logo

బాస్కెట్‌బాల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా చెంగల్రాయనాయుడు

ఆంధ్రప్రదేశ్‌ బాస్కెట్‌బాల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా చెంగల్రాయ నాయుడు(చిత్తూరు జిల్లా) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Published : 27 Mar 2023 02:35 IST

ఎన్నికైన నూతన కార్యవర్గం

చిత్తూరు (క్రీడలు), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ బాస్కెట్‌బాల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా చెంగల్రాయ నాయుడు(చిత్తూరు జిల్లా) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాస్కెట్‌బాల్‌ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం చిత్తూరు నగరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడిగా చెంగల్రాయనాయుడు, కార్యదర్శిగా చక్రవర్తి(తూర్పుగోదావరి), టెక్నికల్‌ కమిటీ ఛైర్మన్‌గా సురేష్‌బాబు (చిత్తూరు), సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా అప్పలరాజు(పశ్చిమగోదావరి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ కార్యవర్గాన్ని త్వరలోనే విస్తరిస్తామని చెప్పారు. ఓ కార్పొరేట్‌ సంస్థ బాస్కెట్‌బాల్‌ క్రీడాభివృద్ధి నిమిత్తం చిత్తూరు జిల్లాలో రెండు గ్రామాలను దత్తత తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు. కార్యక్రమంలో విశ్రాంత హైకోర్టు జడ్జి జస్టిస్‌ రజని, శాప్‌ పరిశీలకులు/జిల్లా ముఖ్య శిక్షకులు బాలాజీ, భారత బాస్కెట్‌బాల్‌ సమాఖ్య టెక్నికల్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ నార్మన్‌ ఐజాక్‌, ఒలింపిక్స్‌ సంఘం తరఫున చంద్రశేఖర్‌ తదితరులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని