logo

వైకాపా పతనం ఆరంభం: తెదేపా

ఎమ్మెల్సీగా తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంపై తెదేపా శ్రేణులు గురువారం రాత్రి నగరంలో సంబరాలు చేసుకున్నాయి.

Published : 24 Mar 2023 02:09 IST

చిత్తూరు గాంధీ విగ్రహ కూడలిలో తెదేపా నాయకుల సంబరాలు

చిత్తూరు(జిల్లా పంచాయతీ): ఎమ్మెల్సీగా తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంపై తెదేపా శ్రేణులు గురువారం రాత్రి నగరంలో సంబరాలు చేసుకున్నాయి. గాంధీ విగ్రహ కూడలిలో బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇక తెదేపాకు తిరుగులేదని రాష్ట్ర ప్రజలు వైకాపా ప్రభుత్వానికి చరమగీతం పాడి తమను అధికారంలోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని నాయకులు పేర్కొన్నారు. చెప్పారు. మాజీ మేయర్‌, చిత్తూరు నగర పార్టీ అధ్యక్షురాలు కఠారి హేమలత, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ బాలాజీ, మాజీ కార్పొరేటర్‌ వసంత్‌కుమార్‌, నాయకులు రాజశేఖర్‌, వెంకటేష్‌యాదవ్‌, వరలక్ష్మి, శ్రీదర్గు, ఈశ్వర్‌, రమేష్‌, గుణశేఖర్‌, ప్రభుతేజ, మనోహర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని