూడూరులో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తిని (30) బండరాయితో మోది హత్యచేశారు. ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

Published : 22 Mar 2023 03:22 IST

గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: గూడూరులో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తిని (30) బండరాయితో మోది హత్యచేశారు. ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గూడూరు రైల్వే స్టేషన్‌ పరిధిలోని ఆర్‌ఎంఎస్‌ కార్యాలయ పరిసరాల్లో మత్తుపదార్థాలు పీల్చే ముఠా మధ్య ముందుగా గొడవ జరిగింది. ఓ వ్యక్తి తన వద్ద ఉన్న మత్తుపదార్థం (వైట్నర్‌) ఇవ్వకపోవడంతో ఇతరు ముఠాసభ్యులు ఆక్రోశంతో అక్కడే ఉన్న బండరాయితో తలపై మోదడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. తల గుర్తుపట్టలేనంతగా ఉంది. హత్య అనంతరం ముఠా సభ్యులు పరారయ్యారు. సీఐ హజరత్‌బాబు, సిబ్బంది ఘటనా స్థలం పరిశీలించారు. రైళ్లలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే కొందరు ఇక్కడ అడ్డా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని