logo

పిడుగుపాటుకు ఒకరి మృతి

అలివేలుమంగాపురం సమీపంలో పిడుగుపాటుకు ఒకరు దుర్మరణం చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది.

Published : 24 Mar 2023 01:25 IST

సత్యవేడు: అలివేలుమంగాపురం సమీపంలో పిడుగుపాటుకు ఒకరు దుర్మరణం చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. స్థానికుల కథనం మేరకు.. అంబాక్కం గ్రామానికి చెందిన మేకల బాలకృష్ణయ్య(55), సీతారాంపేటకు చెందిన ఎం.రమేష్‌ ఏఎంపురం వద్ద ప్లాంటేషన్‌లో కాపలాదారులుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం మెరుపులతో భారీ వర్షం కురిసి పిడుగు పడింది. సమీపంలోనే వీరిద్దరు ఉన్నారు. ఒక్కసారిగా వచ్చిన శబ్దానికి బాలకృష్ణయ్య స్పృహ కోల్పోయాడు. రమేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. వీరిని 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మేకల బాలకృష్ణయ్య మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రమేష్‌ను తిరుపతికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని