డ్రైవర్లు లేక.. బస్సులు తిరగక
ఏపీఎస్ఆర్టీసీ అద్దె ప్రతిపాదికన నూతనంగా ప్రవేశపెట్టిన విద్యుత్తు ఏసీ బస్సుల నుంచి ఊహించిన మేర ఫలితాలు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
డిపోలోనే విద్యుత్తు ఏసీ బస్సులు
తిరుపతి(ఆర్టీసీ), న్యూస్టుడే: ఏపీఎస్ఆర్టీసీ అద్దె ప్రతిపాదికన నూతనంగా ప్రవేశపెట్టిన విద్యుత్తు ఏసీ బస్సుల నుంచి ఊహించిన మేర ఫలితాలు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లక్ష్యం మేరకు బస్సులు అలిపిరి డిపోకు చేరుకున్నా వాటిని నడిపే డ్రైవర్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 100 బస్సులకు గానూ ఇప్పటి వరకు మొత్తం 82 అలిపిరి డిపోకు చేరుకోగా మిగిలినవి నెలాఖరులోపు చేరుకోనున్నాయి. ప్రస్తుతం 50 తిరుమల-తిరుపతి కనుమ దారిలో, 14 బస్సులు రేణిగుంట విమానాశ్రయం- తిరుమల మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. మిగిలిన బస్సులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, డ్రైవర్ల కొరత కారణంగా రోడ్డెక్కే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అవి డిపోకే పరిమితమయ్యాయి. బస్సుల నిర్వహణ, డ్రైవర్ల నియామకం ఇతర పనులన్నీ గుత్తేదారు సంస్థే చేసుకోవాలన్న నిబంధనలు ఉండటంతో అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
విద్యుత్తు బస్సులు నడపడానికి హెవీ లైసెన్సు పొంది ఒక ఏడాది అనుభవమున్న డ్రైవర్లు అర్హులు. మొదట్లో వచ్చిన బస్సులకు ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా ఉత్తీర్ణత సాధించి అర్హులైన వారిని గుత్తేదారు సంస్థ నియమించుకుంది. వారికి రోజుకు రూ.633 చొప్పున నెలకు రూ.19 వేలు ఇచ్చేవారు. ఆ వేతనంతో వారు రోజుకు తిరుపతి- తిరుమల కనుమదారిలో మూడు రౌండ్ ట్రిప్పులు వేయాల్సి ఉంది. రూ.633 రోజువారీ వేతనంలోనే మూడు పూటలా భోజనానికి పోనూ మిగిలేది లేకపోవడంతో నిరసనలు తెలిపిన సందర్భాలున్నాయి. దీంతో జిల్లా ప్రజా రవాణాధికారి చెంగల్ రెడ్డి జోక్యం చేసుకుని వేతనాల పెంపునకు గుత్తేదారు సంస్థతో చర్చించారు. ప్రస్తుతం రోజుకు రూ.767 చొప్పున నెలకు రూ.23 వేలు చెల్లిస్తున్నారు. రోజుకు మూడు ట్రిప్పులు కాకుండా ఐదు ట్రిప్పులు వేయాల్సి ఉంది. దీంతో ఒక పగలు, ఒక రాత్రి డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ట్రావెల్స్ వాహనాలకు డ్రైవర్ల డిమాండు అధికంగా ఉండటంతో పాటు భోజనం కాకుండా రోజుకు రూ.900 వరకు వచ్చే అవకాశం ఉండటంతో నడపటానికి డ్రైవర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న ‘ఘోర’ముద్ద
[ 20-04-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు మంచి నాణ్యమైన భోజనం అందించేందుకు జగనన్న గోరుముద్ద కార్యక్రమం ప్రవేశపెట్టామని, రోజూ మెనూ ప్రకారం భోజనం అందిస్తామని సీఎం జగన్ చెప్పారు. -
పెద్దిరెడ్డి.. ప్ర‘జల’ ఆశలకు గండి
[ 20-04-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తర్వాత వైకాపాలో నంబరు 2గా, రాయలసీమ జిల్లాల్లో పెత్తనం చెలాయిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిందే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శాసనం.. కాంట్రాక్టులన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. -
రెండో రోజు 16 నామినేషన్లు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని జిల్లా ఎన్నికల అధికారి షన్మోహన్ తెలిపారు. -
ఎమ్మెల్సీ భరత్ను ఆపేసిన పోలీసులు..
[ 20-04-2024]
చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప నామినేషన్ దాఖలు సందర్భంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ను ప్రధాన గేటు వద్దే పోలీసులు ఆపివేశారు -
వైకాపా భూస్మాసురులు
[ 20-04-2024]
పేదలకు దక్కాల్సిన డీకేటీ భూములు వైకాపా అభ్యర్థుల సొంతమయ్యాయి. ఈ మేరకు వారే ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లలో పేర్కొనడం గమనార్హం. -
చీకట్లోనే తనిఖీలు.. చిక్కేరా ఉల్లం‘ఘనులు’
[ 20-04-2024]
అసలే చంద్రగిరి.. తాయిలాలు.. ప్రలోభాలు తారస్థాయిలో జరుగుతున్న వేళ నియోజకవర్గంలోని ఓ తనిఖీ కేంద్రం దుస్థితి చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. -
లోక్సభకు 3.. శాసనసభకు 17
[ 20-04-2024]
జిల్లా వ్యాప్తంగా రెండోరోజు తిరుపతి లోక్సభ స్థానానికి మూడు, ఏడు శాసనసభ స్థానాలకు 17 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు -
కుప్పం గడ్డ.. చంద్రబాబు అడ్డా
[ 20-04-2024]
పురపాలిక పరిధిలోని లక్ష్మీపురం శ్రీవరదరాజులస్వామి దేవాలయంలో నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. -
‘గురు’తర బాధ్యత ఇదేనా జగన్?
[ 20-04-2024]
బోధన సరిగ్గా చేయడంలేదంటూ చిత్తూరు మండలంలోని మాపాక్షి జడ్పీ పాఠశాలలోని హెచ్ఎంను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ అందరి ఎదుటే మందలించారు. -
నిబంధన మీరి.. దూసుకొచ్చి..
[ 20-04-2024]
నామినేషన్ దాఖలు సమయంలో ఆర్వో కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు నిలిచిపోవాలన్న నిబంధనను పుంగనూరులో వైకాపా శ్రేణులు అతిక్రమించాయి -
వైకాపా రంగుల పలకలు తొలగించారు
[ 20-04-2024]
పోలింగ్ కేంద్రాలు కల్గిన బడి ఆవరణలో వైకాపా రంగులతో ఏర్పాటు చేసిన సిమెంటు బెంచీలకు రంగుల పలకలను అధికారులు తీయించారు. -
రాష్ట్ర విభజనకు కారకుడైన కిరణ్కుమార్రెడ్డి
[ 20-04-2024]
ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకొచ్చారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. -
తెదేపా నేతపై దాడి
[ 20-04-2024]
పులిచెర్ల మండలం రేణుమాకులపల్లె పంచాయతీ బి.వడ్డిపల్లెకు చెందిన తెదేపా నాయకుడు సుబ్బరాజుపై స్థానిక వైకాపాకి చెందిన రెడ్డప్ప, వెంకటరమణ అన్నదమ్ములు దాడి పాల్పడ్డారు -
నేడు జిల్లాకు తెదేపా అధినేత రాక
[ 20-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 10:40 గంటలకు గూడూరులోని వరగాలి క్రాస్రోడ్డు సమీపంలోని హెలిపాడ్ చేరుకుంటారు.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?