logo

తెదేపా నాయకుల సంబరాలు

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలుపొందడంతో మండలంలో తెదేపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంచారు.

Published : 24 Mar 2023 03:02 IST

కల్లూరు: సంబరాల్లో పాల్గొన్న తెదేపా నాయకులు

కల్లూరు: ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ గెలుపొందడంతో మండలంలో తెదేపా నాయకులు సంబరాలు జరుపుకున్నారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంచారు. మండల తెదేపా అధ్యక్షుడు కృష్ణమూర్తినాయుడు, స్థానిక ఎంపీటీసీ సభ్యుడు మునికృష్ణమనాయుడు, సింధురవి, దేవేంద్ర, గోపీనాయుడు, సుబ్రమణ్యం పాల్గొన్నారు.

వి.కోట: ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న వైకాపా పతనానికి ఎమ్మెల్సీ ఎన్నికలు నాంది పలికాయని మండల తెదేపా అధ్యక్షుడు రంగనాథ్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచమర్తి అనురాధ విజయం సాధించడం పట్ల మండల తెదేపా నేతలు స్థానిక ఎన్టీఆర్‌ సర్కిల్‌లో సంబరాలు చేసుకొన్నారు. రాంబాబు, ధీరజ్‌, శభరీష్‌, ఈశ్వర్‌గౌడు, సోము పాల్గొన్నారు.

ర్యాలీలో పాల్గొన్న నాయకులు

పలమనేరు : ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి అనురాధ గెలుపుపై తెదేపా నాయకులు సంబరాలు చేసుకున్నారు. గురువారం రాత్రి పట్టణంలోని టవర్‌క్లాక్‌ వద్ద బాణసంచా పేలుస్తూ నినాదాలు వినిపించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టారు. కాజా, బలరామ్‌కుట్టి, సోమశేఖర్‌గౌడు, నాగరాజు పాల్గొన్నారు.

శాంతిపురం : మండలి ఎమ్మెల్యేల కోటా ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం పట్ల మండల నాయకులు, కార్యకర్తలు సంతోషాన్ని పంచుకున్నారు. గురువారం రాత్రి శాంతిపురంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాల వేసి.. విజయోత్సవాన్ని చేపట్టారు. బాణాసంచా కాల్చి సంబరాలను చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా విజయఢంకా మోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  పార్టీ మండల అధ్యక్షుడు విశ్వనాథనాయుడు, జనార్ధన్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌, ఉయ్యాల జయరామిరెడ్డి, నాగరాజు పాల్గొన్నారు.  

కుప్పంలో సంబరాలు చేసుకుంటున్న తెదేపా ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం, పీఏ మనోహర్‌

కుప్పం పట్టణం/రామకుప్పం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి అనురాధ విజయం పట్ల ఆ పార్టీ నాయకులు గురువారం సంబరాలు చేసుకున్నారు. కుప్పం పట్టణంలోని ప్యాలెస్‌ రోడ్డు, రామకుప్పంలో కేక్‌ కోసి, టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తెదేపా ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం, పీఏ మనోహర్‌, నాయకులు త్రిలోక్‌, ప్రతాప్‌, గోపీనాథ్‌, ఆనంద్‌రెడ్డి, రాజ్‌కుమార్‌, వెంకటేష్‌, ప్రేమ్‌కుమార్‌, ఆంజనేయరెడ్డి, కౌనిల్సర్‌ సోము, కస్తూరి వేలు పాల్గొన్నారు.

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపు పట్ల తెదేపా నాయకులు గురువారం స్థానిక నాలుగురోడ్ల కూడలిలో సంబరాలు జరుపుకొన్నారు. తెదేపా మండల అధ్యక్షుడు కిశోర్‌గౌడు, నాయకులు సుబ్రహ్మణ్యం, గౌరప్ప, మంజునాథ్‌, రమేష్‌, రాజేష్‌, భువనచంద్ర పాల్గొన్నారు.

రామకుప్పంలో ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని