logo

సమష్టి కృషితోనే విజయం

సమష్టి కృషితోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామని వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Updated : 24 Mar 2023 03:45 IST

మాట్లాడుతున్న రామ్‌కుమార్‌రెడ్డి

వెంకటగిరి, న్యూస్‌టుడే : సమష్టి కృషితోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించామని వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇటీవల విజయం సాధించిన ఎమ్మెల్సీల ఆత్మీయ అభినందన సభ పట్టణంలోని పద్మశాలీ కల్యాణ మండపంలో గురువారం రాత్రి నిర్వహించారు. రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీలు తమ పదవులను సమర్థంగా నిర్వహించాలని, ప్రజాసమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్సీ మురళీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయినులకు ఛైల్డ్‌కేర్‌ సెలవులు 180 ఉంటాయని, వాటిని సర్వీస్‌ కాలంలో ఎప్పుడైనా వినియోగించుకునేలా చూడాలని సీఎం దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించారన్నారు. ఈక్రమంలో నేదురుమల్లి నివాసం నుంచి ర్యాలీ చేపట్టారు. రాజ కుటుంబీకుడు సాయికృష్ణ యాచేంద్రను ఎమ్మెల్సీలు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం గ్రామశక్తి పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. సీనియర్‌ నేత కలిమిలి రామ్‌ప్రసాద్‌రెడ్డి, పుర అధ్యక్షురాలు భానుప్రియ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌ శారద తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని