logo

వరసిద్ధుడి ఆలయంలో ఉగాది ఆస్థానం నేడు

శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో బుధవారం ఉగాది ఆస్థానం నిర్వహించనున్నట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఈవో ఎ.వెంకటేశు తెలిపారు.

Published : 22 Mar 2023 03:22 IST

కాణిపాకం, న్యూస్‌టుడే: శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయంలో బుధవారం ఉగాది ఆస్థానం నిర్వహించనున్నట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ ఎ.మోహన్‌రెడ్డి, ఈవో ఎ.వెంకటేశు తెలిపారు. వేకువజామున స్వామివారి మూలవిరాట్టుకు ప్రత్యేక పంచామృతాభిషేకం నిర్వహించి, ఉదయం 9-10 గంటల మధ్య పంచాంగ శ్రవణం ఉంటుందన్నారు. భక్తులు స్వామివారి హుండీల్లో సమర్పించిన కానుకలను ఈ నెల 29వ తేదీన లెక్కించనున్నట్లు పాలకమండలి ఛైర్మన్‌, ఈవో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని