మంచినీరు కరవు
పలమనేరు పట్టణంలోని పెద్దచెరువులోకి మురుగు నీరు చేరి కలుషితమవుతోంది. ఈ నీరు భూమిలోకి ఇంకడంతో దానికి దరిదాపుల్లో ఉన్న బోర్ల నుంచి వచ్చే నీరు కూడా ఉప్పుశాతం ఎక్కువగా ఉంటూ ప్రమాదకరంగా ఉంటోంది.
శుద్ధజలం ప్లాంట్లలో నాణ్యత లేమి
కలుషిత నీటితో రోగాల బారిన ప్రజలు
పలమనేరు పట్టణంలోని పెద్దచెరువులోకి మురుగు నీరు చేరి కలుషితమవుతోంది. ఈ నీరు భూమిలోకి ఇంకడంతో దానికి దరిదాపుల్లో ఉన్న బోర్ల నుంచి వచ్చే నీరు కూడా ఉప్పుశాతం ఎక్కువగా ఉంటూ ప్రమాదకరంగా ఉంటోంది. చెరువు సమీపంలో బోర్ల ద్వారా వచ్చే నీటిని పట్టుకునే బకెట్లు, పాత్రలు నల్లగా మసిబారిపోయి ఉంటాయి. దాన్ని బట్టి ఆ నీరు ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. అయితే పట్టణంలో ప్రైవేటు నీటి ప్లాంటు నిర్వాహకులు సరఫరా చేసే నీటి విషయంలో అధికారులు ఉదాసీనంగా ఉంటే ఎంత ప్రమాదమో అని ఆలోచించాలి. ఆ నీటిని ఎంత శుద్ధి చేసినా తాగటానికి ప్రమాదకరం. చెరువులో మురుగు నీరు చేరకుండా చేసేంత వరకు ఈ చుట్టుపక్కల లభించే నీటిలో ప్రమాద కారకాలు ఎక్కువగానే ఉంటాయి.
పలమనేరు, న్యూస్టుడే: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శుద్ధ జలం అవసరం. అయితే పట్టణాల్లో రక్షిత మంచినీరు అందటం లేదు. మార్కెట్లో ఉన్న ప్రైవేటు ఆర్వో ప్లాంటు నీటిని తాగినా ప్రజలకు రోగాలు తప్పటం లేదు. ఇబ్బడిముబ్బడిగా వ్యాపారులు మినరల్ వాటర్ సరఫరా పేరిట బోరు నీళ్లను నేరుగా ప్రజలకు విక్రయిస్తున్నారు. పట్టణంలో క్యాన్ నీరు రూ.20 చొప్పున ప్రజలకు అమ్ముతున్నారు. వారు నిర్వహించే ఆర్వో ప్లాంట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. అయినా అధికారులు వాటి గురించి పట్టించుకోరు. పలమనేరు, పుంగనూరు, కుప్పం మున్సిపల్ కేంద్రాల పరిధిలో రూ.30 వరకు ప్రైవేటు నీటి విక్రయ ప్లాంట్లు ఉన్నాయి. కొన్ని మినహా చాలా వరకు నాణ్యతా ప్రమాణాలకు దూరంగా పనిచేస్తున్నాయి.
ప్రతి ఒక్కరికి అవసరం
ప్రస్తుతం మారుమూల గ్రామాల నుంచి నగరాల వరకు కూడా క్యాన్వాటర్ పేరిట నీటిని కొని తాగటం అలవాటు చేసుకున్నారు. దీంతో నీరు విక్రయించే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సరైన ప్రమాణాలను పాటించకపోవడంతో ఆ నీటిని తాగితే ప్రజలు రోగాల వారిన పడటం ఖాయం. శరీరంలోని వివిధ భాగాలు సక్రమంగా పనిచేయాలన్నా శుద్ధ జలం ఎంతో అవసరం. చాలా చోట్ల నీటి క్యాన్లను శుభ్రం చేయడం లేదు. వినియోగదారులే స్వయంగా తమ సొంత క్యాన్లతో ప్రస్తుతం నీటిని పట్టుకుంటున్నారు.
శాఖల మధ్య సమన్వయ లోపం
ప్రభుత్వశాఖల మధ్య సమన్వయలోపం నీటి శుద్ధి కేంద్రాల నిర్వహణకు వరంగా మారింది. ఆహార పరిరక్షణ విభాగం, భూగర్భ జలవనరులశాఖ, రెవెన్యూశాఖలు, నీటి శుద్ధి ప్లాంట్ల విషయంలో పర్యవేక్షణ చేయాలి. ఇందులో ఏ ఒక్కశాఖా దీన్ని పట్టించుకోవడంలేదు. నీటి ప్లాంట్లకు అనుమతులు ఉన్నాయా.. విక్రయిస్తున్న నీరు ఎలా ఉంటోందని పరిశీలించేవారు లేకపోయారు.
ప్లాంట్లను పరిశీలిస్తాం
- మూర్తి, ఆర్డీ, మున్సిపల్ విభాగం, అనంతపురం
నీటి ప్రమాణాలను పరిశీలించి చర్యలు తీసుకునే బాధ్యత జలవనరులశాఖకు, పొల్యూషన్ కంట్రోలు విభాగానికి ఉంది. ప్రస్తుత పరిస్థితిపై మున్సిపల్ పరిధిలోని నీటి ప్లాంట్ల విషయాన్ని పరిశీలిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ బీ‘మాయ’
[ 25-04-2024]
ఆపత్కాలంలో కుటుంబానికి తోడుగా నిలుస్తోన్న చంద్రన్న బీమాపై జగనన్న ప్రభుత్వం వచ్చీరాగానే అక్కసు చూపించింది. రెండేళ్లు అరకొరగా అమలు చేసి చివరకు కుటుంబంలో ఒక్కరికే బీమా అవకాశం ఇవ్వడం శాపంగా మారింది. -
భరత్ నామినేషన్ ర్యాలీకి పక్క రాష్ట్రాల జనం
[ 25-04-2024]
కుప్పంలో వైకాపా అభ్యర్థి భరత్ నామినేషన్ ర్యాలీకి బుధవారం రాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తమిళనాడు, కర్ణాటక గ్రామాల నుంచి భారీఎత్తున జన సమీకరణ చేయడం చర్చనీయాంశమైంది. -
ఆలస్యమైనా వేటు తప్పదు..!
[ 25-04-2024]
అధికార పార్టీ నేతల మాటలకు తానా.. తందానా అంటూ వంతపాడుతున్న అధికారులపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంటోంది. విచారణ ప్రక్రియ ఆలస్యమైనా.. చర్యలు మాత్రం పక్కా. రాష్ట్ర నిఘా విభాగాధిపతి, విజయవాడ సీపీ, చిత్తూరు సీఐలపై వేటు ఘటనల్లో ఇది స్పష్టమైంది. -
ప్రజల జోలికొస్తే ఊరుకోం
[ 25-04-2024]
చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు తాము అండగా ఉంటామని, అమాయక ప్రజల కొస్తే ఎంతటి వారైనా ఊరుకునేది లేదని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ హెచ్చరించారు. -
జులై దర్శన టికెట్లు క్షణాల్లో..
[ 25-04-2024]
శ్రీవారి జులై నెల ఆన్లైన్ దర్శన టికెట్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. జులై నెలకు సంబంధించి అంగప్రదక్షిణం టికెట్లను బుధవారం విడుదల చేయగా నాలుగు నిమిషాల వ్యవధిలో.. -
మండిపోతున్నా పట్టక..!
[ 25-04-2024]
సూర్యుడు భగభగ మండిపోతున్నాడు.. వారం రోజులుగా ఎండలు 42-45 డిగ్రీలకు చేరాయి.. విద్యుత్తు వినియోగం మరింతగా పెరిగింది.. గృహ, వ్యవసాయ రంగానికి విద్యుత్తు వినయోగం అధికమైంది.. -
ఒకటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
మే ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఓటర్లకు బీఎల్వోల ద్వారా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
‘శోకో’పాధ్యాయ పాఠశాలలు
[ 25-04-2024]
జగన్ పాలనలో బడి పిల్లలు, పంతుళ్ల బతుకులు అతలాకుతలమయ్యాయి. జీవో 117 వారి జీవితాల్లో చీకట్లు నింపింది. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని కొఠారి కమిషన్ చెబితే.. పాఠాలు చెప్పేవారిని ఇబ్బందులు పెట్టాలంటుంది జగన్ కమిషన్. -
ఆరో రోజు.. 63 నామినేషన్లు
[ 25-04-2024]
రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. ఎంపీ అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు (తెదేపా), భూలక్ష్మీ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), గణపతి (వీసీకే పార్టీ), దగ్గుమళ్ల రాధే (తెదేపా), జయకర్ (స్వతంత్ర), రవి (స్వతంత్ర), మునికృష్ణ (స్వతంత్ర), విజయకుమార్ (బీఎస్పీ)లు నామపత్రాలు సమర్పించారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ సంస్థల కరస్పాడెంట్ నాయుని చంద్రశేఖర్మూర్తి బుధవారం తెలిపారు. -
‘నగరిలో రోజాను ఓడించండి’
[ 25-04-2024]
నగరిలో రోజాను ఓడించాలని.. ఇండియా కూటమి తరఫున పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్రెడ్డిని గెలిపించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. పుత్తూరు అంబేడ్కర్ భవనంలో బుధవారం సీఐటీయూ సమావేశం జరిగింది. -
వైఎస్ఆర్ బీమా.. జగన్ డ్రామా
[ 25-04-2024]
సీఎం జగన్ వైఎస్ఆర్ బీమా ద్వారా పేదలను ఆదుకుంటామని ఆర్భాటపే ప్రకటనలు చేశారు. ఏడాదికి రూ.15 ప్రీమియం కడితే 18-50 సంవత్సరాల లోపు అయితే సహజ మరణానికి రూ.లక్ష, 18-70 సంవత్సరాల వరకు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు. -
చిత్తూరు నగరం.. పసుపు మయం
[ 25-04-2024]
చిత్తూరు నగరం పసుపుమయమైంది. తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ బుధవారం తన నామినేషన్ను అట్టహాసంగా దాఖలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో నగర వీధులు జనసంద్రమయ్యాయి. -
మంత్రి పేరుతో.. విధ్వంసం
[ 25-04-2024]
నగరంలోని లీలామహల్ కూడలి నుంచి కరకంబాడి వెళ్లే మార్గంలో ఇటీవలే స్మార్ట్సిటీ నిధులతో నిర్మించిన రోడ్డును అడ్డదిడ్డంగా తవ్వేశారు. లీలామహల్ సమీపంలో తన అల్లుడు నిర్మించిన బహుళ అంతస్థుల వాణిజ్య భవనం అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటుకు సుమారు 150 మీటర్ల స్మార్ట్సిటీ రోడ్డును మంత్రి పీఏ తన పలుకుబడి ఉపయోగించి ధ్వంసం చేశారు. -
హస్తకళలూ.. విస్తుపోయాయి
[ 25-04-2024]
హస్తకళా గ్రామం అన్నారు. అన్ని హస్తకళలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కళాకారులకు చేయూత.. మార్కెటింగ్.. పర్యాటకులను ఆకర్షించి ఆశించిన రీతిలో మార్కెటింగ్ వసతి తదితర ప్రయోజనాలంటూ హామీలు గుప్పించారు. -
నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. జిల్లా వ్యాప్తంగా ఒక లోక్సభ, ఏడు శాసనసభ స్థానాలకు సంబంధించి ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
ఏమబ్బా.. కాస్త చూసుకుపోండి
[ 25-04-2024]
‘ఏమబ్బా.. పోస్టల్ బ్యాలెట్కు ఫారం - 12 ఇచ్చావా.. ఏంటి పరిస్థితి.. కాస్త చూసుకుపోండి.. తెలుసుకదా ఎవరికి ఓటు వేయాలో..’ ఇదీ కొందరు పోలీసు అధికారులు తమ సిబ్బందితో అంటున్న మాటలు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...