నేడు మహతిలో ఉగాది ఉత్సవం
తితిదే హిందూ ధార్మిక ప్రాజెక్టులు, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది ఉత్సవాన్ని బుధవారం ఉదయం 9.30 గంటలకు నగరంలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు.
తిరుపతి(తితిదే): తితిదే హిందూ ధార్మిక ప్రాజెక్టులు, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది ఉత్సవాన్ని బుధవారం ఉదయం 9.30 గంటలకు నగరంలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, తితిదే ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ వారిచే వేదపారాయణం, తితిదే ఆగమసలహాదారు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు వేదాంతం విష్ణుభట్టాచార్యులు పంచాంగ శ్రవణం, తిరుపతికి చెందిన ప్రముఖ అవధాని ఆముదాల మురళి అష్టావధానం చేస్తారు.
తెలుగు ప్రజలకు తితిదే ఛైర్మన్, ఈవో ఉగాది శుభాకాంక్షలు
తిరుమల: తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులతో శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
తిరుపతి (నగరం), న్యూస్టుడే: జిల్లా ప్రజలకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, చిత్తూరు, తిరుపతి ఎంపీలు రెడ్డెప్ప, గురుమూర్తి, జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు, కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, జేసీ బాలాజీ, డీఆర్వో శ్రీనివాసరావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
సర్వదర్శనానికి 15 గంటలు
తిరుమల: శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని ఐదు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరికి దాదాపు 15 గంటల్లో దర్శనం లభించనుందని తితిదే తెలిపింది. సోమవారం శ్రీవారిని 62,824 మంది భక్తులు దర్శించుకున్నారు.
తిరువణ్ణామలైకి 16 ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
తిరుపతి(ఆర్టీసీ): పౌర్ణమి సందర్భంగా ఏప్రిల్ 5వ తేదీన తమిళనాడులోని తిరువణ్ణామలై (గిరి ప్రదక్షిణ) ఆలయానికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి చెంగల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిధిలోని తిరుపతి, మంగళం, అలిపిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, గూడూరు, వాకాడు, సూళ్ళూరుపేట డిపోల నుంచి డీలక్స్-1, ఎక్స్ప్రెస్- 15 మొత్తం 16 సర్వీసులు నడపనున్నట్లు వివరించారు. ఆయా ప్రాంతాల్లోని భక్తులు ముందుగానే ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా రానుపోను రిజర్వేషన్ చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు తిరుపతి బస్స్టేషన్ సహాయ ట్రాఫిక్ మేనేజర్ (ఏటీఎం) డి.రామచంద్ర నాయుడు చరవాణి సంఖ్య 9959225684ను సంప్రదించాలని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.