టీచర్లను భయపెడితే పిల్లలకు చదువురాదు: యూటీఎఫ్
ప్రాథమిక పాఠశాల వ్యవస్థను పరిరక్షించుకోవడానికి తల్లిదండ్రులతో కలిసి సామాజిక ఉద్యమం చేపడదామని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజీ శ్రీనివాసరావు అన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాసరావు
చిత్తూరు విద్య, న్యూస్టుడే: ప్రాథమిక పాఠశాల వ్యవస్థను పరిరక్షించుకోవడానికి తల్లిదండ్రులతో కలిసి సామాజిక ఉద్యమం చేపడదామని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజీ శ్రీనివాసరావు అన్నారు. యూటీఎఫ్ జిల్లా కౌన్సెల్ సమావేశం ఆదివారం స్థానిక ఓ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించడం, వారిని భయపెట్టడం ద్వారా విద్యార్థులకు విద్యరాదనే అంశాన్ని విద్యాశాఖాధికారులు గుర్తించుకోవాలన్నారు. పాఠశాలలను అధికారులు పరిశీలించడాన్ని స్వాగతిస్తామని, ఆ సమయాన ఉపాధ్యాయులను భయ భ్రాంతులకు గురిచేయడాన్ని ఖండిస్తునామన్నారు. బోధనేతర కార్యక్రమాలకు ఇచ్చే ప్రాముఖ్యత తరగతి గదిలో విద్యార్థులకు బోధన చేసేందుకు అవకాశం లేకుండా చేస్తున్నారని వాపోయారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీరమణ, సమాఖ్య జిల్లా అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రఘుపతిరెడ్డి, ఎస్ఎస్నాయుడు, జిల్లా నాయకులు మునిరత్నం, రెహనాబేగం, దక్షిణామూర్తి, శేఖర్, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాలరెడ్డి, సీఐటీయూ నాయకులు గంగరాజు, చైతన్య, పీడీఎఫ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి బాబురెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.
యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమశేఖరనాయుడు, జీవీ రమణ (కుడి వైపు నుంచి)
జిల్లా నూతన కార్యవర్గం
యూటీఎఫ్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైందని ఎన్నిక పరిశీలకులు శ్రీనివాసరావు, ఎన్నికల అధికారి, రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎస్ నాయుడు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా సోమశేఖర్ నాయుడు(ఐరాల), ప్రధాన కార్యదర్శిగా జీవీ రమణ(చిత్తూరు), గౌరవాధ్యక్షుడిగా సుధాకర్రెడ్డి(తవణంపల్లె), సహాధ్యక్షులుగా మునిరత్నం(నగరి), రెహానాబేగం(యాదమరి), కోశాధికారిగా ప్రసన్నకుమార్(గంగవరం) ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా కృష్ణమూర్తి(వి.కోట), జగన్మోహన్రెడ్డి(చౌడేపల్లె), రెడ్డప్పనాయుడు(పూతలపట్టు), సురేష్(కుప్పం), దక్షిణామూర్తి(చిత్తూరు), రూప (కార్వేటినగరం), ఏకాంబరం(ఐరాల), మణిగండన్(విజయపురం), ఈశ్వరమహేంద్ర(పులిచెర్ల), ఆడిట్ కమిటీ కన్వీనర్గా పీసీబాబు(గంగవరం), ఐక్య ఉపాధ్యాయ పత్రిక కన్వీనర్గా ఎంవీరమణ (పెద్దపంజాణి), అనుబంధ కమిటీల సభ్యులను ఎన్నుకున్నట్లు ఎన్నికల పరిశీలకులు, ఎన్నికల అధికారి ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రులకు జగన్ జబ్బు
[ 23-04-2024]
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా పేదలకు వైద్య సేవలు అందిస్తామని, ప్రభుత్వ వైద్యశాలలను రోగులకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసి ఆ మేరకు సేవలు విస్తరిస్తామని సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో హామీ ఇచ్చారు. -
ఫ్యాను పార్టీలో ఉక్కపోత
[ 23-04-2024]
వైకాపాలో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. ఐదేళ్లలో ఆ పార్టీలో గౌరవం దక్కలేదని, ప్రజలకు ఏం చేయలేకపోయామనే భావనతో ఉన్న నాయకులు, కార్యకర్తలు విసిగివేశారి సైకిల్ ఎక్కుతున్నారు. -
‘పది’లో 11 మెట్లు పైకెక్కి
[ 23-04-2024]
పదో తరగతి ఫలితాల్లో గతేడాది 17వ స్థానంలో నిలిచిన జిల్లా.. ఈ విడత ఆరో స్థానానికి చేరింది.. ముఖ్యంగా ఈసారి బాలికలదే పైచేయి. జిల్లాలో 20,939మంది(బాలురు 10,793మంది, బాలికలు 10,146మంది) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. -
44 నామినేషన్ల దాఖలు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని చిత్తూరు లోక్సభ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం 44 నామినేషన్లు దాఖలయ్యాయి. -
మాటల్లో బాగా.. చేతల్లో దగా..
[ 23-04-2024]
అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయేలా ఫిట్మెంట్ ఇస్తామని ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ హామీ ఇచ్చారు.. సీఎం అయ్యాక జగన్ ఉద్ధరిస్తారని భావిస్తే నమ్మకంగా ముంచేశారని వాపోతున్నారు. -
ఆ ఆలయం అందరికీ సెంటిమెంట్
[ 23-04-2024]
ఎన్నికల్లో పలు సెంటిమెంట్లు చూస్తుంటాం. ఆ గుడిలో పూజలు చేసి.. నామపత్రాలు దాఖలు చేస్తే.. గెలుపు తథ్యమని.. ఫలానా చోట నుంచి ప్రచారం ప్రారంభిస్తే విజయం సులువుగా వరిస్తుందని నాయకులు నమ్మి ఆచరిస్తుంటారు. -
వైకాపా పాలనలో కేసుల పరంపర
[ 23-04-2024]
అమరనాథరరెడ్డి మీద వైకాపా ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా కేసులు నమోదు చేసింది. ఈ విషయం ఎన్నికల అధికారులకు అయన సమర్పించిన అఫిడవిట్లో పొందుపరిచారు. -
ఏడాదిలోపే.. నాణ్యత లోపాలు
[ 23-04-2024]
శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఈక్రమంలో శ్రీవారి దర్శనంతోపాటు మెరుగైన వసతిని తితిదే నుంచి ఆశిస్తారు. -
జగన్ అరెస్టుతో నాకేంటి సంబంధం: కిరణ్
[ 23-04-2024]
వైకాపా అధినేత జగన్మోహన్రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే తనకేంటి సంబంధమని మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంట్ ఎన్డీయే అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. -
నాటకాల జగన్.. సీఎం పదవికి అనర్హుడు
[ 23-04-2024]
గత ఎన్నికల్లో కోడికత్తి, బాబాయ్పై గొడ్డలి వేటు నాటకాలు ఆడి గద్దెనెక్కిన జగన్.. అరాచక పాలన సాగించారు. మళ్లీ ఇప్పుడు గులకరాయి డ్రామాకు తెరతీశారు. -
దంపతులపై వైకాపా నాయకుల దాడి అమానుషం
[ 23-04-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్కు వెళ్లారని ముస్లిం దంపతులపై వైకాపా నాయకులు దాడి చేసి, చంపేస్తామని బెదిరించడం అమానుషమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. -
ఈ ఆస్పత్రుల్లో ఎలా జగన్..
[ 23-04-2024]
ప్రభుత్వాసుపత్రుల్లో అసౌకర్యాలు తాండవిస్తున్నాయి. రోగులకు సరిపడా గదులు లేవు.. వరండాల్లోనే వైద్యసేవలు పొందాల్సిన దుస్థితి. -
పూతలపట్టులో.. తెదేపాకు ఒక్క అవకాశమివ్వండి...!
[ 23-04-2024]
పూతలపట్టులో తెదేపాకు ఒక్క అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపుతానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీ మోహన్ అన్నారు. -
ఉత్తీర్ణత పెరిగి.. స్థానం దిగజారి
[ 23-04-2024]
పది పరీక్ష ఫలితాలు జిల్లాను కాస్త నిరుత్సాహ పరిచాయి. గతేడాది రాష్ట్రస్థాయిలో ఎనిమిదో స్థానంలో నిలవగా ఈసారి రెండు స్థానాలు దిగజారి పదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. -
జగనన్న పీఆర్సీ.. తీరని ద్రోహం
[ 23-04-2024]
ఎంతసేపు వెట్టిచాకిరీ చేయించుకున్నారే తప్ప ఈ ఐదేళ్లలో ఏనాడూ తమపక్షాన నిలబడింది లేదని.. నిజానికి జగనన్న పాలనలో వాలంటీర్కు ఇచ్చిన విలువకూడా ఇవ్వలేదని.. నెరవేరని హామీలు, రివర్స్ పీఆర్సీనే అందుకు నిదర్శనమన్న ఆవేదన ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ