logo

క్రమశిక్షణతోనే ఉన్నతస్థాయి

విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తేనే ఉన్నతస్థాయికి చేరుకుంటారని డీఈవో విజయేంద్రరావు అన్నారు.

Published : 24 Mar 2023 02:09 IST

విద్యార్థులకు జ్ఞాపికలు అందజేస్తున్న డీఈవో విజయేంద్రరావు

జీడీనెల్లూరు: విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసిస్తేనే ఉన్నతస్థాయికి చేరుకుంటారని డీఈవో విజయేంద్రరావు అన్నారు. ఎట్టేరి శ్రీభానోదయ సీబీఎస్‌ఈ ఆంగ్ల ఉన్నత పాఠశాల వార్షికోత్సవంలో ఆయన గురువారం పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఇప్పటినుంచే సరైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాని సాధనకు కృషి చేయాలన్నారు. అనంతరం ఉత్తమ విద్యార్థులకు ఎంపీడీవో శ్రీదేవి, పాఠశాల వ్యవస్థాపకులు నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయురాలు లావణ్యతో కలిసి ఆయన  బహుమతులు అందజేశారు. బాలబాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని