చిన్నారుల కుంచె.. చిత్తరువులు భళా
పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు చిత్రలేఖనంలో రాణిస్తున్నారు. రోజు సాధన చేస్తూ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపుతున్నారు.
తాము గీసిన చిత్రాలు చూపుతున్న విద్యార్థినులు
పుంగనూరు గ్రామీణ, న్యూస్టుడే: పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు చిత్రలేఖనంలో రాణిస్తున్నారు. రోజు సాధన చేస్తూ పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపుతున్నారు. ఒకవైపు చదువులో ఉత్తమ మార్కులు సాధిస్తూ.. మరోవైపు చిత్రలేఖనంలో రాణిస్తూ భళా అనిపిస్తున్నారు. కళాత్మక, సృజనాత్మక చిత్రాలకు రూపమిస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నారు. పాఠశాలలోని 7, 8, 9 తరగతులకు చెందిన సుమారు 50 మంది బాలికలు చిత్రాలు గీయడంలో సత్తా చాటుతున్నారు. వీరు గీసిన చిత్రాల్లో దేవతామూర్తులు, జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, పక్షులు, ప్రకృతి అందాలు.. తదితర రూపాలను కళ్లకు కట్టినట్లు చూపుతున్నారు. ప్రధానోపాధ్యాయిని తిరుమలమ్మ, ఆధ్వర్యంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కల్చరల్ ఇన్స్ట్రక్టర్ లక్ష్మీ బాలికలకు అల్లికలు, ఫ్లవర్వాజులు, ఇంటిలో అందంగా అలంకరించే వస్తువులు, గాజులు, బొట్టుబిల్ల, ఎంబ్రాయిండరీ, చీరలపై రంగులతో పాటు చిత్రలేఖనంపై శిక్షణ ఇస్తున్నారు. ఏటా డివిజన్ స్థాయి పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకుంటున్నారు.
చదువుతోపాటు.. పాఠశాలలో అనేక మంది బాలికలు చదువులో రాణిస్తూ.. అద్భుతంగా చిత్రాలు గీస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కళ్లతో చూసిన దృశ్యాలను కూడా చిత్రాలుగా మలచడం నేర్చుకుంటున్నారు. భవిష్యత్తులో ఎక్కడ పోటీలు జరిగినా వెళ్లి తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి సంసిద్ధమవుతున్నారు.
సృజనాత్మకత బయటకు తీసే యత్నం
మా పాఠశాలలో 32 మంది వరకు విద్యార్థినులు చిత్రలేఖనంలో ఉత్తమ ప్రతిభ చూపుతున్నారు. వీరిలో పది మంది జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపాలని లక్ష్యంగా పెట్టుకుని శిక్షణ అందిస్తున్నాం. డ్రాయింగ్ ఉపాధ్యాయిని ఆధ్వర్యంలో వారికి తర్పీదునిస్తున్నాం. భవిష్యత్తులో ఉత్తమ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం.
తిరుమలమ్మ, ప్రధానోపాధ్యాయిని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ తిలోద‘కౌలు’
[ 24-04-2024]
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. కౌలుదారీ చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి రైతులు నష్టపోకుండా ఆదుకుంటాం. కౌలురైతులకు గుర్తింపు కార్డులిచ్చి బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందేలా చేస్తాం’. -
‘సిద్ధం సభలు వెలవెలబోతున్నాయి’
[ 24-04-2024]
సీఎం జగన్ కోడికత్తి తరహాలో ప్రజల సానుభూతి పొందాలన్న ప్రయత్నం విఫలైంది.. నుదుటిపై చిన్నపాటి దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకులు హత్యాయత్నం అంటూ హడావుడి చేస్తున్నారు.. అని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. -
బ్యానర్లు తొలగించరు.. నిబంధనలు వర్తింపజేయరు
[ 24-04-2024]
గత నాలుగు రోజుల్లో వరుసగా ఉల్లంఘనలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల అధికారులు సైతం పక్షపాతం చూపుతూ వైకాపా నాయకులైతే ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలుకుతున్నారు. -
గోపాలమిత్ర.. జగన్ మౌన పాత్ర
[ 24-04-2024]
మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా.. నన్ను గెలిపించండి.. మీ వెన్నంటి ఉంటా.. -
ఐదోరోజు 24 నామినేషన్ల దాఖలు
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళవారం 24 నామినేషన్లు దాఖలయ్యాయి. చిత్తూరు ఎంపీ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. అభ్యర్థులు జగపతి (కాంగ్రెస్), రమేష్ (ఆలిండియా మహిళా ఎంపవర్మెంట్ పార్టీ), భూలక్ష్మి(పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), జయకర్(స్వతంత్ర) నామినేషన్లు సమర్పించారు. -
ఏడేళ్ల చిన్నారికి పెద్ద కష్టం
[ 24-04-2024]
పట్టణంలోని ఈస్టుపేటకు చెందిన ఆటో డ్రైవర్ ప్రేమకుమార్, సుభాషిణి దంపతుల కుమార్తె జెస్సిక (7). ఏడాది కిందట తీవ్ర అనారోగ్యానికి గురైంది. -
‘వైకాపాను నమ్ముకొని.. నడిరోడ్డుపైకి వచ్చా’
[ 24-04-2024]
వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తే తగిన ప్రాధాన్యం దక్కలేదని 11వ డివిజన్ వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్ మార్తాళ్ భర్త శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. -
నమ్ముకుంటే.. మోసపోయాం
[ 24-04-2024]
రాత్రింబవళ్లు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన గోపాలమిత్రల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది.. తాను అధికారంలోకి రాగానే గోపాలమిత్రలను క్రమబద్ధీకరించి, వేతనాలు పెంచుతానని ప్రజాసంకల్ప పాదయాత్రలో నేటి సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు. -
‘అరాచక పాలనకు అంతం పలకాలి’
[ 24-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది తెదేపా ప్రచారం జోరందుకుంది. చిత్తూరు నగరం, గుడిపాల, చిత్తూరు గ్రామీణ మండలాల్లో నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. -
బస్టాండా.. అదెక్కడ..?
[ 24-04-2024]
నియోజకవర్గ కేంద్రమైన జీడీనెల్లూరులో బస్టాండు, బస్షెల్టరు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతిరోజూ ఇక్కడి నుంచి చిత్తూరు, తిరుపతి, వేలూరు, బెంగుళూరు, చెన్నై నగరాలతోపాటు సరిహద్దున ఉన్న తమిళనాడు, కర్నాటక రాష్ట్ర ప్రాంతాలకు బస్సులు ఎక్కుతుంటారు. -
కుమారుడి కోసమే ‘కరుణ’
[ 24-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో తన కుమారుడు అభినయ్రెడ్డిని గెలిపించుకునేందుకు తిరుపతి ఎమ్మెల్యే, తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి తాపత్రయపడుతున్నా కాలం కలసి రావడం లేదు. -
వైకాపాకు వర్తించని నిబంధనలు.. అడుగడుగునా ఉల్లంఘనలు
[ 24-04-2024]
సత్యవేడు వైకాపా అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమంలో మంగళవారం ఎన్నికల నిబంధనలను గాలికి వదిలేసినా అధికారులు పట్టించుకోలేదు.
తాజా వార్తలు (Latest News)
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!