తెదేపా వైపే ప్రజల మొగ్గు
ఇక వైకాపా పనైపోయిందని, ఏపీ ప్రజలు బైబై జగన్ అంటున్నా రని, రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి రావడం తథ్యమని నగరి తెదేపా బాధ్యుడు గాలి భానుప్రకాష్ ఓ ప్రకటనలో తెలిపారు.
వాడవాడలా నేతల సంబరాలు
నగరి: ఎన్టీఆర్ విగ్రహం వద్ద నాయకుల సంబరాలు
పుత్తూరు: ఇక వైకాపా పనైపోయిందని, ఏపీ ప్రజలు బైబై జగన్ అంటున్నా రని, రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి రావడం తథ్యమని నగరి తెదేపా బాధ్యుడు గాలి భానుప్రకాష్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెదేపాకు జైకొట్టారన్నారు. కార్వేటినగరం రోడ్డు కూడలిలో నాయకులు టపాకాయలు కాల్చి సంబరాలు చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు జీవరత్నం నాయుడు, జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు షణ్ముగరెడ్డి పాల్గొన్నారు.
నగరి: తెదేపా నాయకులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద బాణసంచా పేల్చి విజయో త్సవాలు నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు జి.రమేష్, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి కె.బాలాజీ, జిల్లా అధికార ప్రతినిధి జ్యోతినాయుడు, జిల్లా కార్యదర్శి ఆర్.బాలాజీ, మైనారిటీ సెల్ కార్యదర్శి ఖాదర్, గుణశేఖర్, ఎస్సీ సెల్ కార్యదర్శి అల్లిముత్తు, అయ్యప్ప, కన్నయ్య, అశోక్, ఆర్ముగం, వికే వాసు, చిన్నరాజు పాల్గొన్నారు.
పాలసముద్రం: ఆముదాల పంచాయతీ రంగాపురం క్రాస్లో తెదేపా నియోజకవర్గ సమన్వయకర్త చిట్టిబాబునాయుడు ఆధ్వర్యంలో నాయకులు టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు. నాయకులు బుజ్జి, అరుల్నాథన్, మణినాయుడు, బొజ్జయ్య, రవినాయుడు, శేఖర్ రాజు, సాంబశివం, తంగరాజు పాల్గొన్నారు.
పెనుమూరు: నినాదాలు చేస్తున్న తెదేపా నాయకులు
తవణంపల్లె: తవణంపల్లె, దిగువమాఘం గ్రామాల్లో తెదేపా నాయకులు టపాకాయలు పేల్చి, విజయ సంకేతం చూపారు. పార్టీ మండలాధ్యక్షుడు గాలి దిలీప్నాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెనుమూరు: అనూరాధ గెలుపు వైకాపాకు గొడ్డలి పెట్టు అని రాష్ట్ర టీఎన్టీయూసీ కార్యనిర్వాహక కార్యదర్శి ఇ.లోకనాధనాయుడు అన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు రుద్రయ్యనాయుడు ఆధ్వర్యంలో నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి రెడ్డెప్ప, నియోజకవర్గ తెలుగురైతు అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్, పీహెచ్సీ మాజీ అధ్యక్షుడు పరమేళ్వర్రెడ్డి, సింగిల్విండో మాజీ డైరెక్టర్ శ్రీనివాసచౌదరి, జిల్లా తెలుగు యువత కార్యదర్శి గురప్పనాయుడు పాల్గొన్నారు.
పుత్తూరు: నినాదాలు చేస్తున్న తెదేపా నాయకులు
నగరి: పంచుమర్తి అనురాధ విజయం వైకాపాకు చెంప పెట్టు అని తెలుగు మహిళ అధికార ప్రతినిధి ఆర్.మీరా ఓ ప్రకటనలో తెలిపారు. యాదమరి: ఎమ్మెల్సీగా అనురాధ విజయం హర్షనీయమని తెదేపా మండల అధ్యక్షుడు మురార్జీయాదవ్, ప్రధాన కార్యదర్శి రబీ, బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వినాయకం గౌండర్, జిల్లా కార్యదర్శి హేమగిరి, తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి అమరనాథనాయుడు, నాయకులు పూర్ణచంద్ర, రవి వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు.
తవణంపల్లె: విజయ సంకేతం చూపుతున్న తెలుగు తమ్ముళ్లు
విజయపురం: అనురాధ గెలుపు వైకాపాకు చెంపపెట్టని మండల పార్టీ అధ్యక్షుడు రమేష్రాజు విలేకరులతో అన్నారు.పూతలపట్టు: అనురాధ విజయం సాధించడంతో మండలంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. జాతీయ రహదారిపై పెద్దఎత్తున బాణసంచా పేల్చి నినాదాలు చేశారు. మండల కన్వీనర్ దొరబాబు పాల్గొన్నారు.
‘జగన్రెడ్డి పతనం ప్రారంభమైంది’
చిత్తూరు(జిల్లా పంచాయతీ): ముఖ్యమంత్రి జగన్రెడ్డి పతనం ప్రారంభమైందని ఎమ్మెల్సీ రాజసింహులు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి సురేంద్రకుమార్, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తినాని, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్, మాజీ మేయర్ కఠారి హేమలత, జిల్లా కార్యాలయ కార్యదర్శి మోహన్రాజ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన పంచుమర్తి అనురాధకు వారు అభినందనలు తెలియజేశారు. త్వరలోనే తుగ్లక్ పాలనకు రాష్ట్ర ప్రజలు తెరదించబోతున్నారని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకటి నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ
[ 25-04-2024]
మే ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఓటర్లకు బీఎల్వోల ద్వారా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
శోకోపాధ్యాయ పాఠశాలలు
[ 25-04-2024]
జగన్ పాలనలో బడి పిల్లలు, పంతుళ్ల బతుకులు అతలాకుతలమయ్యాయి. జీవో 117 వారి జీవితాల్లో చీకట్లు నింపింది. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని కొఠారి కమిషన్ చెబితే.. పాఠాలు చెప్పేవారిని ఇబ్బందులు పెట్టాలంటుంది జగన్ కమిషన్. -
ఆరో రోజు.. 63 నామినేషన్లు
[ 25-04-2024]
రిటర్నింగ్ అధికారి షన్మోహన్కు.. ఎంపీ అభ్యర్థులు దగ్గుమళ్ల ప్రసాదరావు (తెదేపా), భూలక్ష్మీ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), గణపతి (వీసీకే పార్టీ), దగ్గుమళ్ల రాధే (తెదేపా), జయకర్ (స్వతంత్ర), రవి (స్వతంత్ర), మునికృష్ణ (స్వతంత్ర), విజయకుమార్ (బీఎస్పీ)లు నామపత్రాలు సమర్పించారు. -
పదిలో విజయవాణి విద్యార్థుల విజయకేతనం
[ 25-04-2024]
విజయవాణి విద్యాసంస్థ విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం విజయవాణి నగర్లోని పాఠశాలలో 99.10 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఆ సంస్థల కరస్పాడెంట్ నాయుని చంద్రశేఖర్మూర్తి బుధవారం తెలిపారు. -
‘నగరిలో రోజాను ఓడించండి’
[ 25-04-2024]
నగరిలో రోజాను ఓడించాలని.. ఇండియా కూటమి తరఫున పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రాకేష్రెడ్డిని గెలిపించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పిలుపునిచ్చారు. పుత్తూరు అంబేడ్కర్ భవనంలో బుధవారం సీఐటీయూ సమావేశం జరిగింది. -
వైఎస్ఆర్ బీమా.. జగన్ డ్రామా
[ 25-04-2024]
సీఎం జగన్ వైఎస్ఆర్ బీమా ద్వారా పేదలను ఆదుకుంటామని ఆర్భాటపే ప్రకటనలు చేశారు. ఏడాదికి రూ.15 ప్రీమియం కడితే 18-50 సంవత్సరాల లోపు అయితే సహజ మరణానికి రూ.లక్ష, 18-70 సంవత్సరాల వరకు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5లక్షలు ఇస్తామని ప్రకటించారు. -
చిత్తూరు నగరం.. పసుపు మయం
[ 25-04-2024]
చిత్తూరు నగరం పసుపుమయమైంది. తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ బుధవారం తన నామినేషన్ను అట్టహాసంగా దాఖలు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో నగర వీధులు జనసంద్రమయ్యాయి. -
మంత్రి పేరుతో.. విధ్వంసం
[ 25-04-2024]
నగరంలోని లీలామహల్ కూడలి నుంచి కరకంబాడి వెళ్లే మార్గంలో ఇటీవలే స్మార్ట్సిటీ నిధులతో నిర్మించిన రోడ్డును అడ్డదిడ్డంగా తవ్వేశారు. లీలామహల్ సమీపంలో తన అల్లుడు నిర్మించిన బహుళ అంతస్థుల వాణిజ్య భవనం అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటుకు సుమారు 150 మీటర్ల స్మార్ట్సిటీ రోడ్డును మంత్రి పీఏ తన పలుకుబడి ఉపయోగించి ధ్వంసం చేశారు. -
హస్తకళలూ.. విస్తుపోయాయి
[ 25-04-2024]
హస్తకళా గ్రామం అన్నారు. అన్ని హస్తకళలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కళాకారులకు చేయూత.. మార్కెటింగ్.. పర్యాటకులను ఆకర్షించి ఆశించిన రీతిలో మార్కెటింగ్ వసతి తదితర ప్రయోజనాలంటూ హామీలు గుప్పించారు. -
నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. జిల్లా వ్యాప్తంగా ఒక లోక్సభ, ఏడు శాసనసభ స్థానాలకు సంబంధించి ఈనెల 18 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. -
ఏమబ్బా.. కాస్త చూసుకుపోండి
[ 25-04-2024]
‘ఏమబ్బా.. పోస్టల్ బ్యాలెట్కు ఫారం - 12 ఇచ్చావా.. ఏంటి పరిస్థితి.. కాస్త చూసుకుపోండి.. తెలుసుకదా ఎవరికి ఓటు వేయాలో..’ ఇదీ కొందరు పోలీసు అధికారులు తమ సిబ్బందితో అంటున్న మాటలు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!