logo

ఆటో నుంచి దూకడంతో తల్లీబిడ్డకు గాయాలు

ప్రయాణిస్తున్న ఆటో నిలపకుండా వెళ్తుండటంతో భయాందోళనకు గురైన తల్లీ.. బిడ్డను తీసుకుని దూకేసింది. ప్రమాదంలో ఇద్దరూ గాయపడ్డారు.

Published : 24 Mar 2023 02:09 IST

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లీ, బిడ్డను విచారిస్తున్న అర్బన్‌ సీఐ శ్రీధర్‌

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: ప్రయాణిస్తున్న ఆటో నిలపకుండా వెళ్తుండటంతో భయాందోళనకు గురైన తల్లీ.. బిడ్డను తీసుకుని దూకేసింది. ప్రమాదంలో ఇద్దరూ గాయపడ్డారు. ఈ ఘటన కుప్పం పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి భర్త జనార్దన్‌, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుడుపల్లె మండలం కంచిబందార్లపల్లెకు చెందిన నాగవేణి, జనార్దన్‌ దంపతులు. వారికి నాలుగేళ్ల యజ్ఞప్రియ కుమార్తె ఉంది. చిన్నారికి జ్వరం రావడంతో తల్లి పాపను తీసుకుని కుప్పంలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లేందుకు ఓ ఆటో ఎక్కింది. కుప్పం ప్రభుత్వ ఆస్పత్రి వచ్చినా ఆటో ముందుకు వెళ్తుండగా, ఆపమని ఆటో డ్రైవర్‌ను ఆమె కోరింది. అయితే ఆటో డ్రైవర్‌ మరింత వేగంగా ముందుకు వెళ్లడంతో భయాందోళనకు గురైన నాగవేణి బిడ్డను తీసుకుని దూకేసింది. చోదకుడు ఆటో నిలపకుండా వెళ్లిపోయాడు. గాయపడ్డ వారిని స్థానికులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం సంబంధిత ఆటో డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అర్బన్‌ సీఐ శ్రీధర్‌ వివరణ కోరగా, కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు