భారంగా పశుపోషణ
వ్యవసాయ యాంత్రీకరణ అన్నదాతలకు లాభదాయంగా ఉన్నా పాడి రైతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. గతంలో వరి కోతలకు కూలీలు చేపట్టేవారు. దీంతో గడ్డి పుష్కలంగా లభించేది.
గ్రాసం కొరతతో పాడి రైతుల అవస్థలు
పూతలపట్టులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న గ్రాసం
పూతలపట్టు, న్యూస్టుడే: వ్యవసాయ యాంత్రీకరణ అన్నదాతలకు లాభదాయంగా ఉన్నా పాడి రైతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. గతంలో వరి కోతలకు కూలీలు చేపట్టేవారు. దీంతో గడ్డి పుష్కలంగా లభించేది. ప్రస్తుతం అధిక శాతం మంది వరి కోత యంత్రాలను ఆశ్రయిస్తుండటంతో ఎండుగడ్డి దొరకడం లేదు. దీని వల్ల పాడి రైతులు అధిక ధరలు వేచ్చించి దూర ప్రాంతాల నుంచి గ్రాసాన్ని కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఎగుమతి, దిగుమతి రవాణా ఖర్చులు కలిపి మరింత భారంగా మారింది. ఇదే అదనుగా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.
గతంలో ప్రభుత్వమే అండ
గ్రాసం కొరత ఏర్పడుతుందన్న ముందు చూపుతో గతంలో తెదేపా ప్రభుత్వం ప్రశుగ్రాస క్షేత్రల పెంపకానికి చేయూతనిచ్చింది. వ్యవసాయ పశుసంవర్థక శాఖలు కలిసి వార్షిక, ఏక వార్షిక గడ్డి విత్తనాలు, నారు అందించారు. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం వాటికి స్వస్తి పలకడంతో పాడి రైతులకు అంతకంతకు పోషణ భారంగా మారింది. తెదేపా ప్రభుత్వం పాడి రైతులకు పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేయడమే కాకుండా పశుగ్రాస క్షేత్రాల పెంపకాన్ని ప్రోత్సహించింది. నేటి ప్రభుత్వం ఊసే ఎత్తడం లేదు.
ఆకాశాన్ని అంటుతున్న ధరలు
నియోజకవర్గ పరిధిలో తవణంపల్లె, యాదమరి, బంగారుపాళ్యం, ఐరాల, పూతలపట్టు మండలాలు ఉన్నాయి. పశువర్థశాఖ గణాంకాల ప్రకారం నియోజకవర్గంలో 90,556 పాడి పశువులు, 46,432 గొర్రెలు, మేకలు ఉన్నాయి. సుమారు 7వేల ఎకరాల్లో వరి సాగవుతోంది. కూలీల కొరత, ప్రకృతి విపత్తుల నేపథ్యంలో అధిక శాతం మంది రైతులు యంత్రాలతో కోతలు చేపడుతున్నారు. యంత్రాల వినియోగంతో పశువులకు సరిపడ గడ్డి దొరకడం లేదు. ఒక్కో పశువుకు రోజుకు మూడు నుంచి ఐదు కిలోల వరకు గడ్డి అవసరం అవుతోందని పోషకులు అంటున్నారు. ప్రస్తుతం ట్రాక్టరు గడ్డి రూ.10-12వేల వరకు పలుకుతుండటం పాడి రైతులకు భారంగా మారింది. ప్రభుత్వం పశుగ్రాస క్షేత్రాలు తిరిగి ప్రోత్సహించాలని పశుపోషకులు కోరుతున్నారు.
తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం..: దాణా ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. పశువుల పోషణ భారంగా మారింది. ప్రస్తుతం పచ్చగడ్డి లేకపోవడం పాడి పశువులు ఇండ్లకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందించి క్షేత్రాల సాగుకు చేయూతనిచ్చి ఆదుకోవాలి.
లోకేశ్, పాడి రైతు, దండుమిట్ట
* ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం..: ప్రస్తుతం గ్రాసం కొరత ఉన్న మాట వాస్తవమే. ఆర్బీకేల ద్వారా రాయితీపై టీఎమ్ఆర్ దాణా పంపిణీ చేస్తున్నాం. 75శాతం రాయితీతో గ్రాసం విత్తనాలు పంపిణీ చేయడానికి నివేదికలు పంపాం. విత్తనాలు వచ్చిన వెంటనే సరఫరా చేస్తాం. అధికారుల సూచనలు, సలహా మేరకు ఇతర చర్యలు చేపడతాం.
గీతారెడ్డి, పశువైద్యురాలు, పూతలపట్టు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోచుకునే ఎమ్మెల్యేలు కావాలా..?
[ 28-03-2024]
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి స్వగ్రామం తుమ్మలగుంటకు చెందిన వైకాపా నేతలు రాష్ట్ర సాహితీ అకాడమీ డైరెక్టర్ దొడ్ల గౌరీ, పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్ల కరుణాకర్రెడ్డి, నరసింహమూర్తి, రేవంత్ తదితరులు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. -
వృద్ధులు.. దివ్యాంగుల ఓట్లపై వాలంటీర్ల గురి
[ 28-03-2024]
చిత్తూరు జిల్లా పంచాయతీ, గూడూరు, న్యూస్టుడే: దివ్యాంగులైన ఓటర్లు, వృద్ధులకు కల్పించిన వెసులుబాటును వైకాపా అడ్డదారుల్లో వాడుకునే ఎత్తుగడ చేస్తోంది. -
అనిశా వలలో ఆర్ఐ
[ 28-03-2024]
స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఆర్ఐగా పనిచేస్తున్న రెడ్డెప్ప బుధవారం సాయంత్రం లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కాడు -
శ్రీవారి సేవలో రామ్చరణ్ దంపతులు
[ 28-03-2024]
శ్రీవారిని ప్రముఖ సినీనటుడు రామ్చరణ్, ఉపాసన దంపతులు కుమార్తె క్లింకార ఇతర కుటుంబసభ్యులతో సుప్రభాత సేవలో దర్శించుకున్నారు -
బకాయిలిస్తేనే మరమ్మతులు
[ 28-03-2024]
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియంత్రికలు మండుతున్నాయి.. ఎండలు తీవ్రమవడం.. విద్యుత్తు వినియోగం పెరగడం.. అధిక లోడు, సాంకేతిక కారణాలతో దగ్ధమవుతున్న వాటి సంఖ్య నానాటికీ పెరుగుతోంది.. -
విధుల నుంచి వాలంటీర్ తొలగింపు
[ 28-03-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గుడుపల్లె మండలం యామగానిపల్లె సచివాలయం క్లస్టర్-4 వాలంటీర్ నాగరాజును విధుల నుంచి తొలగించామని ఎంసీసీ నోడల్ అధికారులు.. జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపారు -
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 28-03-2024]
సార్వత్రిక పాఠశాల పదో తరగతి, ఇంటర్మీడియేట్ పరీక్షల్లో విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ డీఈవో దేవరాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
మత్తు.. చిత్తు
[ 28-03-2024]
ఎన్నికల వేళ ప్రజలను మత్తులో ముంచేందుకు రాజకీయ పార్టీలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత భారీగా పొరుగు మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు. -
రెండో రోజూ హైడ్రామా!
[ 28-03-2024]
రేణిగుంట మండలం పీసీఆర్ గోదాము వద్ద బుధవారం హైడ్రామా నడిచింది. రామకృష్ణాపురం సమీపంలోని గోదాము వద్ద హైడ్రామా మంగళవారం జరగ్గా.. అది కొనసాగింది. -
‘మేం కలిసి పనిచేసినా మంత్రి రోజా ఓడిపోతుంది’
[ 28-03-2024]
నగరిలో మంత్రి రోజా, అసమ్మతి నాయకులు మధ్య సయోధ్య కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. -
ఈ రంగులు మారవా.. సార్..!
[ 28-03-2024]
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి దాదాపు 12 రోజులు గడిచినా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం ఎన్నికల సంఘం అంటే కాసింత గౌరవం కాదుకదా.. భయం కూడా కొందరు అధికారుల్లో లేకపోవడం గమనార్హం -
కోడ్ అమలులో నిర్లక్ష్యం...
[ 28-03-2024]
ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చి రోజలు గడుస్తున్నా సచివాలయాలపై సీఎం జగన్ చిత్రాలు నేటికీ దర్శనమిస్తూనే ఉన్నాయి. -
యువకుడి ఆత్మహత్య
[ 28-03-2024]
ప్రేమించిన యువతి మాట్లాడక పోవడంతో వింజంకు చెందిన ధనుష్(20) బుధవారం సాయంత్రం ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. -
తెదేపాలో చేరిక
[ 28-03-2024]
మాజీ కార్పొరేటర్ అన్నపూర్ణ సహా ఎనిమిదో డివిజన్కు చెందిన పలువురు వైకాపా మహిళలు బుధవారం తెదేపాలో చేరారు. -
తెదేపా కార్యకర్తలపై ‘బైండోవర్’ వేధింపులు
[ 28-03-2024]
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పెట్టిన కేసు కొట్టేసినా.. ఇప్పుడు బైండోవర్ పేరుతో పోలీసులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. -
వారికి సిద్ధం.. ప్రజలకు కష్టం
[ 28-03-2024]
తిరుపతి(ఆర్టీసీ), న్యూస్టుడే: వైకాపా ఎన్నికల ప్రచారంలో భాగంగా తలపెట్టిన ‘మేమంతా సిద్ధం’ సభలకు జిల్లాలోని ఆర్టీసీ బస్సులు పెద్దఎత్తున కేటాయించారు. -
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
[ 28-03-2024]
దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!